ఆలె నరేంద్ర కన్నుమూత : బీజేపీలో విషాదం

 

భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు ఆలె నరేంద్ర (68) బుధవారం మరణించారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో వున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరేంద్ర మరణించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఆలె నరేంద్రని ఆయన అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ‘టైగర్’ అని పిలుచుకుంటారు. నరేంద్ర ఆర్ ఎస్ ఎస్ లో చురుకైన కార్యకర్తగా పనిచేశారు. చాలాకాలం బీజేపీ నాయకుడిగా కొనసాగిన ఆయన ఆ తర్వాత తెలంగాణను కోరుకుంటూ ఒక రాజకీయ వేదికను ప్రారంభించారు. ఆ తర్వాత కేసీఆర్‌తో కలసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన నరేంద్ర కేసీఆర్‌తో విభేదాలు రావడంతో టీఆర్ఎస్ నుంచి బయటకి వెళ్ళిపోయి, తిరిగి భారతీయ జనతాపార్టీలో చేరారు. నరేంద్ర మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీలో విషాదకర వాతావరణం ఏర్పడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu