సందీప్ కుమార్ కేసులో ట్విస్ట్..

 

ఆప్ మాజీ మంత్రి సందీప్ కుమార్ అశ్లీల వీడియోలు ఇప్పటికే దుమారం రేపుతుంటే ఇప్పుడు మరో ఆసక్తికరమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. పోలీసులు ఆ వీడియోల్లో ఉన్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో భాగంగా రేషన్ కార్డు విషయం మాట్లాడేందుకు మంత్రిగా ఉన్న సందీప్ వద్దకు వెళ్ళానని, ఆ సమయంలో కూల్ డ్రింక్లో డ్రగ్స్ కలిపి ఇచ్చారని, డ్రింక్ తాగాక తాను అపస్మారకస్థితిలోకి వెళ్లానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని పోలీసులకు చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరింత వేడిపుట్టిస్తుంది. అంతేకాదు ఒకవేళ ఆ మహిళ చేసిన ఆరోపణలు నిజంగా.. నిజమని తేలితే ఈ కేసును తీవ్రంగా పరిగణించాలని, సందీప్నకు కఠినశిక్ష విధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu