వాయలార్ దోశపై కేసిఆర్ నిప్పులు
posted on Mar 7, 2013 10:56AM
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేతలు తెలంగాణ గురించి తమకు తోచిన పదజాలంతో మాట్లాడుతుంటే…ఇన్ని రోజులూ మౌనంగా ఉండిన టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఇకపై తెలంగాణ గురించి దోశ, వడ అంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించాడు. ఇలాంటి మాటలు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఆజాద్, వయలార్ రవిలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. వారి మాట తీరును తప్పుపడుతూ… తెలంగాణను దోశ, వడ అంటూ కించపరుస్తూ మాట్లాడితే ఊరుకునేదిలేదని ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణ ఆర్టీసీ మహిళా ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశానికి కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. యధావిధిగా ఆర్టీసీ రిక్రూట్మెంట్లోనూ తెలంగాణకు అన్యాయమే జరుగుతోందని కేసీఆర్ ఆందోళనవ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పారు.