ఏపీ అసెంబ్లీ.. జీఎస్టీ బిల్లు ఆమోదం...


జీఎస్టీ బిల్ల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈరోజు ప్రత్యేకంగా సమావేశమైన ఏపీ ఆసెంబ్లీ జీఎస్టీ బిల్లుపై చర్చ జరిపి ఆమోద ముద్ర వేసింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు. పలువురి సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపిన తర్వాత బిల్లును ఆమోదించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా జీఎస్టీ అమలు జరుగుతోంది.. జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతేకాదు పన్నుల విధానంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే కేంద్ర జీఎస్టీ బిల్లు తీసుకొచ్చిందని... దేశంలో ఒకే పన్ను విధానమే ఈ బిల్లు లక్ష్యమని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu