గుప్తనిధుల కోసం వినాయక విగ్రహం ధ్వంసం.. 13 మంది ముఠా అరెస్టు

 

అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి స్కూల్ వద్ద గుప్తనిధుల కోసం వినాయక విగ్రహాన్ని పగులగొట్టి త్రవ్వకాలకు పాల్పడిన 13 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో  రాజంపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్  బీ.వి.రమణ మాట్లాడుతూ గుప్తనిధుల కోసం వినాయకుడి విగ్రహం పగలు గొట్టిన ఘటనపై  పెనగలూరు పోలీస్ స్టేషన్  లో కేసు నమోదు అయ్యింద న్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే  సూచనలతో దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. పెనగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గతనెల 24  తేది తెల్లవారుజామున ఓబిలి స్కూలు ఆవరణలో దొంగతనం జరిగిన వినాయక విగ్రహం కేసులో వచ్చిన నమ్మకమైన సమాచారం అందిందన్నారు. 

ఈ మేరకు, పెనగలూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్, బి.రవి ప్రకాష్ రెడ్డి మరియు సిబ్బంది పెనగలూరు  పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండూరు క్రాస్ రోడ్ వద్ద ఈ రోజు శనివారం అనుమానాస్పదంగా తిరుగుతున్న 13 మందిని విచారించారించారని తెలిపారు .వారు గత నెలలో ఓబిలి స్కూలు ఆవరణలో వినాయక విగ్రహ దొంగతనం గురించి తెలుపడం జరిగిందన్నారు. నందలూరు మండలం మదనగోపాలపురం కు చెందిన చుక్కా రవి అను వ్యక్తి గుప్త నిధుల కోసం చిట్వేలి కి చెందిన కొంత మంది కనిశెట్టి వెంకటసుబ్బయ్య, చిట్వేలి సుబ్బరాయుడు, ఆర్కాటు భాస్కర్  మరియు ఈటిమార్పురం నకు చెందిన డొంకా చంద్ర, బైర్రాజు సుధాకర్ రాజు లతో మాట్లాడుకొని గుప్త నిధులు వెలికి తీయాలనే ఉద్దేశ్యంతో చుక్క రవి వియ్యంకుడు అయిన మనుబోలు కు చెందిన సురేష్ ద్వారా నెల్లూరు లో రాపూరు లక్ష్మమ్మ @ రాపూరు లక్ష్మి, మునుసామి వేలురెడ్డి @పూజారి, గోకిల రమేష్ @ కోకిల రమేష్, ముసునూరు పుల్లారెడ్డి మరియు క్షుద్ర పూజలు చేసి గుప్త నిధులు వెలికి తీయడం కోసం వారిని మాట్లాడుకొన్నారని తెలిపారు. 

అదేవిధంగా గుప్త నిధులు పైన ఆసక్తి ఉన్న పెనగలూరు కు చెందిన దాసరి వెంకట నరసమ్మ ,సుధాకర్ రాజు, చంద్ర వారి దగ్గర పనిచేసే ఇద్దరు వ్యక్తులు సుకదేబ్ రైతో, కలక్వాడ్ శ్యాం లతో పాటుగా అందరూ కలిసి గత నెల 23 తేది రాత్రి  ముఠాగా ఏర్పడి ఓబిలి స్కూలు వద్దకు చేరికున్నారని, వేకువ జామున సదరు వినాయక విగ్రహాన్ని ఈడ్చుకుంటూ ఒదేటివారిపల్లి గ్రామానికి వెళ్ళే దారిలో ఒక ట్రాక్టర్ లో వేసి  అక్కడ నుండి ఈటిమార్పురం చెరువు దగ్గరకు వెళ్లి, అక్కడ విగ్రహాన్ని దింపి, గుప్త నిధుల కోసం పూజలు చేసి సమ్మెట తో విరగకొట్టగా,  విగ్రహంలో ఎటువంటి నిధులు లేకపోవడంతో  విగ్రహాన్ని అక్కడే ఉన్న కుంట లో పడి వేశారన్నారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన వాహనాలు ఒక ట్రాక్టర్, ఒక ఇన్నోవా కారు, నాలుగు మోటార్ సైకిల్ లు, ఒక సమ్మెట లను, వస్తువులను సీజ్ చేయడం అయినదని. సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా ముద్దాయిలను గుర్తించడం అయినదని తెలిపారు. ఈ  కేసులో ప్రతిభ  కనబరిచిన పోలీస్ అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ శవి.విద్యాసాగర్ నాయుడు  అభినందించారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu