విమాన ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి
posted on Jun 12, 2025 4:46PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్లో తన అకౌంట్ డీపీ & కవర్ పీక్ను నలుపు రంగులోకి మార్చింది. కాగా ఈ ప్రమాద నేపథ్యంలో ఎయిర్ ఇండియాపై నెట్టింట విమర్శస్తున్నాయి. లండన్ వెళ్లే విమాన పరిస్థితిని చెక్ చేయకుండా టేకాఫ్ చేస్తారా అంటు నెటిజన్లు మండిపడుతున్నారు. విమాన ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్లో నేలకూలిన విమానాన్ని కెప్టెన్ సుమిత్ సభర్వాల్ నడిపినట్లు DGCA వెల్లడించింది. ఆయనకు 8200 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. అలాగే కోపైలట్గా 1100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ATC ప్రకారం మ.1.39 గం.కు విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయింది. వెంటనే ATCకి ఎమర్జెన్సీ కాల్ వెళ్లింది. ఆ తర్వాత విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 110 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణీకులు మరియు సిబ్బంది కుటుంబాలు అనుభవిస్తున్న బాధ, ఆందోళన ఊహించలేనిదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయం చేయడానికి తమ వంతు కృషి చేయాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఈ విమాన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడాలని ఆయన కోరారు. సహాయక చర్యలను సమర్థవంతంగా చేపట్టాలని కేంద్రానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు సంఘీభావంగా ఈరోజు తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సభ ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.