భార్యని గొడ్డలితో నరికి చంపిన భర్త

 

కట్టుకున్న భార్యనే గొడ్డలితో నరికి చంపాడు ఓ భర్త. అనంతపురం జిల్లా కదిరి మండలం కట్టెలతండాలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టెల తండాకు చెందిన పారేసు నాయక్ తన భార్య భానుభాయ్ ని తరుచూ అనుమానిస్తూ వేధించేవాడు. అయితే ఆదివారం రాత్రి పారేసు నాయక్ తన భార్యతో గొడవపడ్డాడు. తరువాత ఆమె నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. మృతురాలు సోదరుల ఫిర్యాదు మేరకు కదిరి సీఐ సత్యబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu