ఏపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ నియామకం

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైన సరే ఎక్కువ సీట్లు  గెలుచుకోవాలని అస్త్రాలను సిద్దం చేస్తోంది. సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ముందుగా పార్టీ నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలని రాష్ట్ర నేతలను ఆదేశించింది. తొలుత పార్టీలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయాలని నిర్ణయించింది.  మాణిక్కం ఠాగూర్ ఛైర్మన్‌గా 25 మంది సభ్యులతో  ఏపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏఐసీసీ నియామించింది. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జేడీ శీలం మస్తాన్ వలీ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ జననల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభిస్తాం : లోకేష్

  మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా భవిష్యత్ లో అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో “సోలార్, విండ్ ఎనర్జీ టాలెంట్ హబ్ గా ఆంధ్రప్రదేశ్” అనే అంశంపై ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, స్వనీతి ఇనీషియేటివ్ సంయుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ కు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. ఈ కాన్ఫరెన్స్ కేవలం దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ ను శక్తివంతం చేయడం, సౌర, పవన శక్తికి నైపుణ్య హబ్ గా ఏపీని తీర్చిదిద్దడమే కాదు.. ప్రపంచ గ్రీన్ ఎనర్జీ  భవిష్యత్ ను శక్తివంతం చేసే దిశగా ఈ కాన్ఫరెన్స్ ను నిర్వహించడం జరుగుతోంది. తద్వారా మన యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.  యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు అందరం కష్టపడి పనిచేస్తున్నాం దేశంలో ఏ పార్టీ సాధించని విధంగా కూటమి ప్రభుత్వం 94శాతం స్ట్రైక్ రేట్ తో 164 సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. ఇందుకోసం అందరం కష్టపడి పనిచేస్తున్నాం. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. క్లస్టర్ విధానంలో పెట్టుబడులను ఆకర్షిస్తాం.  ఇందుకు కావాల్సిన ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తాం. అనంతలో ఆటోమొబైల్, కర్నూలు రెన్యువబుల్ ఎనర్జీ, కడప, చిత్తూరును ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, నెల్లూరులో ఎయిర్ కండిషనర్స్ వంటి స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రకాశం జిల్లాను సీబీజీ హబ్ గా, గుంటూరు, కృష్ణాను క్యాంటమ్ వ్యాలీ హబ్ గా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను ఆక్వా హబ్ గా, ఉత్తరాంధ్రను ఫార్మా, డేటా సెంటర్, ఐటీ హబ్ గా, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు చేస్తాం. ప్రతి వంద కి.మీలకు ఓ క్లస్టర్ ఏర్పాటుచేసి ఆయా రంగాల్లో టాప్ 20 కంపెనీలను తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నాం. దీంతో పాటు నైపుణ్యం పెంపు, నవీన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.   సెప్టెంబర్ 1వ తేదీన నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభిస్తాం రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ప్రైవేటు సెక్టార్ తో నైపుణ్యం గల యువతను అనుసంధానించాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభించడం జరుగుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, సీడాప్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తాం. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.  పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్రం చొరవ తీసుకుని యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తాం. అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. నా ఛాలెంజ్ ను స్వీకరించి సుజ్లాన్ సంస్థ ఇప్పటికే 2 నైపుణ్య శిక్షణా కేంద్రాలను నిర్మించింది. అవి ఇప్పటికే పనిచేస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ రంగం ద్వారా యువతకు విస్తృత అవకాశాలు గ్రీన్ ఎనర్జీ రంగం ద్వారా మహిళలకు వారి గ్రామాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యువగళం పాదయాత్ర సమయంలో అనంత జిల్లాలోని కియా యాన్సిలరీ యూనిట్స్ లో మహిళలు పనిచేయడం చూశాను. ఓ మహిళ నా వద్దకు వచ్చి నాతో పాటు నడిచారు. ఏం చేస్తున్నారని ఆ మహిళను ప్రశ్నించగా.. తాను కియా యాన్సిలరీ యూనిట్స్ లో పనిచేస్తున్నానని, గతంలో సాధారణ గృహిణిగా ఉన్న తాను ఇప్పుడు నెలకు రూ.40వేలు సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలిచానని గర్వంగా చెప్పారు.  ఇప్పుడు కుటుంబంలో తనకు ఎంతో గౌరవం దక్కుతోందని చెప్పారు. ఒక్క కియా పరిశ్రమ వల్ల అనంతపురం జిల్లాలో వచ్చిన మార్పు ఇది. గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయి. అందుకే విండ్, సోలార్, రెన్యువబుల్, పంప్డ్ స్టోరేజీ, సీబీజీ ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టిసారించాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై  సీఎం చంద్రబాబు  చాలా పట్టుదలతో ఉన్నారు. దీనిని చాలా ప్రాముఖ్యతగా తీసుకున్నాం. ఇందుకోసం ప్రైవేటు సెక్టార్ తో కలిసి పనిచేస్తాం. ఓంక్యాప్ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు  

విశాఖ జీవీఎంసీ స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం

  విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయి. మొత్తం 10 స్థానాల్లో తొమ్మిది కైవసం చేసుకున్న కూటమి కేవలం ఒక్క స్థానం మాత్రం వైసీపీకి దక్కింది. అంటే 8 స్థానాల్లో టీడీపీ, ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ అతి కష్టం మీద ఈ సీటును గెలుచుకుందని తెలుస్తోంది. ఇక ఈ జీవీఎంసీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.  ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మొత్తం 92 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అయితే గతేడాది స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూటమి క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం కూటమి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది. జీవీఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను ఇప్పటికే కూటమిలోని పార్టీలు కైవసం చేసుకున్నా సంగతి తెలిసిందే. 

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

  తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధ‌వారం శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.  అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి, వ‌కుళమాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనులవారికి, యోగ‌న‌ర‌సింహ‌స్వామి వారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.  అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. 

భారత్‌కు ట్రంప్ మరో బిగ్ షాక్

  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌కు మరో బిగ్ షాక్ ఇచ్చారు. మరో 25 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన మన దేశంపై 25 శాతం సుంకాలు విధించారు. దీనికి అదనంగా సుంకాలు ఉంటాయిని ఇటీవల ప్రకటించారు. ఈక్రమంలో ఇప్పటికే 25 శాతం సుంకాలను విధించి.. దానిని ఇప్పుడు 50 శాతానికి విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు.  రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హూస్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ పరిణామాల తర్వాత కూడా.. రష్యా నుంచి ఇంకా ఆయిల్‌ కొనుగోలు చేస్తున్నందునే ఆయన మరో 25 శాతం టారిఫ్‌తో తాజా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు 50 శాతానికి చేరాయి. తాజా సుంకాల పెంపుపై అర్ధరాత్రి తర్వాత ఆయన అధికారికంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. 

డాక్టర్ నమ్రతపై మరో కేసు నమోదు.. నేడు 9 మంది అరెస్టు

  సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత కేసులో అక్రమాలు ఒక్కొ క్కటిగా బయటప డుతున్నాయి. ఇప్పుడు తాజాగా డాక్టర్ నమ్రతపై మరో కేసు నమోదు అయింది... ఈ నమ్రత అలాంటి ఇలాంటి లేడీ డాక్టర్ కాదు... ఒకవైపు పిల్లల్ని అమ్మే గ్యాంగ్ తో సంబం ధాలు పెట్టుకోవ డమే కాకుండా మరోవైపు గాంధీ హాస్పిటల్ లో పని చేస్తున్న అనస్థీ షియా డాక్టర్ ను గుప్పిట్లో పెట్టుకుంది... పేదవారి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని... వారికి డబ్బు ఆశ చూపించి... పిల్లల్ని కొనుగోలు చేసింది. అంతటితో ఆగలేదండోయ్ ఈ లేడీ కిలాడీ డాక్టర్... ఏకంగా సికింద్రా బాద్ కు చెందిన ప్రముఖ గైనకా లజిస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లో కన్సల్టెంట్ గా పని చేస్తున్న వైద్యురాలి లెటర్ హెడ్ లను  వినియోగించింది... తన వద్దకు వచ్చిన.. పేషెంట్లకు ఆ లెటర్ హెడ్  మీద మందులు, ఇంజక్షన్లు రాసి ఇచ్చేది... అయితే తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ లను చూసి వైద్యాలు ఒక్కసారిగా అవ్వక్కయ్యారు.  నా లెటర్ హెడ్ లను ఎటువంటి అనుమతి లేకుండా డాక్టర్ నమ్రత ఉపయోగించిందని ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యురాలు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గోపాలపురం పోలీసులు నమ్రతపై మరో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు సృష్టి టెస్టిట్యూబ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఈరోజు పోలీసులు ఈ కేసులో మరో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. దీంతో అరెస్టుల పర్వం 18 కి చేరుకుంది. ఘటన వెలుగులోకి రావడంతో... విదేశాలకు పారిపో యేందుకు ప్రయ త్నించిన లేడీ డాక్టర్ విద్యులత తో పాటు మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.  అరెస్టు చేసిన వీరందరినీ వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. మరికాసేపట్లో ఈ తొమ్మిది మందిని కోర్టులో హాజరుపర చానున్నారు. ఈ కేసులో డాక్టర్ నమ్రతను మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలని భావించిన పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు....86 మంది సరోగసీ దంపతుల వివరాలు సేకరించా లని.... అలాగే  సరోగసీ పేరుతో చైల్డ్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డ నమ్రత పిల్లలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న దానిపై విచారించాలని... అందుకే మరో మారు నమ్రతను కస్టడీలోకి తీసు కునేందుకు అను మతి ఇవ్వాలంటూ కోర్టును కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు..కెమిస్ట్రీ బాగాలేదని విడాకులు : వెంకయ్యనాయుడు

