శంకర్రావు లెటర్ హెడ్స్ దొంగతనం నిజమేనా?
posted on Oct 16, 2012 11:18AM
.jpg)
డిజిపి దినేష్ రెడ్డిపై కంప్లైంట్ చేస్తూ మాజీమంత్రి లెటర్ హెడ్ లపై యూపీఎస్సీ కి అందిన ఫిర్యాదుల వ్యవహారంలో హైదరాబాద్ ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై డీజీ ర్యాంక్ అధికారి ఉమేష్ కుమార్ అడ్వకేట్ శ్రీపాద్ ప్రభాకర్ ని ప్రశ్నించారు. తన కార్యాలయంనుంచి సంతాకాలు చేసిన లెటర్ హెడ్ లను దొంగింలించారంటూ మాజీ మంత్రి శంకర్రావు పెట్టిన కేసులో ఈ విచారణ జరుగుతోంది. మంత్రి శంకర్రావే తనకు స్వయంగా లెటర్ హెడ్స్ ని ఇచ్చారని న్యాయవాది చెబుతున్నారు. బాలాజీ దర్శన్ లాంటి అవసరాలకోసం కార్యాలయాకొచ్చే వ్యక్తులకు సిఫారసు లేఖలు ఇచ్చేందుకు తాను లెటర్ హెడ్స్ మీద సంతకాలు చేసిపెట్టానని, ఉమేష్ కుమార్ అడ్వకేట్.. తనని కలవడానికొచ్చినప్పుడు తన ఆఫీస్ డ్రానుంచి లెటర్ హెడ్స్ ని దొంగిలించాడని శంకర్రావు చెబుతున్నారు. నిజానిజాల్ని తేల్చేందుకు ఆ లేఖల్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు