విజయమ్మకు షాకిచ్చిన తెలంగాణవాదులు

 

ys vijayamma, vijayamma telangana, ysr congress telangana issue

 

 

తెలంగాణాలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మకు తెలంగాణావాదులు షాకిచ్చారు. ఈ నెల 25 నుంచి విజయమ్మ తెలంగాణాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పర్యటనలో బాగంగా శుక్రవారం తెలంగాణ జిల్లాలకు వెళ్ళడానికి బయలుదేరారు. ఈ సమయంలో ఉప్పల్ బస్సు డిపో వద్ద తెలంగాణావాదులు ఆమె కాన్వాయి ని అడ్డుకొని తెలంగాణ నినాదాలు చేశారు. విజయమ్మ వ్యక్తిగత గత సిబ్బంది వాళ్ళను తప్పించేందుకు ప్రయత్నించగా, అక్కడ పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో విజయమ్మ భద్రతా సిబ్బందికి స్వల్పంగా గాయాలు అయ్యాయి.