బ్రిటన్ మా తర్వాత లక్ష్యం : ఐఎస్ఐఎస్

పారిస్‌లో 130 మందిని బలితీసుకుని, నరమేధానికి పాల్పడిన తొమ్మిదిమంది ఉగ్రవాదులు ఎవరో చెబుతూ,ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఒక వీడియో విడుదల చేసింది. ఈ దాడిలో నలుగురు బెల్జియన్లు, ముగ్గురు ఫ్రెంచి పౌరులు, ఇద్దరు ఇరాకీలు పాల్గొన్నారని  వెబ్‌సైట్లలో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొంది. 'వాళ్లు ఎక్కడ కనిపిస్తే.. అక్కడ చంపండి' అనే పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో అమెరికా సంకీర్ణ దేశాలకు ఐఎస్ఐఎస్ తీవ్ర హెచ్చరికలు చేసింది. సంకీర్ణ కూటమిలో భాగంగా ఉన్న బ్రిటనే తమ నెక్స్ట్ టార్గెట్ అని సంకేతాలు ఇచ్చింది.

2014 సెప్టెంబర్ నుంచి సిరియా, ఇరాక్‌లో ఐఎస్ఐఎస్పై దాడులు చేస్తున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి దేశాలన్నింటికీ ఈ బెదిరింపు వర్తిస్తుందని ఫ్రెంచ్, అరబ్ భాషలో ఉగ్రవాదులు హెచ్చరించారు. వీడియోలో బ్రిటన్ పిఎం డేవిడ్ కామెరాన్‌ ఫొటోను చూపించి..  'అవిశ్వాసులతో జతకలిసే ప్రతి ఒక్కరూ మ తల్వార్లకు లక్ష్యం కావాల్సిందే' అని ఇంగ్లిష్‌లో పేర్కొన్నారు. పారిస్‌ దాడితో ఫ్రాన్స్‌ను గడగడలాడించిన తొమ్మిది మంది ఉగ్రవాదులు సింహాల్లాంటి వాళ్లంటూ కితాబిచ్చారు తీవ్రవాదులు.ఐఎస్ఐఎస్ మీడియా కేంద్రం అయిన 'అల్‌ హయత్‌' ఈ వీడియోను విడుదల చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu