అమరావతి కోసం డబుల్ బెడ్ రూం వాయిదా
posted on Oct 21, 2015 2:50PM

ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవాన్ని సైతం వాయిదా వేసుకున్నారు, హైదరాబాద్ సనత్ నగర్ ఐడీహెచ్ కాలనీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను షెడ్యూల్ ప్రకారం ప్రారంభించాల్సి ఉన్నా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లాలని డిసైడైన కేసీఆర్... ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు, ప్రధాని మోడీతోపాటు పలువురు దేశ విదేశీ ప్రముఖులు హాజరుకానుండటం, పైగా చంద్రబాబే స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానించిన నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు, తెలంగాణ సంస్కృతిమంచిదన్న కేసీఆర్... మర్యాద ఇచ్చిపుచ్చుకునే ఉద్దేశంతోనే ఏపీ రాజధాని శంకుస్థాపనకు వెళుతున్నానని తెలిపారు, అయితే రోడ్డుమార్గంలో వెళ్లాలని అనుకున్నా... అధికారుల సూచన మేరకు హెలికాప్టర్ లోనే అమరావతికి వెళ్లనున్నారు