కుక్కకి ఆధార్ కావాలన్న తింగరోడు

 

తనతో పాటు తన కుక్కకి ఆధార్ కార్డ్ కావాలని ధరఖాస్తు చేసుకున్నాడు ఓ తింగరోడు. ఈ విచిత్రమైన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని రాజాపూర్ లో మనీశ్ కుమార్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతను గత మార్చి నెలలో తన కుక్క ఫోటోతో పాటు తప్పు సమాచారాన్ని నింపి ఆన్ లైన్ లో ధరఖాస్తు పెట్టాడు. అది కాస్తా ప్రభుత్వ అధికారుల కంట పడింది. మనీశ్ పెట్టిన దరఖాస్తును వారు తిరస్కరించి ఈ తిక్కలి పనికి పాల్పడినందుకు అతనిపై కేసు పెట్టారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని చూసి చివరికి తనే ఇరుకున పడ్డాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu