ప్రజల ఆరోగ్యంపై దృష్టి.. వైద్య సదుపాయలకు ప్రోత్సాహకాలు..
posted on Mar 14, 2016 12:42PM

2016-17 సంవత్సరానికి గాను ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి వైద్య సదుపాయల పట్ల బాగానే దృష్టి సారించారు. ఈ సందర్బంగా ఈటెల మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి అని ఈటల పేర్కొన్నారు. అన్నట్టుగానే గతేడాది కంటే ఈ ఏడాది రూ.1036 కోట్లు అదనంగా ఆరోగ్య శాఖకు కేటాయించారు.
* పీహెచ్సీల నుంచి నిమ్స్ వరకు అన్ని ఆసుపత్రుల్లో సమూల మార్పులు
* ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు
* గ్రామాల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహం
* రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తాం
* 40 చోట్ల డయాలసిస్, 40 చోట్ల డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు
* హైదరాబాద్లో పెరిగిన ప్రజల అవసరాల దృష్ట్యా మరో 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు