ఎన్టీఆర్, ప్రభాస్కు తలసాని ఛాలెంజ్..!!
ప్రస్తుతం గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.. సెలెబ్రిటీలు మొక్కలు నాటి వేరే వారికి కూడా నాటమని ఛాలెంజ్ విసురుతున్నారు.. ఇప్పటికే ఈ ఛాలెంజ్ లో చిరంజీవి, కేటీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రాజమౌళి లాంటి వారు పాల్గొన్నారు.. త్వరలో ఈ లిస్ట్ లో ఎన్టీఆర్, ప్రభాస్ కూడా చేరేలా ఉన్నారు.. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్టీఆర్, ప్రభాస్ లకు ఛాలెంజ్ విసిరారు.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విసిరిన ఛాలెంజ్ను స్వీకరించిన తలసాని, ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటి.. ఎన్టీఆర్, ప్రభాస్, దిల్రాజు, త్రివిక్రమ్, తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్కు ఛాలెంజ్ విసిరారు.