అమెరికాకు తొలిసారిగా ఆ పురస్కారం..

ఆంగ్ల సాహిత్యంలో అత్యున్నత పురస్కారంగా భావించే మ్యాన్ బుకర్ ప్రైజ్ ఇంతవరకు అమెరికా దక్కింది లేదు. ఎందుకంటే బుకర్ ప్రైజ్ నియమావళి ప్రకారం దానిని కామన్‌వెల్త్ దేశాల్లోని రచయితలకు మాత్రమే ఇవ్వాలి. అందువల్ల ఆ పురస్కారం ఇప్పటికి అగ్రరాజ్యానికి అందని ద్రాక్షగానే ఉంది. అయితే ఇప్పుడు ఆ కలను నిజం చేశారు పాల్ బీటీ. ఆయన రచించిన "ద సెల్‌ఔట్" నవలకు ఈ ఏడాది బుకర్ ప్రైజ్ వరించింది. తన స్వస్థలమైన లాస్ ఏంజిల్స్‌ నేపథ్యంగా తీసుకుని జాతుల మధ్య సమానత్వం కోసం వ్యంగ్యంగా పాల్ బీటీ ఈ రచన చేశారని, ఈ నవల దిగ్భ్రాంతికరంగా ఊహించని రీతిలో హాస్యాన్ని పండించిందని జ్యూరీ కొనియాడింది. "మ్యాన్ బుకర్ ప్రైజ్" సంప్రదాయబద్ధంగా కామన్‌వెల్త్ దేశాల రచయితలకు ప్రదానం చేస్తూ వస్తున్నారు. అయితే 2013లో నిబంధనలను మార్చి ఇంగ్లీష్ మాట్లాడే దేశాల రచయితలకు ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయించడంతో అమెరికాకు తొలిసారిగా ఈ గౌరవం దక్కింది.