ఆఎ్ఘాన్‌ – భారత్‌ ఫ్రెండ్‌షిప్‌ డ్యామ్ ను ప్రారంభించిన మోడీ...

 

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ హెరాత్‌లోని ఆఎ్ఘాన్‌ – భారత్‌ ఫ్రెండ్‌షిప్‌ డ్యామ్‌(సల్మా డ్యామ్‌)ను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆఎ్ఘాన్‌- భారత్‌ ఫ్రెండ్‌షిప్‌ డ్యామ్‌గా పేరు పెట్టడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ డ్యామ్‌ నిర్మాణంతో ప్రజల జీవితాల్లో వెలుగులు చిగురిస్తాయని అన్నారు. గత డిసెంబర్‌లో పార్లమెంట్‌ భవనం ప్రారంభించేందుకు ఆప్ఘనిస్తాన్‌ వచ్చినట్లు చెప్పారు. సల్మా డ్యామ్‌.. ఆప్ఘనిస్తాన్‌ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu