కాబూల్ లో భారత మహిళ కిడ్నాప్..

 

ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఆప్ఘనిస్థాన్లో మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో నిన్న భారత సంసతికి చెందిన ఓ మహిళను ఉగ్రవాదులు అపహరించారు. వివరాల ప్రకారం.. కోల్ కతాకు చెందిన జుదిత్ డిసౌజా అనే మహిళ స్వచ్ఛంద సంస్థ అగా ఖాన్ ఫౌండేషన్ లో పనిచేసేందుకు గాను కాబూల్ కు వెళ్లారు. అయితే అక్కడ కార్యాలయం నుండి తన సహోద్యోగులతో కలిసి బయటకు వస్తుండగా వారందరిని తాలిబన్లు అపహరించారు. దీంతో సమాచారం తెలుసుకున్న భారత రాయబార కార్యాలయం అఫ్ఘన్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు మొదలుపెట్టింది. వీలయినంత త్వరలో డిసౌజాతో సహా కిడ్నాప్ నకు గురైన వారందరిని విడిపించేందుకు యత్నిస్తున్నట్లు అఫ్ఘన్ అధికారులు చెప్పారు.