మీడియాపై అశ్విన్ ఫైర్.. పదే పదే ఎందుకు అడుగుతారు..?

 

క్రికెటర్స్ అప్పుడప్పుడు మీడియాపై ఆగ్రహం చెందుతూనే ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలో టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కూడా చేరిపోయారు. ఇండియన్ పిచ్ గురించి మీడియా ఈయనను ప్రశ్నలడగగా సహనం కోల్పోయిన రవిచంద్రన్ అశ్విన్ ఆగ్ర‌హం వ్యక్తంచేశాడు. పిచ్ గురించి మీ కామెంట్ ఏంట‌ని ప్ర‌శ్నించ‌గా.. రోజంతా మ్యాచ్‌ను చూసే మీడియానే త‌మ కంటే బాగా పిచ్ గురించి చెప్ప‌గ‌ల‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. పిచ్‌పై ప‌దే ప‌దే ప్ర‌శ్నలు ఎందుకు అడుగుతారో అర్థం కాద‌ని అశ్విన్ అన్నాడు. ఏదో ఒక‌రోజు ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌ల‌లో పిచ్‌ల గురించి స‌మాధానం చెప్ప‌డం తాను ఆపేస్తాన‌ని చెప్పాడు.