సీఐడీ కార్యాలయంలో భూమన..


తుని ఘటనలో భాగంగా వైసీపీ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో భాగంగా ఆయన ఈరోజు విచారణకు హాజరయ్యారు. తిరుపతి నుంచి బయలుదేరిన ఆయన గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపట్లో ఆయనను సీఐడీ అధికారులు విచారించనున్నారు. భూమన వెంట వైసీపీ కీలక నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అంబటి రాంబాబులు కూడా సీఐడీ కార్యాలయానికి వచ్చారు. కాగా ఈ కేసులో భాగంగా ఇప్పటికే సీఐడీ అధికారులు పలువురికి నోటీసులు జారీ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu