శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.

ఈ ఉదయం (జూన్ 3) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది.

శుక్రవారం (జూన్ 2) శ్రీవారిని 76వేల963 మంది భక్తులు దర్శించుకున్నారు. 37వేల 422 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2.97 కోట్ల రూపాయలు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu