కిషన్ రెడ్డి, నిర్మలకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పర్యవేక్షణ బాధ్యతలు...

తెలంగాణ 33 జిల్లాల పర్యవేక్షణ బాధ్యతను కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీలో 13 జిల్లాలను పర్యవేక్షణ బాధ్యతను ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  వీరు ఎప్పటికప్పుడు అధికారులకు తగిన సూచనలు ఇవ్వడంతోపాటు, కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్‌డౌన్ నేపధ్యం లో వైరస్‌ను ఎదుర్కొనేందుకు  తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించి, కేంద్రానికి నివేదిక ఇస్తారు. కరోనా పరిస్థితి, సహాయక చర్యలపై నేరుగా అధికారులతో చర్చించి వీరిద్దరూ ఎప్పటికప్పుడు వివరాలు సేకరించనున్నారు.వాటి ఆధారంగా అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగాలకు తగిన సూచనలు ఇవ్వాలని కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ ఆదేశించారు. తెలంగాణలో ఇప్పటిదాకా 45 కేసులు నమోదవగా, ఏపీలో 11 మందికి కరోనా వైరస్‌ సోకింది.

ఇత‌ర రాష్ట్రాల వారిని స్వంత‌బిడ్డ‌ల్లా క‌డుపులో పెట్టుకుంటాం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పిల్ల‌లు ఎవ‌రూ బ‌య‌టికి వెళ్ల‌వ‌ద్దు. మీ హాస్ట‌ల్స్‌ను మూసివేయ‌రు. మీరంతా ఎక్క‌డికి ప్ర‌యాణాలు పెట్టుకోవ‌ద్దు. ఇక్క‌డే వుండండి. ఎలాంటి స‌మ‌స్య రాకుండా చూసుకుంటామ‌ని సి.ఎం. హామీ ఇచ్చారు. లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 15వ‌ర‌కు తెలంగాణాలో పెంచుతున్నాం, రాత్రి క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంద‌ని సి.ఎం. చెప్పారు. కూర‌గాయ‌లు బ్లాక్ మార్కెట్ కాకుండా స్థానిక నేత‌లు చూడండి. అయితే గుంపులు గుంపులుగా తిర‌గ‌కండ‌ని నేత‌ల‌కు కేసీఆర్ స‌ల‌హా ఇచ్చారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు ఆక‌లికి గురికారాదు. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది క‌లుగ‌కుండా చూసుకుంటాం. కాబ‌ట్టి మీరు ఎక్క‌డి వారు అక్క‌డే వుండండి. త‌ర‌లి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించ‌కండి. మీకు జీతాలు ఇవ్వ‌డ‌మే కాదు అన్నం పెట్టి ఆదుకుంటామ‌ని సి.ఎం. హామీ ఇచ్చారు. ఈ విష‌య‌మై అన్ని జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు సి.ఎం. తెలిపారు. హైద‌రాబాద్ జిహెచ్ఎంసితో పాటు చుట్టుప‌క్క‌ల వున్న 9 కార్పొరేష‌న్‌లో వున్న కార్మికుల్ని ఆదుకుంటాం. అధికారుల స‌మ‌న్వ‌యంతో స‌మ‌స్య‌ను అధిక‌మిస్తాం. ప‌శుగ్రాశంకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స‌దుపాయాలు క‌ల్పిస్తున్నాం. పాలు, కూర‌గాయ‌లు, పండ్ల వాహ‌నాల‌కు ఇబ్బందిలేకుండా తిరిగేలా చ‌ర్య‌లు తీసుకున్నాం. డైరీ ఫాంల‌కు అవ‌స‌ర‌మైన గ‌డ్డి తెప్పించుకోవ‌చ్చు. ఎలాంటి ఆటంకం లేకుండా ఆదేశాలు జారీ చేశాం. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోమ‌ని ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి పిలుపునిచ్చారు. కోడిగుడ్లు బాగా తినండి. అలాగే సి.విట‌మిన్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. బ‌త్తాయిపండ్ల‌ను, మామిడిపండ్ల‌ను ఇత‌ర ప్రాంతాల‌కు పంప‌కుండా మొత్తం తెలంగాణాలోనే స‌ర‌ఫ‌రా చేయించండ‌ని సి.ఎం. ఆదేశించారు.

కొత్త‌గా మ‌రో 10 పాజిటివ్ కేసులు! తెలంగాణాలో 59కి పెరిగిన పాజిటివ్ కేసులు!

