టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు
posted on Aug 14, 2013 2:47PM
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తప్పుడు పౌరసౌత్వ ధ్రువీకరణ పత్రం ఇచ్చినందున ఆయన ఎన్నిక చెల్లదని కోర్ట్ తీర్పునిచ్చింది. రమేష్ ఎన్నికపై ప్రత్యర్ధి ఆది శ్రీనివాస్ కోర్టుకు వెళ్లారు. దీనిపై కోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చింది. రమేష్ జర్మనీ పౌరసత్వం, భారత పౌరసత్వం కలిగి ఉన్నారని, జర్మనీ ప్రభుత్వం నుండి వేతనం అందుకుంటున్నాడని ఆది శ్రీనివాస్ ఆరోపిస్తూ కోర్టు కెక్కారు. ఆయన ఇక్కడ రాజకీయాలలోకి వచ్చి రెండువేల తొమ్మిదిలో టిడిపి తరపున గెలిచారు. ఆ తర్వాత ఆయన టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరి తిరిగి ఉప ఎన్నికలో గెలుపొందారు.