ఒసామా బిన్ లాడన్ ను ఎలా చంపారో సీఐఏ ట్వీట్లు..
posted on May 2, 2016 5:49PM

అగ్ర దేశాలను సైతం గడగడలాడించి.. ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడన్ హతమై నేటికి సరిగ్గా ఐదు సంవత్సరాలు పూర్తయింది. 2011 మే 2 వ తేదీన పాకిస్థాన్ లోని అబాటోబాద్ లో ఆర్మీ క్షేత్రాన్ని ఆనుకున్న ఉన్న రెస్ట్ హౌస్ లో ఉన్న బిన్ లాడెన్ పై అమెరికా భద్రతా దళాలు ఒక్కసారిగా ఉప్పెనలా వెల్లువెత్తి క్షణాల్లో మట్టుబెట్టి.. మృతదేహాన్ని తీసుకొచ్చి సముద్రంలో పడేసిన సంగతి తెలిసిందే. అయితే బిన్ లాడెన్ పై దాడి చేసి ఇప్పటికి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా సీఐఏ మరోసారి అప్పటి ఆపరేశషన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మరోసారి తన ట్విట్టర్లో చాలా డిటైల్డ్ గా తెలిపింది. నాడు ఆపరేషన్ 'నెఫ్ట్యూన్ స్పియర్' పేరుతో అమెరికా సీల్స్ విశాలమైన కాంపౌండ్ కలిగిన అబోటాబాద్ లో లాడెన్ ఇంటిపై హెలికాప్టర్ తో దిగడం, వాయువేగంతో ఒక్కక్కరిని మట్టుబెట్టుకుంటూ లోపలికి వెళ్లడం, మూడవ అంతస్తులో ఉన్న లాడెన్ ను మట్టుబెట్టి తీసుకెళ్లిన విధానాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రాలతో సహా ట్విట్టర్ లో సీఐఏ మరోసారి వివరించింది. మీరు కూడా ఓ లుక్కేయండి..


.jpg)
.jpg)
