‘భూత్‌నాథ్ రిటర్న్స్’ చూసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

 

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అమితాబ్ బచ్చన్ నటించిన తాజా చిత్రం ‘భూత్‌నాథ్ రిటర్న్స్’ని చూశారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించిన ప్రత్యేక షోలో ఆయన ఈ సినిమాని చూశారు. ఈ సినిమాలో ఒక భూతం ఎన్నికలలో నిలబడటం, ఓటు హక్కుని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్పడం.. ఇలాంటి సందేశాత్మక కథాంశంతో రూపొందిన చిత్రం కావడంతో ఆయన ఈ సినిమాని ప్రత్యేకంగా చూశారు. ఈ షోలో రాష్ట్రపతితోపాటు కథానాయకుడు అమితాబ్ బచ్చన్, ఇతర నటీనటులు, యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రం చూసిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ మంచి చిత్రాన్ని రూపొందించారంటూ యూనిట్ సభ్యులను అభినందించారు. జ్ఞాపికలను అందించారు.