కాకినాడలో దారుణం.. నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్ళి అత్యాచారం... 

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. ఒక ఆగంతకుడు ఇంట్లో నిద్రిస్తున్న అయిదేళ్ల బాలికను తెల్లవారుజామున ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో మంచంపై పాప కనిపించకపోవడంతో.. ఆ బాలిక తండ్రి, నాయనమ్మ వెతకడం మొదలు పెట్టగా చివరకు బాలిక ఊరి చివర దేవాలయం వద్ద కనిపించింది. అయితే ఆ బాలిక ఒంటిపై దుస్తులు లేకపోవడంతో పాటు శరీరంపై గాయాలు కనిపించాయి. వెంటనే ఆ బాలికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులకు చెప్పకుండా చికిత్స అందించడానికి డాక్టర్లు నిరాకరించారు. దీంతో డాక్టర్ల పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu