వాటివల్ల మీకే ముప్పు.. పాక్ కు అమెరికా హెచ్చరిక..

 

పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాదుల వల్ల ఆ దేశానికి నష్టమని అమెరికా హెచ్చరించింది. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థల వివరాలు వెల్లడించాలని అమెరికా కోరింది. అంతేకాదు తాలిబన్ ఉగ్రవాద సంస్థలతో అక్కడ ఉగ్రచర్యలకు పాల్పడుతున్న ఇతర సంస్థలవల్లే పాకిస్థాన్ కే ముప్పు అని  అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ మార్క్ టోనర్ హెచ్చరించారు. ఇంకా ఆయన.. నాడు జరిగిన ముంబై దాడి కేసులో.. భారత్ కు సహకరించాలని.. భారత అధికారులకు ముంబై దాడుల విచారణలో పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించామని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu