ప్రధాని నరేంద్ర మోడీకి సమన్లు... 2002 గోధ్రా కేసు

 

గుజరాత్ అల్లర్ల కేసులో భారత ప్రధాని నరేంద్రమోడీకి న్యూయార్క్ ఫెడరల్ కోర్టు సమన్లు జారీ చేసింది. అమెరికాలకు చెందిన పౌర హక్కుల సంస్థ, ఇద్దరు గుజరాత్ అల్లర్ల బాధితుల ఫిర్యాదు మీద స్పందించిన ఫెడరల్ కోర్టు నరేంద్ర మోడీకి సమన్లు జారీ చేసింది. అమెరికా కోర్టు మోడీకి సమన్లు పంపడాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలోనే వున్నారు. ఇలాంటి సమయంలోనే అమెరికా కోర్టు మోడీకి సమన్లు జారీ చేయడం చర్చనీయాంశం అయింది. గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అమెరికా వెళ్ళిన సమయంలోనే అక్కడి కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu