తెలంగాణాపై సోనియా మాటే ఆలస్యం!

 

telangana issue, sonia gandi telangana, Sushilkumar Shinde

 

 

తెలంగాణాపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేయడానికి కేంద్ర హోం శాఖ సిద్దంగా ఉందని కేంద్ర హోం మంత్రిసుశీల్ కుమార్ షిండే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సోనియాగాంధీ అన్నింటికంటే ఎక్కువగా తెలంగాణకు ప్రాధాన్యతనిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమస్యకు సాధ్యమైనంత త్వరలో స్పష్టమైన పరిష్కారం చూపాల్సిందిగా ఆదేశించారని షిండే చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై సీడబ్ల్యూసీలో నిర్ణయం ప్రకటించవచ్చునని అంటున్నారు. తెలంగాణతో సీమకు చెందిన 2 జిల్లాలు కలిపి హైదరాబాద్‌ను రాజధానిగా కొనసాగించడమా, లేక హైదరాబాద్‌ను 'యూటీ'గా కొనసాగించడమా, లేక మరో ప్రతిపత్తి కలిగించడమా అన్న అంశంపై తర్జన భర్జనలు జరిగాయని, ఈ విషయంలో ఒక స్పష్టత రాలేదని ఈ వర్గాలు అంటున్నాయి.