ఏపీ మంత్రివర్గ సమావేశం.. పేపర్ లేకుండా...

 

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది., గతంలో జరిగిన మంత్రివర్గ సమావేశాల కంటే ఇది చాలా విభిన్నమైన మంత్రివర్గ సమావేశం. ఒక్క ఆంధ్రపదేశ్ మంత్రివర్గ సమావేశానికి సంబంధించినంతవరకు మాత్రమే కాకుండా దేశంలోనే ఇది అత్యంత విభిన్నమైన మంత్రివర్గ సమావేశం. ఎందుకంటే ఈ సమావేశంలో అసలు ఎంతమాత్రం కాగితాలు ఉపయోగించకుండా నిర్వహించారు. ఇది పేపర్ రహిత మంత్రివర్గ సమావేశం. కేవలం ఐ ప్యాడ్లు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల ద్వారానే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఏ సందర్భంలోనూ పేపర్, పెన్ ఉపయోగించలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu