సుబ్బిరామిరెడ్డి వెనక్కి తగ్గినట్లేనా?

 

రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి, కాంగ్రెస్ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు తన మీద లేనిపోని అభాండాలు వేసినందుకు రూ.5కోట్లకి పరువు నష్టం దావావేస్తానంటూ శివ తాండవం చేశారు. ఆ ప్రోగ్రాం తరువాత ఆయనకి లీగల్ నోటీసులు కూడా పంపడం జరిగింది. అయితే, ఆయన ఊహించినట్లు వెంకటేశ్వర రావు భయపడి క్షమాపణలు చెప్పకపోగా, సుబ్బిరామి రెడ్డి కోర్టుకి వెళ్ళదలిస్తే తనకేమి అభ్యంతరం లేదని, దాని వల్ల ఆయన గురించి మరిన్నినిజాలు బయటకి వస్తాయంటూ చెప్పడంతో రెడ్డి గారు గతుక్కుమన్నారు. కానీ, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, సాటి కాంగ్రెస్ సభ్యుడు గనుక వెంకటేశ్వర రావుకి మరో పదిరోజులు గడువు ఇస్తున్నాంటూ తనకి క్షమాపణలు చెప్పడానికి గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అయితే, ఆ గ్రేస్ పీరియడ్ కూడా ఇటీవలే ముగిసినప్పటికీ, రెడ్డిగారు పరువు నష్టం గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. అసలే ఇది ఎన్నికల సీజను. పరువు నష్టమని కోర్టుకి వెళితే ఉన్న పరువు కూడా పోతుందని మరి వెనక్కి తగ్గారో ఏమో?