తెలంగాణాలో 59 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. 20 వేల మంది క్వారెంటైన్‌లో వున్నారు. ఈ ఒక్క రోజే శుక్ర‌వారంనాడు 10 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. ఇండియాలో 20 కోట్ల మంది క‌రోనాబారిన ప‌డే ప్ర‌మాదం వుంద‌ని స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. స్వీయ‌నియంత్ర‌ణే శ్రీరామ‌ర‌క్ష‌. కాబ‌ట్టి ద‌య‌చేసి ఇళ్ల నుంచి బ‌య‌టికి రావ‌ద్దు. ఏమైత‌దిలా అనే నిర్ల‌క్షంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని చేతులెత్తి ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌ధానితో మాట్లాడాను. అండ‌గా వుంటామ‌ని పి.ఎం. భ‌రోసా ఇచ్చారు. ప్ర‌పంచ‌మంతా ఇదే ప‌ద్ద‌తి పాటిస్తోంది. ఏం చేస్తున్నారంటే 80 శాతం ఇళ్ల వ‌ద్దే పెట్టి చికిత్స చేస్తున్నారు. 13శాతం, 4 శాతం బాధితుల్ని ఆసుప‌త్రిలో పెట్టి చికిత్స చేస్తున్నారు. పూర్తిగా స్ట‌డీ చేస్తున్నాం. ఎంత వ‌ర‌కు దీన్ని ఎదుర్కోగ‌లం? 100 మంది అవ‌స‌రం అయితే 130 మందిని సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నామ‌ని సి.ఎం. చెప్పారు. ఒక్కో ద‌శ‌లో 4 వేల మంది ఐసొలేష‌న్ వార్డులో వుండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. 1400 ఐసిఎం బెడ్స్ సిద్ధం చేస్తున్నాం. గ‌చ్చిబౌలీలో స్టేడియం పూర్తిగా అందుబాటులో రానుంది. కింగ్‌కోఠి ఆసుప్త‌రిలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. 500 వెంటిలేట‌ర్ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చిం. 12 వేల మంది బెడ్స్ సిద్ధం చేసుకొని వున్నాం. 60 వేల మంది బాధితులున్నా స‌మ‌స్య‌ను ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా వున్నాం. 8 వేల మంది వైద్యులు స‌ర్కార్ ఆసుప‌త్రుల్లో ప‌నిచేస్తున్నారు. వారే కాకా ఎంబిబిఎస్ పూర్తి చేసిన వారి స‌మాచారం తీసుకొని 14 వేల మందిని సిద్ధం చేసుకుంటున్నాం. ప్ర‌జ‌లు ఎట్టి ప‌రిస్థితుల్లో నిర్ల‌క్ష్యం, అల‌స‌త్వం వ‌హించ‌కుండా భ‌యంక‌ర విప‌త్తులో భ‌యంక‌ర రాక్ష‌సితో యుద్ధం చేస్తున్నాం. ఈ ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు స‌హ‌కారం చేయాలి. తెలంగాణాలో వున్న ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌ల క‌డుపు నింపుతాం. ఆందోళ‌న చెంద‌కండి. హాస్ట‌ల్ బంద్ అయిందంటూ రోడ్ల మీద ప‌డ‌వ‌ద్దు అని ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ కరోనా కంటిన్యూ అవుతోంది గదా, నా లోన్ కిస్తీ ఆపేస్తారా? , నా క్రెడిట్ కార్డు బిల్ క్యాన్సిల్ చేస

సింగినాదం సింగినాదం ఎం చేస్తున్నా వోయీ  అంటే, విరిగిపోయిన వెదురుబొంగులు అతికిస్తున్నా, మనింటిపైన చూరు కారకుండా ఉండటానికి అన్నాట్ట ! ...అచ్చం అలానే ఉన్నాయి.. మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారి తెలివితేటలు . కరోనా లాక్ డౌన్ నేపధ్యం లో, అన్ని తరహా లోన్ల మీద మారటోరియం విధించుకునే వెసులుబాటును బ్యాంకులకు కల్పిస్తూ, ఆర్ బీ ఐ ఈ రోజు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తం అన్ని బ్యాంకులు కూడా అన్ని తరహా టర్మ్ లోన్ల మీద మూడు నెలల మారటోరియం విధించుకునే వెసులుబాటుని ఆర్ బీ ఐ కల్పించింది. ఈ నిర్ణయం వల్ల, బ్యాంకు కస్టమర్లు మూడు నెలల పాటు తమ కిస్తీలను కట్టకుండా ఉండే సదుపాయాన్ని బ్యాంకులు కల్పించవచ్చునన్న మాట. ఇక్కడే ఆర్ బీ ఐ ఒక పీట ముడి వేసింది. బ్యాంకులకు తాము మారటోరియం  సదుపాయం మాత్రమే కల్పించామని, దీనిపైన తదుపరి నిబంధనలు రూపొందించాలని, ఈ విషయం లో ఒక వేళ వ్యక్తిగత స్థాయిలో ఈ ఎం ఐ లను మూడు నెలలపాటు సస్పెండ్ చేయాలా, లేక బ్యాంక్ లెవెల్ లో నిర్ణయం తీసుకోవాలా అనేది ఇంకా ఒక నిర్ణయం అయితే జరగలేదనేది ఆర్ బీ ఐ సూత్రీకరణ. ఎస్ బీ ఐ చీఫ్ రజనీష్ కుమార్ అయితే, అన్ని టర్మ్ లోన్లు క్యాన్సిల్ అయినట్లే అని ధృవీకరించారు. లోన్లు తీసుకున్న బ్యాంక్ కస్టమర్ల ఖాతాల నుంచి లోన్లు ఆటొమ్యాటిక్ గా డిడక్ట్ అవుతాయా, లేక, కస్టమర్లు వ్యక్తిగత స్థాయిలో ఆ ఆప్షన్ ను ఎంచుకొవాలా అనే అంశం మీద ఆర్ బీ ఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అలాగే, ఒక వేళ లోన్ కిస్తీలు చెల్లించకపోతే, ఖాతాదారుల క్రెడిట్ స్కోర్ మీద దాని ప్రభావం పడుతుందా అనే ప్రశ్నకు, ఏ ప్రభావమూ ఉండదు అనే బదులిస్తోంది ఆర్ బీ ఐ. అలాగే, ఆర్ బీ ఐ తీసుకున్న కిస్తీ ల మూడు నెలల వాయిదా నిర్ణయాన్ని, అన్ని కమర్షియల్ బ్యాంకులు, అంటే రీజనల్ రూరల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అఖిల భారత స్థాయిలో ఉన్న ఆర్ధిక సంస్థలు, NBFC, అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు అన్నీ కూడా ఈ మారటోరియం సదుపాయాన్ని కల్పించవచ్చును. అయితే, ఆర్ బీ ఐ దీని మీద మరో క్లారిటీ కూడా ఇచ్చింది. ఇది రుణాల రద్దు కిందకి రాదు, కేవలం కిస్తీల చెల్లింపు లో కల్పిస్తున్న వాయిదా సదుపాయమే కానీ, మూడు నెలల పాటు రీ పేమెంట్ షెడ్యూల్ తో పాటు, తదుపరి కిస్తీ చెల్లింపు తేదీలన్నీ కూడా మూడు నెలల తర్వాత ఉండేలా చూడాలనేది బ్యాంకులకు ఆర్ బీ ఐ సూచన. అంటే దానర్ధం, మూడు నెలల రుణ వాయిదాలన్నీ, ఒకే సారి జూన్ నెలలో చెల్లించాలనే అనుమానాల మీద మాత్రం ఆర్ బీ ఐ క్లారిటీ ఇవ్వలేదు. ఆర్ బీ ఐ పూర్తి గైడ్ లైన్స్ వెలువరిస్తే కానీ, దీని మీద స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే, ఈ మూడు నెలల మారటోరియం -ఖాతాదారుల రుణాల మీద అసలు, ఇంకా వడ్డీ కి కూడా వర్తిస్తుందా అనే దాని మీద మాత్రం, ఆర్ బీ ఐ క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చ్ 1 నాటికి ఉన్న అన్ని రకాల రుణాల మీద, మూడు నెలల పాటు రుణ కిస్తీల అసలు, ఇంకా వడ్డీ మీద మినహాయింపు ఉంటుందని ఆర్ బీ ఐ వివరించింది. హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, నిశ్చిత కాలపరిమితి ఉన్న ఆటో లోన్లు వంటివి అన్నీ, అంటే- మొబైల్, ఫ్రిజ్, టీ వీ లాంటి -కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కూడా ఆర్ బీ ఐ ప్రకటించిన మారటోరియం పరిధిలోకి వస్తాయని ఆర్ బీ ఐ స్పష్టం చేసింది. అయితే క్రెడిట్ కార్డు పేమెంట్స్ మాత్రం దీని పరిధిలోకి రావాలి. అవి రివాల్వింగ్ క్రెడిట్ కిందకు వస్తాయి కాబట్టి, ఆ ప్రసక్తే ఉత్పన్నం కాదని ఆర్ బీ ఐ సూత్రీకరణ. అలాగే, క్రెడిట్ కార్డ్స్ మీద తీసుకున్న రుణాల విషయం లో మారటోరియం వర్తిస్తుందా, లేదా అనే దాని మీద ఆర్ బీ ఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఒక వేళ ఎవరైనా ఒక ఫ్యాక్టరీ నెలకొల్పే నిమిత్తం తీసుకున్న రుణాలకు ఇది వర్తిస్తుందా అనే దాని మీద మాత్రం, ఆయా బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుందని ఆర్ బీ ఐ క్లారిటీ ఇచ్చింది. ఇక వ్యాపారాల గురించి, వాటి మీద తీసుకున్న రుణాల గురించి మాట్లాడుతూ, ఆర్ బీ ఐ చెప్పేదేమిటంటే -వ్యాపారాల నిమిత్తం తీసుకున్న వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ మీద వడ్డీ చెల్లింపుల కు మినహాయింపు ఇప్పటికే ఇచ్చిన విషయాన్ని స్పష్టం చేసింది. మార్చ్ 1 నాటికి ఉన్న లోన్స్ మీద ఈ మూడు నెలల కాలానికి గానూ పేరుకుపోయిన వడ్డీని, ఈ మారటోరియం ముగిసిన తర్వాతనే వాసులు చేస్తారనేది కూడా ఆర్ బీ ఐ మాట. అయితే, రుణ ఒప్పందాలను కానీ, ఆస్తుల విభజన అంశాలను కానీ ఈ మారటోరియం ఏ రకంగానూ ప్రభావితం చేయదనేది ఆర్ బీ ఐ మాట.  

బిగ్ బ్రేకింగ్.. ఆర్మీని దింపిన కేసీఆర్.. రేపటి నుండి డబుల్ కోటింగ్!

తెలంగాణలో లాక్ డౌన్ అయినా సరే ప్రజలు రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. పోలీసులు లాఠీలతో విరుచుకు పడుతున్నా.. చాలామంది రోడ్లపై చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రోడ్ల మీదకు వస్తున్న ప్రజలను కట్టడి చేసేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, పోలీసుల సూచనలను పాటించాలని చెప్పిన సీఎం కేసీఆర్.. ఒకవేళ ప్రజలు మాట వినకపోతే అర్మీని దింపుతామని ముందే చెప్పారు. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో అన్నట్టుగానే కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేయడంతో.. కేంద్రం స్పందించి వెంటనే కేంద్ర బలగాలను పంపింది. కేంద్ర బ‌ల‌గాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయి. శ‌నివారం నుండి గ‌ల్లీల్లో కేంద్ర బ‌ల‌గాలు గ‌స్తీ కాయ‌బోతున్నాయి. 

ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారిపై రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇచ్చిన ఎన్‌వోసీని ఎంట్రీ పాయింట్‌లోనే పరిశీలించాలని.. ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమతించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే క్వారంటైన్‌కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. క్వారంటైన్‌ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచి ఎప్పటికప్పుడు డాక్టర్లను పర్యవేక్షించేలా చూడాలని సర్కార్‌కు హైకోర్టు తెలిపింది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుడటం, మరోవైపు రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోతుండటంతో బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ హైకోర్టు పిటిషన్‌ వేశారు. దీనిపై శుక్రవారం నాడు హైకోర్టు విచారించి పైన చెప్పిన విధంగా ఉత్తర్వులు జారీ చేసింది.

14రోజుల క్వారంటైన్ కు సిద్ధపడితేనే ఏపీకి రండి

సీఎం వైఎస్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం లో 3 నెలలకు సంబంధించిన బడ్జెట్‌  ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా నిరంతర పర్యవేక్షణకు ఐదుగురు మంత్రులతో ఏపీ సర్కార్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్ర నాథ్, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు సభ్యులుగా ఉన్నారు. ప్రతి రోజూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులకు సీఎం ఆదేశించారు.  కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఈ భేటీలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకలను సిద్ధం చేశామని, జిల్లాల్లో 200 పడకలను ఏర్పాటు చేశామని అన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో కరోనా ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో సరుకుల రవాణా వాహనాలను అనుమతిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా సామాజిక దూరం పాటించాలని మంత్రి సూచించారు. 14రోజుల క్వారంటైన్ కు సిద్ధమైతేనే ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు రాష్ట్రంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించి సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం సృష్టించొద్దని కోరారు. ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని.. ఇక్కడి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ట్రంప్ ముంచేశాడు! మోడీ మ‌న‌ల్ని గట్టున పడేసారా!

అమెరికా ఆసుపత్రులకు పోటెత్తు తున్న రోగులు! చేర్చుకోలేని స్థితి లో ఆసుపత్రులు! ఒక ventilator ను ఇద్దరికి వాడాలని నిర్ణయం! పూర్తిగా అలిసిపోయిన మెడికల్ సిబ్బంది! పరిస్థితి మరింత దిగ జారే ప్రమాదం! “ ఆసుపత్రికి వస్తున్న వారిలో అధిక శాతం ఆగ కుండా విపరీతంగా దగ్గుతున్నారు “ అని అమెరికా లోని డాక్టర్స్ చెబుతున్నారు. అమెరికా లో తట్టుకోలేని దగ్గు తో ఆయాస పడుతూ ఆసుపత్రికి వస్తున్నారు. బాధాకరమైన వాస్తవం ! మార్చి 18 నాటికి అమెరికా లో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య ఆరు వేలు . ఇండియా లో 150. వారం తరువాత ఈ రోజుకి ఇది అమెరికా లో 85 వేలు అయ్యింది. ఇండియా లో 630. ట్రంప్ అమెరికా ను ముంచేశాడు ! మోడీ లాక్‌డౌన్ ప్ర‌క‌టించి ఇండియా ను గట్టున పడేసాడు. అందరూ ఇల్లు దాటకుండా ఉండాల్సిన అవసరాన్ని ఈ లెక్క‌లు చెబుతున్నాయి. అమెరికా లో ఎక్కువ కరోనా కేసు లు బయట పడుతున్నాయి అంటే దానికి కారణం అక్కడ ఎక్కువ మందిని చెక్ చెయ్యడం! ఇండియా లో తక్కువ కేసు లు వున్నాయంటే అందుకు కారణం చాలా తక్కువ మందిని చెక్ చెయ్యడమే - ఇదొక వాదన / అభిప్రాయం ! అయితే వాస్త‌వం ఏమిటంటే చెక్ చేయడానికి చేయక పోవడానికి తేడా కేవలం వారం రోజులే. రోగం ముదిరితే పరుగెత్తుకొంటూ ఆసుపత్రికి వస్తారుగా? ఇంట్లో దుప్పట్లో దాక్కోలేరుగా? అమెరికా లో కేసు లు ఎనభై వేలు కు పైగా. ఇండియా లో 600. ఎక్కడ పోలిక ? ఇండియా కరోనా మరణాలు కొన్ని సంభవించి ఉండొచ్చు! కానీ అమెరికా లో లాగ తీవ్ర మైన స్థితి కనబడం లేదు . మలేరియా ప్రాంత ప్రజల పై కరోనా మైల్డ్ గానే ప్రభావం చూపుతుంది . వృద్ధాప్యం, హై బీపీ , శ్వాస కోస వ్యాధులు వున్నప్పుడే ఇండియా లాంటి ఉష్ణ మండల మలేరియా ప్రాంత వాసుల విషయం లో అది ప్రాణాంతకంగా మారుతుంది.

అమెరికాలో నిరుద్యోగ తీవ్రత! 32.83 లక్షల మంది రోడ్డున‌ప‌డ్డారు!

అమెరికాను కరోనా వైరస్ ఆవహించింది. ఈ క్రమంలో కంపెనీలు పరిశ్రమలు వివిధ సంస్థలు మూతపడుతున్నాయి. ఇది అన్ని రంగాలపై ప్రభావం పడుతోంది. దీంతో మార్చి 21 వరకే ఏకంగా అమెరికాలో 32.83 లక్షల మంది రోడ్డున పడ్డ పరిస్థితి కనిపించింది. 32 లక్షల మంది జాబ్ ల కోసం క్లెయిమ్స్ పెట్టుకోవడం.. చేస్తామని అప్లికేషన్లు పెట్టుకోవడం అమెరికాలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోంది. మార్చి 21నాటికి గడిచినవారంలో అమెరికాలో 3.28 మిలియన్స్ మంది అమెరికన్లు జాబ్ లెస్ క్లెయిమ్స్ పెట్టుకోవడంతో కరోనా కారణంగా అమెరికాలో ఎంతటి పెను విధ్వంసం చోటుచేసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. కరోనా కనుక మరింత ఎక్కువైతే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం.

వడ్డీ రేట్ల తగ్గింపు, లోన్ల‌పై 3 నెలల మారిటోరియం!

ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత కూడా దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతంగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆర్బీఐ ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని... ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన కీలక నిర్ణయాలను తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ రేపో రేటును 75 బేసిక్ పాయింట్లు తగ్గించడంతో పాటు.... రివర్స్ రెపో రేటును 90 పాయింట్లకు కుదించింది. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో రెపో రేటు 4.4 శాతానికి దిగొచ్చింది. ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్నాయని, ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రజల డబ్బులు సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. ప్ర‌స్తుతం 3.74 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటన చేశారు. అన్ని రకాల లోన్లుపై 3 నెలల మారిటోరియం ప్రకటించారు. వచ్చే మూడు నెలలు ఈఎంఐలు కట్టకపోయినా ఫర్వాలేదని, ఇప్పుడు కట్టాల్సిన లోన్లు తర్వాత కట్టుకునే వెసులుబాటు ఉందన్నారు. ఈఎంఐలు కట్టకపోయినా సిబిల్‌ స్కోర్‌పై ప్రభావం ఉండదని గవర్నర్‌ తెలిపారు. ఇక ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాల‌తో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఆర్బీఐలో పని చేసే 150 మంది ఉద్యోగులు క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు. ఆర్థిక సుస్థిరత ఉండేలా చర్యలు చేపట్టామని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ఆయన తెలిపారు.

గుంటరు ఆస్పత్రి నుంచి కరోనా పేషంట్ అదృశ్యం 

గుంటూరులోని సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా అనుమానితుడు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు...కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో కుటుంబసభ్యులు ఈనెల 25న గుంటూరులోని సర్వజనాసుపత్రిలో చేర్పించారు. జీజీహెచ్ వైద్యులు అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు. కాగా, నిన్న వైద్య సిబ్బంది, ఇతర ఉద్యోగుల కళ్లుగప్పి సదరు వ్యక్తి ఎటో వెళ్లిపోయాడు. దీంతో ఆసుపత్రి వర్గాలు కంగుతిన్నాయి. వెంటనే జీజీహెచ్ ఆర్ఎంవో ఆదినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితుడి కోసం గాలిస్తున్నారు.

మసీదుల్లో ఇమామ్,మౌసమ్ లు మాత్రమే ప్రార్థనలు చేస్తారు:  ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో అలీమ్ బాషా

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మసీదుల్లో ఇమామ్,మౌసమ్ లు మాత్రమే ప్రార్థనలు చేస్తారని, మిగిలిన వారు మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లొద్దు...ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో అలీమ్ బాషా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లిం లా బోర్డ్ ఫత్వా కూడా జారీ చేసింది. దార్ ఉలూమ్ దియోబంద్, జమై నిజామియా వంటి యూనివర్సిటీలు కూడా ఇదే చెప్తున్నాయి.ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా శుక్రవారం ప్రార్ధనలు ఇంట్లో చేసుకోవాల్సిందిగా ఫత్వా జారీ చేసింది.కరోనా వైరస్ వ్యాప్తి నివారణ నేపథ్యంలో ముస్లిం సోదరులంతా సహకరించాలని కూడా అలీం బాషా విజ్ఞప్తి చేశారు.

గర్భిణీలకు కరోనా టెస్టు తప్పనిసరి!

గర్భిణీల నుంచి శిశువుకు కరోనా వ‌స్తుందా... అంటే అవున‌నే అంటున్నారు చైనా డాక్ట‌ర్లు. ఇటీవల చైనాలో ఓ గర్భిణీ డెలీవరి కోసం హాస్పిటల్ లో జాయిన్ అయింది. అయితే ఆమె కాస్త అనారోగ్యంగా ఉండటంతో వైద్యులు పరీక్షలు చేసి కరోనా ఉందని నిర్ధారించారు. ముందుజాగ్రత్తగా యాంటీ వైరల్ డోస్ లు ఇచ్చినప్పటికీ క‌రోనా వైరస్ గర్భసంచికి పాకింది. డెలివరీ తర్వాత శిశువు హెల్త్ చెక్ చేయడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. బరువు, హార్ట్ బీట్ అన్నీ సరిగ్గానే ఉన్నా కరోనా వైరస్ శిశువుకు సోకిందని డాక్ట‌ర్లు చెబుతున్నారు. 'పుట్టిన వెంటనే రక్తనమూనాలను సేకరించి బ్లడ్ టెస్టులు చేశాం. పాపకు కరోనా పాజిటివ్ వచ్చింది' అని వైద్యులు అంటున్నారు. చైనాలో మ‌రో 33మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. ప్రసవం తర్వాత రెండ్రోజుల వరకూ టెస్టులు చేయకపోవడంతో యాంటీ డోసుల వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు. కొందరు రీసెర్చర్లు తల్లికి ఉన్న కరోనా పాపకు కచ్చితంగా వచ్చి తీరుతుందని దానిని తప్పించలేమని అంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత సమయంలో గర్భిణీలు ప్రసవానికి సిద్ధమవుతుంటే కరోనా టెస్టు కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే.

అమెరికాలో కరోనా కల్లోలం! చైనాను దాటేసిన‌ అమెరికా!

ధృవీకరించబడిన కరోనావైరస్ కేసులలో అమెరికా ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ ఒన్ ప్లేస్‌లో వుంది. అత్యధికంగా 85,435 కోవిడ్-19 కేసులు నమోదై క‌రోనాకు కేంద్రంగా మారింది. అత్యంత శక్తివంతమైన దేశంగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు విలవిలలాడుతోంది. గ‌తంలోనే కరోనావైరస్ కు అమెరికా కేంద్రం అవుతుంద‌ని  శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గురువారం అది నిజ‌మైంది.  ఇప్పటి వరకూ చైనాలలోనే అత్యధికంగా 81వేల కేసులు నమోదు కాగా.. ఆ సంఖ్యను అమెరికా అధిగమించింది. ప్రపంచంలోనే అత్యధికంగా 85,435 కోవిడ్-19 కేసులు అమెరికాలో నమోదయ్యాయి. మొత్తం 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు. 330 మిలియన్ల మంది జ‌నాభా వున్న యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలో మూడవ అత్యధిక జనాభా కలిగిన దేశం. ఈ వైరస్ కనీసం 171 దేశాలలో 519,300 మందికి పైగా సోకింది. అమెరికా కరోనా బాధితుల్లో చైనాను దాటేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు విలవిలలాడుతోంది.  కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియని అయోమయంలో ఉంది.   అమెరికాలో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ను కట్టడిచేయడానికి చర్యలు తీసుకుంటున్నా వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 24,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 5.32 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 2,600 మంది మృతిచెందారంటే భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. గత రెండు రోజుల్లోనే 30వేల కేసులు అమెరికాలో నమోదయ్యాయి.  చైనా  నిరంకుశ ప్రభుత్వం ఆలస్యంగా చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌ట్టికీ ఆ త‌రువాత చేప‌ట్టిన చ‌ర్య‌ల‌తో వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసింది. చైనా ను చూసి  సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా మరియు జపాన్ దేశాలు అప్ర‌మ‌త్త‌మై త్వరగా క‌రోనా నియంత్ర‌ణ‌కు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ యథావిధిగా వ్యాపారంలో మునిగిపోయింది. వెంట‌నే అప్ర‌మ‌త్తం కాక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం ఈ  ప‌రిస్థితి చూడాల్సివ‌చ్చింది.  కొద్దిమంది వైరాలజిస్టులు మాత్రమే దాని ముప్పును గుర్తించారు. వైరస్ ఇన్ఫ్లుఎంజా కాదు, కానీ దీనికి 1918 స్పానిష్ ఫ్లూ యొక్క లక్షణాలను కలిగి ఉంది. సాపేక్షంగా తక్కువ ప్రాణాంతకం అని భావించారు.  కానీ కనికరం లేకుండా వ్యాప్తి చెందుతూ అమెరికాను కంటి మీద కునుకులేకుండా చేసింది. చైనా నుండి బయటకు వస్తున్న సెల్‌ఫోన్ వీడియోలు వుహాన్‌లో వ్యాప్తి చెందుతున్నప్పుడు ఏమి జరుగుతుందో చూపించాయి. ఆసుపత్రి అంతస్తులలో మృతదేహాలు, నిరాశతో ఏడుస్తున్న వైద్యులు, శ్మశానవాటికల వెలుపల గమనింపబడని శవపేటికలు. బీజింగ్ పాశ్చాత్య జర్నలిస్టుల వీసాలను నిలిపివేయడం మరియు నిర్బంధాలను విధింది - చైనా యొక్క ప్రజా ఆరోగ్య వ్యవస్థ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించి ప‌రిస్థితుల్ని అదుపులోకి తీసుకువ‌చ్చింది.    ఇప్పుడు కనీసం 160 మిలియన్ల అమెరికన్లు కాలిఫోర్నియా నుండి న్యూయార్క్ వరకు ఉన్న రాష్ట్రాల్లోనే ఉండాలని ఆదేశించారు. పాఠశాలలు మూసివేయబడతాయి, తరచుగా బార్‌లు, రెస్టారెంట్లు మరియు అనేక ఇతర వ్యాపారాలతో పాటు. అవసరమైన రక్షణాత్మక గేర్ మరియు పరికరాల సరఫరా తగ్గిపోతున్నప్పటికీ, న్యూయార్క్ నగరంలో పెరుగుతున్న రోగుల సంఖ్యను  ఆసుపత్రులు ఎదుర్కొంటున్నాయి.  ఇతర ఆసుపత్రులు, ఇతర సంఘాలు ఏమి రాబోతున్నాయో అని భయపడుతున్నాయి. "మేము ఈ వ్యాధికి  ప్రపంచ కేంద్రంగా ఉన్నాము" అని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ వద్ద అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ సారా కెల్లెర్ చెప్పారు. "ఇప్పుడు, మన ఇళ్ళలో వుండిపోవ‌డం ద్వారా సాధ్యమైనంతవరకు వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డం మనం చేయగలిగేది, ఒక దేశంగా, మేము వ్యక్తిగత రక్షణ పరికరాలు, పరీక్షకు అవసరమైన పదార్థాలు మరియు వెంటిలేటర్ల ఉత్పత్తిని పెంచుతాము." అమెరికా.. కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియని అయోమయంలో ఉంది. అమెరికాలో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ను కట్టడిచేయడానికి చర్యలు తీసుకుంటున్నా వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. కరోనా వైరస్ తీవ్రత అధికంగా న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్, లోవా, లూసియానా, ఉత్తర కరోలినా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలు భారీ విపత్తుగా ప్రకటించాయి. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదముద్ర కూడా వేశారు. భార‌త‌దేశంలో ఈ మహమ్మారి విజృంభిస్తోంది.  అత్యధిక మరణాలు కలిగిన దేశంగా భారత్ అమెరికాను అధిగమించవచ్చు. యునైటెడ్ స్టేట్స్ మాదిరిగా, ఇది కూడా లోతైన అంతర్గత విభజనలతో కూడిన విస్తారమైన ప్రజాస్వామ్యం. కానీ దాని జనాభా, 1.3 బిలియన్లు, చాలా పెద్దది, మరియు దాని ప్రజలు మెగాసిటీలలో ఇరుకైన గ‌దుల్లో రద్దీగా ఉన్నారు.

దూరదర్శన్ లో మ‌ళ్లీ రామాయణం!

శ‌నివారం నుంచి దూరదర్శన్ లో రామాయణం పునః ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. వరుస ప్రకటనలతో బోర్ కొట్టించకుండా సీరియల్ ప్రసారం చేయనున్నారు. అప్పట్లో రామాయణం సీరియల్ కు విశేష ఆదరణ లభించింది. ఇప్పటికీ ఆ సీరియల్ పట్ల ప్రజల్లో ఆదరణ వుంది. జనం పౌరాణిక సీరియల్ ను మరింతగా ఆదరిస్తారని దూరదర్శన్ వర్గాలు భావిస్తున్నాయి.  ప్ర‌స్తుతం కరోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో  సీరియ‌ల్‌ను శ‌నివారం నుంచి ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు జ‌వ‌దేక‌ర్ తెలిపారు.  ఈ సీరియ‌ల్ ప్ర‌తి రోజూ ఉద‌యం 9 గంట‌ల నుంచి 10 వ‌ర‌కు ఒక ఎపిసోడ్‌, ఆ త‌ర్వాత రాత్రి 9 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మ‌రో ఎపిసోడ్‌ను ప్ర‌సారం చేస్తారు.  తొలిసారి రామ‌య‌ణం సీరియ‌స్ 1987 నుంచి 1988 మ‌ధ్య కాలంలో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సారం అయ్యింది. ఈ సీరియ‌ల్ ఇండియ‌న్ టెలివిజ‌న్ రేటింగ్స్‌ను మార్చేసింది.

కరోనా లక్షణాలున్నాయని యువకుడిపై రాళ్లదాడి!

కరోనా వైరస్ మూలంగా ప్రపంచం బెంబేలెత్తుతోంది. కరోనా వల్ల మనుషులంతా సమానమేనని మళ్లీ తెలిసొచ్చిందని, కులం-మతం, పేద-ధనిక అనే తేడా లేకుండా.. అందరూ ఎప్పుడో ఒకసారి ఉత్తి చేతులతో పోవాల్సిందేనని.. కాబట్టి ఉన్నంత కాలం నిస్వార్థంగా బ్రతకాలి అంటూ పెద్దలు నీతి వాక్యాలు చెబుతున్నారు. అయితే ఇలాంటి నీతులు ఎంతమంది చెవికి ఎక్కుతున్నాయో తెలియదు కానీ.. కరోనా ప్రాణభయం మాత్రం చాలామంది మెదళ్ళకు ఎక్కింది. ఎంతలా అంటే ప్రాణభయంతో ఎదుటి వ్యక్తి ప్రాణం తీయడానికి కూడా వెనకాడనంతలా!. కర్ణాటకలోని ఉమ్నాబాద్‌కు చెందిన చంద్రకాంత్‌(35) సంగారెడ్డి జిల్లాలో నివసిస్తూ ప్యాసింజర్‌ ఆటో నడుపుతుంటాడు. అతను గురువారం నాడు రామచంద్రాపురం మండలం బండ్లగూడ సమీపంలో దగ్గుతూ స్పృహ తప్పి పడిపోయాడు. ఇది చూసిన స్థానికులు అతనికి కరోనా వచ్చిందేమోనన్న అనుమానం, తమకెక్కడ ఆ వైరస్‌ అంటుతుందేమోనన్న భయంతో అతనిపై రాళ్ల దాడి చేశారు. విషయం తెలుసుకున్న రామచంద్రాపురం పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని పటాన్‌చెరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన చూస్తుంటే కరోనా మనుషుల కన్నా ముందు వారిలోని మానవతాన్ని చంపేస్తుందేమో అనిపిస్తుంది. మనుషులకు ప్రాణ భయం ఉండటం సహజమే.. కానీ ఆ భయం ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసే అంత కౄరంగా మారకూడదు. దగ్గు, తుమ్ములు ఉన్న ప్రతి ఒక్కరికి కరోనా ఉన్నట్లు కాదు. ఒకవేళ అంతలా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి. అంతేకాని ఇలా దాడులు చేయకండి.