యూపీలో ఘోర ప్రమాదం..22 మంది దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బరేలీ సమీపంలో బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 22 మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు బస్సు ఢిల్లీ నుంచి తూర్పు యూపీలోని గోండా జిల్లాకు వెళ్తుండగా బరేలీ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డీజీల్ ట్యాంక్ పగలడంతో మంటలు చెలరేగి రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో బస్సులో ఉన్నవారికి ఊపిరి ఆడక 22 మంది మరణించారు. ప్రయాణీకులంతా గాఢ నిద్రలో ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu