మాల్యా విషయంలో ఈడీ మరోసారి ఝలక్...
posted on Jun 6, 2016 10:22AM

బ్యాంకులకు వేలాది కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన మాల్యా విషయంలో ఈడీకి అప్పుడప్పుడు ఝలక్కులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి మాల్యా వ్యవహారంలో ఈడీకి ఎదురుదెబ్బ తగిలింది. మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఈడీ ఇంటర్ పోల్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు లేఖను పరిశీలించిన ఇంటర్ పోల్.. వెంటనే మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేం.. అలా చేయాలంటే తమకు మరింత సమాచారం కావాలని ఈడీకి ఓ లేఖ రాసింది. ఇక దీనిపై స్పందించిన ఈడీ.. పలు కేసుల్లో ఇంటర్ పోల్ ఇలాంటి సమగ్ర సమాచారం కావాలని కోరడం సాధారణమే.. ఇదేమి ఎదురుదెబ్బ కాదు.. ఇంటర్ పోల్ లేఖకు త్వరలోనే సమాధానం ఇవ్వనున్నామని, ఆ తర్వాత మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అవుతాయని ధీమా వ్యక్తం చేసింది.