మొన్ననే ఎమ్మెల్యే అయ్యాడు..అంతలోనే

నిన్న గాక మొన్న ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. కాని ఆ ఆనందం కొద్ది రోజులు కూడా నిలవలేదు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని తిరుప్పరంగుండ్రం నియోజకవర్గం నుంచి శీనివేల్ అనే వ్యక్తి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో గుండెనొప్పి రావడంతో ఆయన్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. అయితే శీనివేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన మరణించకపోయినప్పటికి మరణించినట్టు పుకార్లు వ్యాపించాయి. వీటిని ఆయన కుటుంబసభ్యులు, కార్యకర్తలు ఖండించారు. అయితే నిన్న అర్థరాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. శీనివేల్ మృతిపట్ల అన్నాడీఎంకే నేతలు సంతాపం తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu