హోదాకి బదులు ఏపీకి నిధులు ఇస్తాం.. సిద్దార్ధ్ నాథ్ సింగ్

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు.. అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్దార్ధ్ నాథ్ సింగ్.. ఇప్పుడు మరోసారి ఏపీ ప్రత్యేక హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్రం నుండి అందించాల్సిన సాయం అందుతూనే ఉంటుంది.. హోదాకి బదులు ఏపీకి నిధులు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి రూ.7 వేల కోట్లు విడుదల చేశాం.. ఇంకా రూ .22,112కోట్లు మంజూరు చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని.. ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించి అభివృద్ధికి సహాయపడతామని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu