వైసీపీ పిశాచాల్లారా.. ఇంత దిగజారారేంట్రా!?

అధికారం కోసం ఈ వైసీపీ పిశాచాలు అశుద్ధ భక్షణకు కూడా రెడీ అయ్యేట్టున్నాయి. చేజారిపోబోతున్న అధికారాన్ని మళ్ళీ ఎలాగైనా దక్కించుకుని, రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలన్న ఉద్దేశంతో వైసీపీ నాయకులు పాతాళానికి దిగజారిపోతున్నారు. జూనియర్ఎన్టీఆర్ వైసీపీకి ప్రచారం చేస్తున్నట్టుగా, వైసీపీకే ఓటు వేయాలన్నట్టుగా ప్రకటనలు రెడీ చేసి సోషల్ మీడియాలోకి వదిలిపెడుతున్నారు. ఆ ప్రకటనల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతోపాటు ‘‘మా నాన్నగారి మరణానతరం నేను రాజకీయాలకు దూరంగా వుంటున్నాను. కానీ, సొంత రాజకీయ లబ్ధి కోసం ఆర్థికంగా వెనకబడి వున్న ముస్లిం మైనారిటీల 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామంటున్న బీజేపీతో కలసి ముస్లిం మైనారిటీలకు ద్రోహం చేయడం సరికాదు. దీనివల్ల ఎస్సా్ర్‌సీపీ గెలుపు అనేది దాదాపు ఖాయం అయినట్టే’’ అని మేటర్ కూడా వుంది. ఈ మేటర్ రాసిన ఫేక్‌గాళ్ళకి మేటర్ రాయడం కూడా వచ్చి చావదు. ‘గెలుపు ఖరారు అయినట్టే’ అని రాసి ఏడవచ్చుగా, ‘గెలుపు దాదాపు ఖరారు’ అయినట్టే అని రాశారు. అంటే, ఈ ఫేక్‌గాళ్ళకి కూడా తమ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం పూర్తిగా లేదన్నమాట. ఈ ప్రకటనలు చూసిన ఏపీ జనం ఓరి మీ మొహాలు మండ మరీ ఇంత దిగజారిపోయారేంట్రా అని తిట్టుకుంటున్నారు.