జగన్ సర్వేలో బయట పడ్డ నిజాలేంటి?
Publish Date:Dec 11, 2025
తాజాగా కోటి సంతకాల సేకరణ చేసింది వైసీపీ. జగన్ పాలనికిదో రెఫరెండంగానూ చెప్పుకొస్తున్నారు భూమన, రోజా వంటి వైసీపీ జగజ్జంత్రీలు. ఇదంతా ఇలా ఉంటే ఈ పైపై మెరుగులకు మోస పోని... జగన్ లోలోపల ఒక భారీ సర్వే చేయించారట. ఈ సర్వేలో 18 నెలల కూటమిపాలన ఎలా ఉందో ఒక తులనాత్మక పరిశీలన చేయించారట. ఈ పరిశీలనలో తేలిన వాస్తవాలేంటో చూస్తే..
గతంలో కన్నా ఎంతో మెరుగ్గా కూటమి పాలన ఉన్నట్టు చెప్పారట ఈ సర్వేలో పాల్గొన్న ప్రజలు. తమకు అన్నీ పథకాలు అందుతున్నాయని.. ఫించన్లు స్వయంగా బాబే ఇవ్వడం గొప్ప విషయమనీ.. గూగుల్ వంటి సంస్థలు రావడంతో పాటు.. ఇటీవల పార్టనర్ సమ్మిట్ ద్వారా 13 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయని.. ఇక సంక్షేమపథకాలు కూడా పెద్ద ఎత్తున జనానికి చేరుతున్నాయనీ చెప్పారట.
మరి పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు ఈ కూటమి కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయమేంటని అడగ్గా.. అలా ఉంటేనే రాజధానిపూర్తవుతుంది. పోలవరం కూడా కంప్లీట్ అవుతుంది. ఆపై కేంద్రప్రభుత్వంతో ఉన్న సఖ్యత కారణంగా ఇంకా ఎన్నో మంచి పనులు జరుగుతాయి కాబట్టి.. మాకీ ప్రభుత్వమే బాగుందని అన్నారట ఆంధ్రప్రజలు.
ఇక చంద్రబాబు అపార అనుభవం, లోకేష్ యువనాయకత్వం, పవన్ పాపులారిటీ కూటమి ప్రభుత్వానికి పెట్టని కోటలుగా మారి.. ఏపీని సంక్షేమాబివృద్ధి దిశగా పరుగులు తీయిస్తున్నట్టుగానూ చెప్పుకొచ్చారట సర్వేలో పాల్గొన్న ప్రజలు. దీంతో జగన్ కి దిమ్మ తిరిగి భవిష్యత్ బొమ్మ కనిపించిందట. ఆయన అధికారపు ఆశలపై ఫ్రిడ్జ్ లోంచి బయటకు తీసిన చల్ల చల్లని నీళ్లు కుమ్మరించినట్టయ్యిందట.
బేసిగ్గా జగన్ ఇప్పటి వరకూ ఏం భావించాడో చూస్తే.. ఆయనకు ఉన్న 40 శాతం ఓటు బ్యాంకుకు కూటమి వ్యతిరేఖత ద్వారా మరో 8 శాతం ఓటు బ్యాంకు తన పార్టీకి కలిసి వస్తుంది. కాబట్టి, సుమారు 50 శాతం ఓట్లతో తాను 2029లో గెలవబోతున్నట్టుగా ఫీలయ్యేవారట ఇన్నాళ్లూ. ఇప్పుడా ఫీలింగ్స్ మొత్తం బూడిదలో పోసినట్టే అయ్యిందట. ఆ సర్వే ఫలితాలు అలా అఘోరించాయట.
ఇలా ఎందుకు జరిగిందో కూపీ లాగిన జగన్ కి నమ్మలేని నిజాలెన్నో బయట పడ్డాయట. మరీ ముఖ్యంగా జగన్ మైండ్ సెట్లో ఆల్రెడీ ఉన్న హింసాత్మక ప్రవృత్తికి రప్పా రప్పా ఫ్లెక్సీల మోత కూడా తోడయ్యిందట. అంతే కాదు కొందరు ఫ్యాను పార్టీ మద్దతు దారులు కౌంటింగ్ మొదలయ్యి ఫలితాలు తమ వైపునకు తిరుగుతున్నాయని తెలిసిన వెంటనే న*కుడు మొదలవుతుందని చేస్తోన్న హెచ్చరికలు సైతం ఆయనకు చేటు తెస్తున్నట్టు బయట పడిందట.
కడప నగర మేయర్ గా పాక సురేష్ ఏకగ్రీవం
Publish Date:Dec 11, 2025
రాహుల్ తో రేవంత్ భేటీ
Publish Date:Dec 11, 2025
బోరుగడ్డను వైసీపీ వదిలించేసుకుంది!
Publish Date:Dec 10, 2025
ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలేంటంటే?
Publish Date:Dec 10, 2025
గ్లోబంత సంబురం.. పెట్టుబడుల స్వర్గధామం
Publish Date:Dec 10, 2025
రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రైజింగ్- గ్లోబల్ సమ్మిట్ లో 5. 75 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయి. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పలువురు వ్యాపార, రాజకీయ, సినీ, కార్పొరేట్, ఆర్ధిక రంగ అతిరథ మహారథులు ఏతెంచగా.. అంగరంగ వైభవంగా నభూతో .. అన్న స్థాయిలో జరిగిందీ గ్లోబల్ సంబురం.
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రెండో విజయవంతమైన ఏడాది ముగింపు ఉత్సవంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణను ప్రపంచ రోల్ మోడల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది రాజకీయాలకు అతీతంగా కేవలం అభివృద్ధీకి మాత్రమే పెద్ద పీట వేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఫోకస్ అంతా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వైపు చూసింది. అధికారిక కార్యక్రమాల్లోనూ రాజకీయ ఆరోపణలు వినీవినీ విసిగి వేసారిన జనాన్ని ఫక్తు ప్రొఫెషనల్ గా సాగిన ఈ సమ్మిట్ విపరీతంగా ఆకర్షించింది. రాజకీయాలకు అతీతంగా సినీ, క్రీడా, వ్యాపార, ఆర్ధిక రంగ ప్రముఖులతో కూడిన మేథో మథనం జరగడంతో తెలంగాణ భవిష్యత్ బంగారమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.
ప్రపంచంలోనే భారత్ యువరక్తంతో కూడున్న దేశమైతే.. అందులో తెలంగాణ మరింత యువ రాష్ట్రమంటూ శంతను నారాయణ్ వంటి ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు పేర్కొన్నారు. ఇక 2047 నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యం అతిశయం ఏమీ కాదనీ, ఈ విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలతో పోటీ పడ్డం చాలా గొప్ప విషయమనీ ప్రముఖ ఆర్ధిక వేత్త అర్వింద్ సుబ్రహ్మణియన్ అన్నారు. కేవలం రాష్ట్రాలే కాదు నగరాల మధ్య కూడా పోటీ ఉండాలనీ, ప్రస్తుతం దక్షిణాదిలో బెంగళూరు అర్బన్ సమస్యలతో సతమతమవుతుంటే, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వంటి విస్తరణ కార్యక్రమాల ద్వారా ప్రపంచ దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోందన్నారాయన. తెలంగాణ గొప్పగా ట్రాన్స్ ఫార్మింగ్ జరుగుతోందనీ, ఇటీవలి కాలంలో విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోందన్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు.
ఇక మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడానికి మూడంచల వ్యూహం అనుసరిస్తున్నట్టు తన విజన్ డాక్యుమెంట్ లో ఆవిష్కరించింది రేవంత్ సర్కార్. అందులో భాగంగా భావితరాల కోసం తెలంగాణను తీర్చిదిద్దడంతో పాటు, ఆర్ధిక సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర వారసత్వ, సాంస్కృతిక కళా వైభవాలకు పెద్ద పీట వేసేలా ప్రణాళికలు రచించారు.
5 వేల కోట్లతో సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో తాము పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు యూపీసీ సీఈవో అలోక్ కుమార్. 1100 కోట్లతో వింటేజ్ కాఫీ ప్లాంట్ తెలంగాణలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారుఆ సంస్థ ఎండీ బాలకృఫ్ణన్. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్ర అయితే స్కిల్ డెవలప్మెంట్ కాలేజీకి తనను బాధ్యత వహించమని కోరడంతో కాదనలేక పోయానని, అందుకు కారణం సీఎం రేవంత్ విజన్, సునిశిత ఆలోచనా సరళి, ఆపై పేదరిక నిర్మూలనపై ఆయనకున్న నిబద్ధత అంటూ పొగడ్తలు గుప్పించారు. తెలంగాణ నిజంగానే ఒక రోల్ మోడల్ అన్నారు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్.
మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధ్యమేనని ప్రపంచమంతా చెప్పిందని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు. ఈ ఫ్యూచర్ సిటీ కోసం 2027 వరకూ ఎదురు చూడక్కర్లేదు.. అంతకన్నా ముందే సాకారమవుతుందన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఇక ఇదే ఫ్యూచర్ సిటీ ద్వారా ఏకంగా 13 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నట్టు తెలుస్తోంది. 13, 500 ఎకరాల్లో నిర్మితమయ్యే ఈ నగరం ఒక ఆర్కిటెక్ అద్బుతం కానుందని, ఏకంగా 9 లక్షల మందికి ఆవాస యోగ్యం కానుందని ప్రకటించారు సమ్మిట్ నిర్వాహకులు.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పూర్తైతే.. ప్రపంచమే హైదరాబాద్ కి తరలి వస్తుందని అన్నారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేంద్ర సింగ్. పర్యాటకంగా మాత్రమే కాకుండా సినిమా పరంగా కూడా తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యతలను తీసుకుంటున్నట్టు ఈ సదస్సు ద్వారా ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం తెలుగు వారికి ఉన్న స్టూడియోలే కాక సల్మాన్, అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ తారలు సైతం ఇక్కడ స్టూడియోలు పెట్టడానికి ముందుకొచ్చారు. భారతదేశంలోనే సమ వాతావరణ పరిస్థితులు ఉన్న హైదరాబాద్ దేశంలోని అన్ని సినిమా రంగాల వారికి భూతల స్వర్గంతో సమానం కావడంతో అందరినీ ఇక్కడికి ఆకర్షించి వరల్డ్ మూవీ హబ్ గానూ తీర్చిదిద్దేందుకు తమ వంతు యత్నం చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఐటీ విప్లవానికి తెలంగాణ పుట్టినిల్లు లాంటిదని, స్టార్టప్ హబ్ గానూ హైదరాబాద్ కు ఎన్నో పేరు ప్రఖ్యాతలున్నాయనీ ప్రశంసించారు పలువురు ఆర్ధిక నిపుణులు. ఇక దువ్వూరి అయితే తెలంగాణ అన్ బీటబుల్ గ్రోత్ సాధిస్తోంన్నారు. ఏటా 6-9 శాతం స్థిరమైన వృద్ధి రేటు సాధిస్తోందని గుర్తు చేశారు.
మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండో ఏడాది దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేలా ఎంఓయూలు జరగడం ఏమంత సాధారణ విషయం కాదు. అయితే ఈ ఎంఓయూలను పెట్టుబడులుగా మలచడంలో ప్రభుత్వం తగిన బాధ్యత తీసుకోవల్సిన అవసరముంది. ఆ మాటకొస్తే ఐటీ పరిశ్రమల శాఖను నిర్వహిస్తున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇందుకోసం ప్రత్యేక రూట్ మ్యాప్ ని తయారు చేయాల్సి ఉంది. ఒక స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆయా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన రాయితీలు, ఇతరత్రా సౌలభ్యాలను వారికి అందేలా సింగిల్ విండో ఏర్పాటు చేయాల్సి ఉంది.
వచ్చాం- ఒప్పందాలు చేసేశాం- వెళ్లామని కాకుండా ఎప్పటికప్పుడు ఫాలో అప్ లతో ఈ పెట్టుబడులను తెలంగాణలో గ్రౌండ్ అయ్యేలా చేడాల్సి ఉంది. అలా జరిగితే.. ఫ్యూచర్ సిటీ ద్వారా 13 లక్షలేం ఖర్మ అంతకన్నా మించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణను వెతుక్కుంటూ రావడం ఖాయం అంటున్నారు పరిశీలకులు. ఎనీ హౌ ఆల్ ద బెస్ట్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్. ఇలాగే మరిన్ని వసంతాలు మరిన్ని సదస్సుల నిర్వహణతో లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఎదగాలని.. కోరుకుందాం. సీఎం రేవంత్ కలలు గన్నట్లుగా దావోస్ తరహాలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే వేదికగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోవాలని ఆశిద్దాం. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదెళ్ల సైతం హైదరాబాద్ కేంద్రంగా ఏఐ ఇన్వెస్ట్ మెంట్ చేస్తామన్నారు. సుమారు లక్షన్నర కోట్ల పెట్టబడులు భారత్ లో పెట్టనుండగా వీటిలో అత్యధిక శాతం హైదరాబాద్ లోనే అని సంకేతాలిచ్చారు.
జాతీయ మీడియా టార్గెట్ కేంద్ర కేబినెట్ లోని దక్షిణాది మంత్రులేనా?
Publish Date:Dec 9, 2025
కేసీఆర్ భోజనాలు.. జగన్ గాలి తిరుగుళ్లు.. ప్రజాధనం దుబారాలో ఇద్దరూ ఇద్దరే!
Publish Date:Dec 9, 2025
చెక్కు చెదరని స్నేహ బంధం!
Publish Date:Dec 7, 2025
మోడీ దౌత్య రీతి.. ట్రంప్ ఉక్కిరి బిక్కిరి!
Publish Date:Dec 5, 2025
మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Publish Date:Aug 28, 2025
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు.
కేంద్రం, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్ఎస్ఎస్ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.
నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.
రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?
Publish Date:Aug 28, 2025
కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్ఫ్యూజన్
Publish Date:Jul 25, 2025
సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!
Publish Date:Apr 19, 2025
కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?
Publish Date:Apr 8, 2025
జాగ్రత్త పడండి బాస్.. మోసం చేసే ముందు అమ్మాయిలు ఈ పనులు చేస్తారట..!
Publish Date:Dec 11, 2025
ప్రేమ, భార్యాభర్తల బంధం, సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి. చాలా తొందరగా బ్రేకప్ లు జరుగుతున్నాయి. ఒకరు చాలా సీరియస్ గా భావిస్తే.. మరొకరు చాలా సులువుగా బంధాన్ని వదిలేస్తారు. మరీ ముఖ్యంగా మోసం చేయడం అనేది కొందరికి అలవాటుగా కూడా మారింది. డబ్బు, వస్తువులు కోల్పోతే పోతే పోయాయని సర్థి చెప్పుకోవచ్చు. కానీ మనసుకు గాయం చేసి, నమ్మకాన్ని దెబ్బతీసి, జీవితంలో ఆశల మీద నీళ్లు చల్లే పనులు చేసే మోసగాళ్లు ఉంటారు. ఒకప్పుడు అమ్మాయిలు ఎక్కువగా మోసపోయేవారు. కానీ ఇప్పట్లో చాలామంది అమ్మాయిలు ప్రేమ పేరుతో అబ్బాయిలను మోసం చేస్తున్నారు. మోసం చేసేముందు అమ్మాయిలు కొన్ని పనులు చేస్తారట. అవేంటో తెలుసుకుంటే ఎవరి జీవితంలో అయినా ఎప్పుడైనా అలాంటి సంఘటనలు ఎదురైతే జాగ్రత్త పడవచ్చు. మోసాన్ని గ్రహించి మనసు గాయపడకుండా కాపాడుకోవచ్చు.
మాట్లాడే విధానం..
అమ్మాయిలు అబ్బాయిలకు దూరంగా జరిగేటప్పుడు కనిపంచే మొదటి మార్పు మాట్లాడే విధానం మారడం. ఒకప్పుడు ఆప్యాయంగా, ఎక్కువగా కేర్ తీసుకుంటూ, ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే అమ్మాయి, ఒక్కసారిగా మాట్లాడటం తగ్గించడమే కాకుండా క్రమంగా కఠినంగా మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి తొందరలోనే బ్రేకప్ చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అర్థం.
ఫోన్ కాల్స్..
అమ్మాయిలు పదే పదే బంధువులు లేదా కుటుంబ సభ్యులు కాల్ చేశారని చెబుతూ దూరంగా వెళ్లి మాట్లాడుతూ ఉంటే అది ఖచ్చితంగా ఆమె దూరం అయ్యే సూచనలు ఇస్తుందట. మోసం చేసే అమ్మాయిలు తరచుగా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి ఇతరులతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారని అంటారు.
మాటల్లో మార్పు..
ప్రేమించిన అమ్మాయి మొదట్లో ఎంతో ఆప్యాయంగా, కేరింగ్ గా మాట్లాడుతుంది. కానీ ఆ తరువాత ఆమె ఆ రిలేషన్ నుండి తప్పించుకోవాలని, వేరే రిలేషన్ లోకి వెళ్లాలని అనుకున్నప్పుడు ఆమె మాటతీరు మారుతుందట. ప్రేమ, ఆప్యాయత, కేరింగ్ స్థానంలో చిరాకు, అసహనం, వ్యంగ్యం వచ్చి చేరతాయట. కొన్ని సార్లు చాలా ఘాటుగా కూడా మాట్లాడతారట.
సమయం తగ్గించడం..
బయట కలవడం అయినా, ఫోన్ లో మాట్లాడటం అయినా ప్రేమించిన అమ్మాయి గతంలో లాగా ఎక్కువసేపు మాట్లాడటం, కబుర్లు చెప్పడం కాకుండా కేవలం రెండు మూడు నిమిషాలలో మాట్లాడటం, రెండు మూడు ముక్కలలో సమాధానం చెప్పి పోన్ పెట్టేయడం, తర్వాత మాట్లాడతాను అని చెప్పడం.. వంటివి చేస్తుంటే ఆమె తొందరలోనే బ్రేకప్ చెప్పేస్తుందని అర్థమట.
కారణాలు..
సమయం లేకపోవడం, పనిలో బిజీగా ఉండటం లేదా మూడ్ సరిగ్గా లేకపోవడం వంటి సాకులు చెబుతూ ఉంటే వాస్తవానికి ఆమెకు మాట్లాడే ఆసక్తి లేదని అర్థం. నేరుగా ఆ విషయాన్ని చెప్పలేక అలా కారణాలు చెబుతూ ఉంటారు.
మార్పులు..
లైఫ్ స్టైల్ మార్చుకోవడం, కొత్త అలవాట్లు, సీక్రెట్స్ మెయింటైన్ చేయడం వంటివి చేస్తుంటే ఆ అమ్మాయి మరొకరితో సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టిందని అర్థం. ఇవన్నీ కనివిస్తే ఆ అమ్మాయి మోసం చేస్తోందని అర్థం. ఇలాంటి మార్పులు కనిపించినప్పుడు అబ్బాయిలు జాగ్రత్త పడితే మనసుకు గాయం కాకుండా జాగ్రత్త పడవచ్చు.
*రూపశ్రీ.
ఈ రెండు తప్పులు చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు..!!
Publish Date:Dec 10, 2025
వయసు రాగానే పెళ్లి చేసుకోవడం కాదు.. పెళ్లి చేసుకోవడానికి ఈ లక్షణాలు ఉండాలి మరి..!
Publish Date:Dec 9, 2025
భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు?
Publish Date:Dec 8, 2025
అత్తాకోడళ్ల బంధాన్ని బలపరిచే మ్యాజిక్ చిట్కాలివి..!
Publish Date:Dec 5, 2025
బలమైన గుండె కావాలా? ఇవి తినండి చాలు..!
Publish Date:Dec 11, 2025
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె. ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో గుండె సంబంధ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలామందిలో గుండె బలహీనంగా మారడం వల్ల తొందరగా గుండె జబ్బులు రావడం జరుగుతోంది. అందుకే గుండెకు బలాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలని వైద్యులు చెబుతారు. గుండెకు బలాన్ని పెంచే ఆహారాలు ఏవి? ఆ లిస్ట్ ఒక్కసారి చూస్తే..
గుండెను బలంగా ఉంచే ఆహారాలు..
సాల్మన్..
సాల్మన్ వంటి కొవ్వు చేపలలో గుండెకు బలాన్ని చేకూర్చే ఒమేగా-3 కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. సాల్మన్ చేపలు EPA, DHA లను అందిస్తాయి. ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో, గుండె లయను స్థిరంగా ఉంచడంలో, రక్త నాళాల లైనింగ్ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా తింటే హృదయ సంబంధ సమస్యలను చాలా వరకు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఒమేగా-3 లు గుండె కణ త్వచాలలో కలిసిపోయి ఆరోగ్యకరమైన విద్యుత్ కమ్యునికేషన్ కు సహాయపడతాయి.
ఆలివ్ ఆయిల్..
ఎక్స్టా వర్జిన్ ఆలివ్ ఆయిల్ నూనెలో మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు, పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెరుగైన ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ను అందిస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆలివ్ నూనె తీసుకోవడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి.
అవకాడో..
అవకాడోలు సహజంగా ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పొటాషియం, ఫోలేట్, విటమిన్ E లతో నిండి ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలకు మద్దతు ఇస్తాయి.
వాల్నట్స్.
క్రమం తప్పకుండా వాల్నట్లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాల్నట్లలో మొక్కల ఆధారిత ఒమేగా-3లు, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్నట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులను భర్తీ చేయడంలో సహాయపడుతుంది. రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది.
బ్లూబెర్రీస్..
బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. బ్లూబెర్రీస్లో ఉండే ఆంథోసైనిన్లు, పాలీఫెనాల్స్ రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతారు. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందట.
ముదురు ఆకుకూరలు..
ముదురు ఆకుకూరలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. సహజ నైట్రేట్లతో సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. విటమిన్ K, ఫోలేట్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి గుండెను బలంగా మారుస్తాయి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
నెల రోజుల పాటు టీ మానేసి చూడండి.. షాకవుతారు..!
Publish Date:Dec 10, 2025
మూత్రాన్ని ఆపుకునే అలవాటుందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?
Publish Date:Dec 9, 2025
చలికాలంలో నిండుగా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?
Publish Date:Dec 8, 2025
కల్తీ లవంగాల కనికట్టు.. వీటిని తింటే ఎంత నష్టమంటే..!
Publish Date:Dec 6, 2025