  దేశంలో ఉండే రాజకీయాలు, రాష్ట్రంలో ఉండే పరిణమాలపై ప్రజలు ఆలోచన చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. విజయవాడలో వల్లూరు శ్రీమన్నారాయణ అభినంద సభలో పాల్గోన్నారు. నేడు వివాహ వ్యవస్థపై కూడా నమ్మకం పోతుందని వెంకయ్య పేర్కొన్నారు. కుటుంబ, వివాహ వ్యవస్థ చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయన్నారు. ఇటీవల ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు..కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారని మాజీ ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు.  ఇప్పుడు ఏ నాయకులు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. చిన్న పిల్లలకు డైపర్లు మార్చినట్లు పార్టీలు మారుతున్నారని తెలిపారు.స్నేహం ఎలా ఉండాలి అంటే కంటికి కనురెప్ప లా ఉండాలని..శ్రీమన్నారాయణ స్నేహానికి పెట్టింది పేరు ఆయన అన్నారు. అదే విధంగా శ్రీమన్నారాయణ కూడా తను నమ్మిన పార్టీ కోసం పని చేశారు.. ఎటువంటి పదవులు ఆశించకుండా పని చేశారని తెలిపారు.

పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

  రాష్ట్రంలో మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆగస్ట్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. అర్హులైన నాయీ బ్రాహ్మణులకు చెందిన హెయిల్ సెలూన్లకు ఫ్రీ కరెంట్  అమలు చేయాలని మంత్రులు నిర్ణయించారు.  40వేల హెయిర్‌ కటింగ్‌ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25 నుండి నూతన రేషన్ కార్డులు పంపిణీకి కేబినెట్ మంత్రులు ఆమోదం తెలిపారు.  ఏపీ టూరిజంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని.. అరకు, భవానీ ఐలాండ్స్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. రూ.900 కోట్ల ఏపీ బీడీసీఎల్‌ రుణాలకు ప్రభుత్వ హామీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైష్ణవి ఇన్‌ఫ్రా కంపెనీకి 25 ఎకరాల టీటీడీ భూమిని ఇచ్చేందుకు క్యాబినెట్‌ అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. బీసీ వర్గాల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని చెప్పారు. మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం పెంచామన్నారు. 40వేల హెయిర్‌ కటింగ్‌ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు తెలిపారు.  ఫార్చ్యూన్-500 లిస్టులోని ఐటీ సంస్థలకు తక్కువ ధరకే భూములపై క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది.  

ఏపీలో అంబులెన్సులకు ఇక కొత్త రూపు, కొత్త రంగులు

ఆంధ్రప్రదేశ్ లో అంబులెన్సులు ఇక కొత్త రూపంతో కనిపించనున్నాయి. వైసీపీ హయాంలో రాష్ట్రంలో అంబులెన్సులకు వేసిన నీలం రంగును తొలగించి.. తెలుపు రంగుతో పాటు ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు రంగులతో రిఫ్లెక్టివ్ టేపులతో అందుబాటులోకి తీసుకురావాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించించింది. రూపం, రంగులు మార్చడమే కాదు అత్యాధునిక  సాంకేతిక పరికరాలను కూడా అమర్చి అంబులెన్సుల సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా దూసుకువస్తున్నాయి. ఈ కొత్త అంబులెన్సులకు సంజీవని అనే పేరు ఖరారు చేశారు. వీటిపై ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఫొటోలు ఉంటాయి. ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, అత్యాధునిక సాంకేతకతతో అంబులెన్సులు మరింత సమర్ధవంతంగా సేవలు అందిచనున్నాయని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. 

బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదు : సీఎం రేవంత్

  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన విషయంలో ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో మాట్లాడారు. మన పోటీ తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, టీబీజేపీ చీఫ్ రామచందర్‌రావుతో కాదు. నరేంద్ర మోదీ భారత ప్రభుత్వంపైనే.. ప్రధానికి సవాల్ విసురుతున్నాం  మా బీసీ రిజర్వేషన్ల డిమాండ్ ఆమోదించకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగరేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.  రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసి రిజర్వేషన్లు సాధించేవరకు నిద్రపోమని సీఎం తెలిపారు. బీసీ రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతిని అపాయింట్‌మెంట్‌ అడిగాం.. కానీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల కల్పనలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ తరహాలో దేశంలోనూ జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేశారు. తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని మోదీ, అమిత్‌షా చెప్పి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.  

నడిరోడ్డుపై లారీలో మంటలు.. పేలిన గ్యాస్ సిలెండర్లు

మంగళగిరిలో పట్టపగలు నడిరోడ్డుపై ఒక లారీ దగ్ధమై అందులో ఉన్న గ్యాస్ సిలెండర్లు పేలిన ఘటన స్థానికంగా ప్రజలలో తీవ్ర భయాందోళనలు కలిగించింది. ఈ ఘటన మంగళగిరి ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం (ఆగస్టు 6) చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీలో హఠాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆ లారీలో ఉన్న మూడు గ్యాస్ సిలెండర్లు భారీ శబ్డంతో పేలిపోయాయి. లారీ చూస్తుండగానూ పూర్తిగా దగ్ధమైంది. లారీ దగ్ధం కావడం, ఆ లారీలోని గ్యాస్ సిలెండర్లు పెద్ద శబ్బంతో పేలిపోవడంపై ఆ ప్రాంత ప్రజలు, జాతీయ రహదారిపై వెడుతున్న వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అదృష్ట వశాత్తూ ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు.   సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.  

పెన్సిల్ కోసం పిల్లల తగవు.. నిండు ప్రాణం బలి!

ఒక పెన్సిల్ కోసం ఇద్దరు పిల్లల ఘర్షణ పెద్ద వాళ్ల జోక్యంతో పెద్ద గొడవగా మారి నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా శెట్లూరు పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.  అనంతపురం జిల్లా శెట్టూరు లోని ఎర్రిస్వామి, మరియమ్మ దంపతుల కుమారుడు క్రిష్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగలి చదువుతున్నాడు. అదే పాఠశాలలో అదే తరగతి చదువుతున్న  అదే గ్రామానికి చెందిన  ప్రకాష్, ప్రమీల దంపతుల కుమారుడు గగన్ తో పెన్సిల్ విషయంలో గొడవపడ్డాడు.   పిల్లల తగవే కదాని వదిలేయకుండా  క్రిష్ తల్లిదండ్రలు బంధువులతో కలిసి గగన్ తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డారు. గగన్ ఇంటికి వెళ్లి మరీ కొట్టారు. ఈ దాడిలో గగన్ తండ్రి  ప్రకాష్ (37) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కల్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రకాష్ మృత్యువాత పడ్డారు. ప్రకాష్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన  ఎర్రిస్వామి సహా ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు.  

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్

  పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆపరేషన్ సిందూర్ తరువాత ఇరు దేశాల మధ్యా నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో పాక్ అభ్యర్థన మేరకు భారత్ సీజ్ ఫైర్ కు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ తరువాత తొలి సారిగా సరిహద్దుల్లో పాకిస్థాన్ ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ సైనికులు భారత సైనిక పోస్టులు లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. దాదాపు పావుగంట సేపు ఈ కాల్పులు జరిగాయి. అయితే భారత సైన్యం దృష్టి మళ్లించి ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం కల్పించడానికే పాక్ సైన్యం కాల్పులకు తెగబడి ఉంటుందని భావిస్తున్న ఇండియన్ ఆర్మీ బోర్డర్ లో హై అలర్ట్ ప్రకటించింది.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట.. ప్రభుత్వానికి NHRC నోటీసు

  తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి రామకృష్ణారావుకి జాతీయ మానవ హక్కుల సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తు తీరుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చింది. ఈ ఘటనపై ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది. ముందే చర్యలు తీసుకోని ఉంటే తొక్కిసలాట ఘటన జరిగేది కాదు అని పేర్కొంది. నిష్పక్షపాతంగా దర్యాప్తు పూర్తిచేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ని ఆదేశించింది. గత ఏడాది పుష్ప -2 మూవీ ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్‌లో ప్రదర్శించారు. అయితే అదే సమయంలో థియేటర్‌ వద్దకు హీరో అల్లు అర్జున్ రావడంతో ఆయనను చూడటానికి భారీగా ఫ్యాన్స్  చేరారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూడటానికి వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై రేవతి కుటుంబానికి పుష్ప మూవీ టీమ్ పరిహారం అందజేసింది. గతంలో ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతీ తెలిసిందే.

పొలిటికల్ ఎంట్రీపై హీరో సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  ఏపీలో కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందని సినీ నటుడు సుమన్ వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఆయన ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు చాలా సమయం ఉందని... ఎన్నికల గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలంటే ప్రభుత్వాలకు అందరూ మద్దతివ్వాలని సూచించారు.  దేశంలో కొన్ని రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయని... ఆ ఎన్నికల గురించి  తర్వాత ఆలోచిస్తానని తెలిపారు. తాను తమిళనాడులోనే పుట్టి పెరిగానని... అందుకు తనను అక్కడ పోటీ చేయమని అడిగారని... అయితే, తర్వాత చెబుతానని తాను వారికి చెప్పానని తెలిపారు. సుమన్ ఇవాళ గుంటూరులో పర్యటించారు. 

మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు

  తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల నరనరాల్లో కుల పిచ్చి పాతుకుపోయిందని మంత్రి ఆరోపించారు.  42 శాతం బీసీ రిజర్వేషన్ల  సాధన కోసం ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్  వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది మూర్ము వితంతు మహిళ అని ప్రధాని మోదీ పిలవలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆమె గిరిజన మహిళ అని అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదని కొండా సురేఖ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రపతి వంటి గౌరవ పదవిపై జరిగిన వ్యాఖ్యలపై సమాజంలో అన్ని వర్గాల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

అసెంబ్లీకి వెళ్లుటయా.. మానుటయా.. కింకర్తవ్యం?.. కేసీఆర్ మథనం!?

అటు చూస్తే బాదం హల్వా,  ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ ఎంచుకునే సమస్య కలిగిందొక విద్యార్థికి.. అంటారు మహాకవి శ్రీశ్రీ తన సంధ్యా సమస్యలు కవితలో.. ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎటూ తేల్చుకోలేని సమస్యతో మథనపడుతున్నారు.  ఔను ఇప్పుడు ఆయనకు పెద్ద చిక్కు సమస్యే ఏదురైంది.   అసెంబ్లీకి వెళ్లుటయా? మానుటయా అన్నది తేల్చుకోలేక తీవ్రంగా మథన పడుతున్నారంటున్నారు పరిశీలకులు.  అసలు అసెంబ్లీకి వెళ్లుటయా? మానుటయా అన్న సంశయంతో కేసీఆర్ మథనపడటమేంటి? అసలాయన గత ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత రెండు సార్లు వినా అసెంబ్లీకి వెళ్లిందే లేదుగా అనుకుంటున్నారా? అ విషయానికి వద్దాం.  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్లకుంట్ల చంద్రశేఖరరావుకు గొప్ప చిక్కే వచ్చి పడింది. పార్టీ  పరాజయం తరువాత దాదాపుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ రాజకీయంగా ఏ మాత్రం క్రియాశీలంగా వ్యవహరించలేదు. పార్టీ వ్యవహారాలలోనూ అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి హాజరయ్యే బాధ్యతనూ విస్మరించారు. పార్టీ పరాజయం తరువాత ఆయన కేవలం రెండంటే రెండు సార్లు అసెంబ్లీకి హాజరయ్యారు. అప్పుడు కూడా నోరెత్తి మాట్లాడలేదు. మరి ఇప్పుడు అసెంబ్లీ హాజరవ్వాలా వద్దా అన్న మీమాంశ ఎందుకంటే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాలలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించి.. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ నివేదికను అనుసరించి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతికి బాధ్యులపై చర్యకు నిర్ణయం తీసుకుంటారు.  కాళేశ్వరంలో చాలా అవకతవకలు, అవినీతి జరిగిందంటూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికపైనా తెలంగాణ అసెంబ్లీ చర్చించబోతోంది. అయితే ఆ నివేదిక అంతా బూటకమని మాజీ మంత్రి హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు కొట్టి పారేస్తున్నారు.  నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ నిపుణులు డిల్లీ నుంచి వచ్చి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను పరిశీలించి ఆ మూడు చాలా ప్రమాదకరంగా మారాయని నివేదిక ఇస్తేదానిని బీజేపీ కుట్రగా అభివర్ణించారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదికనున కాంగ్రెస్ నివేదిక అంటున్నారు. అయితే ఈ  నివేదికపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ  ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తే ఆ సమావేశాలకు కేసీఆర్ హాజరై నివేదికను ఎండగడతారని చెబుతున్నారు. ఇక్కడే కేసీఆర్ కు చిక్కు వచ్చింది. దాదాపు ఏడాదిన్నరకు పైగా అసెంబ్లీ సమావేశాలకు రాని కేసీఆర్.. ఇప్పుడు సమావేశాలకు హాజరై తనను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించడానికి రెడీ అయిపోవడం, ఒక వేళ నివేదిక ఆధారంగా తనపై చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే సుప్రీం కోర్టు వరకూ వెళ్లైనా న్యాయం కోసం పోరాడతాం అనడంపై పరిశీలకులే కాదు, సామాన్య ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు.   ఇంతకాలం ప్రజా సమస్యలను కనీసం పట్టించుకోకుండా ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్.. ఇప్పుడు కాళేశ్వరం కేసు తన మెడకు చుట్టుకునే పరిస్థితి రావడంతో తగుదునమ్మా అని అసెంబ్లీకి హాజరై తనను తాను సమర్ధించుకుంటూ గళమెత్తితే ప్రజలకు ఏం సంకేతమించినట్లు అవుతుందని కేసీఆర్ భయపడుతున్నారట. మాజీ ముఖ్యమంత్రిగా, పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధినేతగా, ఒక ఎమెల్యేగా ఈ ఏడాదిన్నర కాలం కేసీఆర్ ప్రజాసమస్యలపై గళమెత్తి, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై తన వాణిని వినిపించి ఉంటే.. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో తనను తాను సమర్ధించుకొనే విషయంలో జనం నుంచి ఎటువంటి అభ్యంతరాలూ వచ్చి ఉండేవి కావు. కానీ అలా చేయకుండా కేవలం తన సమస్యే రాష్ట్ర సమస్య అన్నట్లు ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ప్రభుత్వాన్నీ, కమిషన్ నివేదికనూ సభ వేదికగా ఎండగడతానంటే జనం తనను స్వార్థపరుడిగా భావిస్తారన్న సంశయం కేసీఆర్ ను వేధిస్తున్నదంటున్నారు. అలాగని కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చకూ డుమ్మా కొడితే.. తన హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలకు సమాధానం చెప్పుకోలేక భయపడి ఫామ్ హౌస్ లో దాక్కున్నారన్న నిందను మోయాల్సి వస్తుందన్న భావనా ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని అంటున్నారు. దీంతో కేసీఆర్ ఎంచేయాలో తెలియని పరిస్థితుల్లో దిక్కుతోచక ఆందోళనకు గురౌతున్నారని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట.  

సీఎం రేవంత్‌ భాష మార్చుకోవాలి.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  సీఎం రేవంత్‌రెడ్డిపై మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి తన భాష  హావభావాలను మార్చుకోవాలని ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు చెప్పాలని తెలిపారు. రేవంత్ రెడ్డి గంటలు గంటలు మాట్లాడకుండా.. ఆ శ్రద్ధ పని మీద చూపించాలని హితవు పలికారు.  ఇంకో మూడున్నర ఏళ్లు ఆయనే సీఎం.. ఆ తర్వాత ఎవరు అనేది అధిష్టానం, ప్రజలు నిర్ణయిస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి పదవిపై తనకు అధిష్ఠానం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.  రేవంత్ వెనుకాల 20 మంది ఆంధ్రా పెట్టుబ‌డిదారులు ఉన్నార‌ని రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.