జగన్ మళ్ళీ వస్తే చంద్రబాబుని చంపిస్తాడు!!
posted on May 9, 2024 10:17PM
జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని చంపిస్తాడా? అవునని అంటున్నాడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే కచ్చితంగా చంద్రబాబుని హత్య చేయిస్తాడని దస్తగిరి కుండ బద్దలు కొట్టాడు. ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దస్తగిరి ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన వెనుక చంద్రబాబు వున్నాడని జగన్, అతని అనుచరులందరూ ఆరోపణలు చేస్తూ వుంటారని, వాటిలో ఎంతమాత్రం నిజం లేదని దస్తగిరి చెప్పాడు. చంద్రబాబుతో తనకు ఏదైనా లావాదేవీ వుంటే, ఈ ఐదేళ్లలో మీ పార్టీనే అధికారంలో వుంది కదా? ఆధారాలతో సహా బయటపెట్టి వుండొచ్చు కదా అని జగన్ని దస్తగిరి ప్రశ్నించాడు. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడంటే చంద్రబాబుతోపాటు తనని, సునీతని, మరికొందరిని తప్పకుండా చంపిస్తాడని దస్తగిరి అన్నాడు. ఈ ఘోరాలు జరగకుండా వుండాలనే తాను మళ్ళీ జగన్ అధికారంలోకి రాకూడదని, టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని దస్తగిరి అన్నాడు. ఈ ఐదేళ్ళుగా జరిగిన దారుణాలు ఆగిపోవాలంటే జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని దస్తగిరి అభిప్రాయపడ్డాడు. నేను హత్య చేశాను అని ధైర్యంగా చెబుతున్నానని, ఈ కేసులో లేనివాళ్ళని ఇరికించాల్సిన అవసరం తనకు లేదని దస్తగిరి వివరించాడు.