విపక్షాలు అందుకే తట్టుకోలేకపోతున్నాయి.. కేఈ


 

ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రతిపక్షాలతీరుపై మండిపడ్డారు. ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని.. ఈ కార్యక్రమం అంతలా విజయవంతం అయిందనే ప్రతిపక్షాలు తట్టుకోలేక పోతున్నాయని అన్నారు. అందుకే అనవసరమైన విమర్శుల చేస్తూ.. నిరసనలు చేస్తూ కొంతమంది నేతలు విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు శక్తి, సామర్ధ్యాలు ఏంటో అందరికి తెలిసిందని అన్నారు. అందుకే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అని విమర్శించారు. అంతేకాదు త్వరలోనే మీ ఇంటికి - మీ భూమి రెండో విడుత కార్యక్రమం చేపడుతున్నామని.. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రెవెన్యూశాఖలో అలసత్వం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఫిర్యాదుల స్వీకరణకు జిల్లాస్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu