విజయవాడ నుంచి నామినేషన్ కి పురందేశ్వరి రెడీ.!
posted on Apr 18, 2014 3:15PM
విజయవాడ బీజేపీ లోక్సభ అభ్యర్థిగా పురందేశ్వరి రేపు విజయవాడలో నామినేషన్ వేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ల పొత్తు వ్యవహారం గందరగోళంలో పడటంతో ఇరు వర్గాలూ ఇప్పుడు తమ తమ వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ చాలా నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. పొత్తు భాగంగా తెలుగుదేశం పార్టీకి అప్పజెప్పిన సీట్లలో ఇప్పుడు బీజేపీ తరపున నామినేషన్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి కొన్ని కీలకమైన నియోజకవర్గాలను మాత్రం వదులకోకూడదని బీజేపీ భావిస్తోందట. టీడీపీతో పొత్తులేదని అధికారికంగా ప్రకటన వెలువడిన వెంటనే విజయవాడ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగనున్నట్లు తెలుస్తోంది.