ప్రత్యాన్మాయం ఎవరో సాగర్లో తేలుతుందా?
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార తెరాసకు ప్రత్యాన్మాయం ఎవరన్న ప్రశ్నకు సమాధనం చిక్కినట్లే కనిపించింది. దుబ్బాకలో అధికార పార్టీ సిట్టింగ్ సీటు గెలుచుకోవడంతో పాటుగా జీహెచ్ఎంసీలోఅధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన, బీజేపీనే తెరాసకు ప్రత్యాన్మాయం అని ప్రతి ఒక్కరూ ఫిక్సయి పోయారు. కానీ, ఇంతలోనే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలదళం కేసీఆర్ ఎత్తుకు చిత్తయి,బొక్కబోర్లా పడింది.దుబ్బాక, జీహెచ్ఎంసీ ఊపు మీద హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ సిట్టింగ్ సీటుతో పాటుగా, ఖమ్మం,వరంగల్, నల్గొండ సీటు మీద కూడా కన్నేసిన కమల దళానికి కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్లుగా, సిట్టింగ్ సీటు కూడా చేజారి పోయింది. అదే క్రమంలో వచ్చిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కమలదళాధిపత్యాన్ని, ప్రత్యాన్మాయ స్టేటస్’ను మరోమారు ప్రశ్నార్ధకం చేసింది.దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరసగా మూడు నాలుగు స్థానాలకు దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీ, నాగార్జున సాగర్’లో ఎన్నికలకు ముందే, బీజీపీని రేసులోంచి తప్పించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి బరిలో దిగడమే కాకుండా, గైలుపు మీద ధీమాతో ముందుకు సాగడంతో సాగర్’లో పోటీ తెరాస,కాంగ్రెస్ పార్టీల మధ్యనే అనే పర్సెప్షన్ క్రియేట్ అయింది. నిజంగానే,జానా రెడ్డి గెలిచినా గెలవక పోయినా బీజేపీది మూడో స్థానమే అనేది అయితే, ఇంతవరకు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో తెరాసకు ప్రత్యాన్మాయం ఎవరన్న ప్రశ్న మళ్ళీ మొదటికొచ్చింది.
అయితే, ఓ వంక సాగర్’లోనూ సత్తాచాటుతామని అంటూనే, బీజేపీ నాయకులు మరో వంక నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ఒక ఎక్సెప్షనల్ కేసుగా పరిగణించాలని కూడా అంటున్నారు.ఒక విధంగా అది నిజమే కావచ్చును, అక్కడ కాంగ్రెస్ కంటే జానా ఇమేజే ఎక్కువగా కనిపిస్తోంది. జానా కూడా తన పర్సనల్ ఇమేజినే ఫోకస్ చేస్తున్నారు కానీ,కాంగ్రెస్ పార్టీ ఇమేజిని ఫోకస్ చేయడం లేదు. మాజీ ఎమ్మెల్యేగా,మంత్రిగా నియోజక వర్గానికి చేసిన సేవలు,మంచి పనులు చెప్పుకుంటూ ఒంటరి పోరాటం చేస్తున్నారే కానీ, కాంగ్రెస్ పార్టీని గానీ,పార్టీ నాయకత్వాన్ని కానీ, పెద్దగా ప్రచారానికి వాడుకోవడంలేదు. ఒక విధంగా జానా,’ సింహం టైపులో సిగిల్’గానే ఫైట్ చేస్తున్నారు. అలాగే ఇతర నాయకులు కూడా, అంతగా పట్టించుకోవడం లేదు. ఎదో మొక్కుబడిగా ఒకటి రెండు సభలు ఏర్పాటు చేయడమే తప్ప,పీసీసీ స్థాయిలో ప్రచారం వ్యూహం,ప్రచార బాధ్యతలు ఉన్నట్లు కనిపించడం లేదు. సరే, అది ఎలా ఉన్నా, ఒక వేళ సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ మూడవ స్థానానికే పరిమితం అయినా, దాన్నిజనరలైజ్ చేయలేమని, కమల దళం ఇప్పటి నుంచే మరో లాజిక్ ‘ను ముందుకు తెస్తోంది.అయితే, జానా రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చాలామందే ఉన్నారు. అలాగే, దుబ్బాకలో బీజేపీ విజయం కూడా రఘునందన రావు వ్యక్తిగత విజయమని అనుకోవలసి వస్తుంది. సో ... స్టేట్’లో తెరాసకు ప్రత్యాన్మాయం తామే అని నిరూపించుకోవాలంటే సాగర్ సీటును గెలుచికోవడం ఒక్కటే కమల దళం ముందున్న ఆప్షన్, అది అయ్యే పనేనా,అంటే కాదనే సమాధానమే వస్తోంది.