మందకృష్ణ చంపేస్తా నన్నాడు

 

 

 

ఈమధ్యే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ప్రాణభయంతో వణికిపోతున్నాడు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాడని అంటున్నాడు. ఎంఆర్‌పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, అందుకే తాను ప్రాణభయంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని ఆకుల రాజేందర్ భయపడిపోతూ చెబుతున్నాడు. మందకృష్ణ బెదిరింపులు చూసి తన కుటుంబ సభ్యులు భయంతో వణికిపోతున్నారని, తనకు మందకృష్ణ ప్రాణహాని వుందని అర్థమైపోయిందని ఆకుల రాజేందర్ అంటున్నాడు. ఈ విషయాన్ని తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, మందకృష్ణ నుంచి తనకు ప్రాణభయం ఉన్నందువల్ల తనకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరానని ఆయన చెప్పాడు. తాను బలహీన వర్గానికి చెందిన వ్యక్తి అయినందువల్లే తనను మందకృష్ణ తనను బెదిరిస్తున్నాడని ఆకుల రాజేందర్ అంటున్నాడు. పాపం టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఎంత కష్టమొచ్చిపడిందో!