చంద్రబాబు, వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం

 

 

 

నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ మొదటి ముహూర్తాన్ని అనుసరిస్తూ ఉదయం 11.52 నిమిషాలకు అసెంబ్లీ ప్రాంగణంలోని పాత శాసన సభా భవన మందిరంలో సభ సమావేశం అయ్యింది. సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ పతివాడ నారాయణస్వామి నాయుడు సభా మర్యాదలు సభ్యులకు తెలిపారు.అనంతరం టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu