25మంది డాక్టర్లపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం
posted on Oct 16, 2012 11:13AM
.jpg)
అత్యాశకుపోయిన పాతికమంది డాక్టర్లకు పెద్ద బొక్కే పడింది. తమను తాము ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ మెంబర్లుగా ప్రచారం చేసుకుంటున్న 25మంది డాక్టర్లను మెడికల్ కౌన్సిల్ నుంచి తొలగించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. తమిళనాడుకి చెందిన ఆదిపరాశక్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఫ్యాకల్టీ మెంబర్లుగా పనిచేస్తున్నామని ప్రచారం చేసుకుంటూ ప్రాక్టీస్ ని విపరీతంగా పెంచేసుకుంటున్న ఈ డాక్టర్లమీద కొంత కాలంగా ప్రత్యేక నిఘాని ఏర్పాటుచేయడంతో మోసం బైటపడింది. ఒడిషా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన ఈ జలగల్ని వలేసిమరీ పట్టుకున్నారు. ఐదేళ్లవరకూ వీళ్లలో ఎవరూ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేకుండా ఎతిక్స్ కమిటీ నిషేధాన్ని విధించింది.