ఆ ప్రచారంపై నేనేం మాట్లాడను : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరే విషయంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం, బీజేపీలు దగ్గరౌతున్నాయనీ, తెలుగుదేవం ఎన్డీయే గూటికి చేరనుందని వస్తున్న వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. దానికి తాను కాదు.. అలా ప్రచారం చేసిన వారే బదులివ్వాలన్నారు. ఈ విషయంపై తాను ఇప్పుడు స్పందించబోనని చంద్రబాబు పేర్కొన్నారు. నాడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకేనని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ నష్టపోయిన దాని కన్నా ఇప్పుడు జగన్ పాలనలోనే ఎక్కువ నష్టపోయిందని ఆయన అన్నారు.   తానేం చేసినా, ఎ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. తాను కేంద్ర రాజకీయాలను కూడా ఈ కోణంలోనే  చూస్తామని చంద్రబాబు అన్నారు. తాను పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ రెండుసార్లు నష్టపోయిందని... రాష్ట్రానికి మంచిపేరు తేవాలనే తపనతో వ్యక్తిగతంగా కూడా నష్టపోయామని అన్నారు. సంక్షేమ పథకాలపై టీడీపీ ఎంతో దృష్టిపెట్టిందని... మళ్లీ అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం ఇస్తామన్నారు.   తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కోడానికి తెలుగుదేశంతో చెలిమికి బీజేపీ సంసిద్ధత   వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయేలో చేరడంపై చంద్రబాబు స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ఎన్డీయేలో చేరిక వార్తలను చంద్రబాబు పూర్తిగా ఖండించలేదు.. అలాగని సమర్ధించనూ లేదు. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో గత మూడేళ్లుగా జగన్ పాలనలో రాష్ట్రం అధోగతికి చేరిందని చంద్రబాబు అన్నారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని పునరుద్ఘటించారు. అందు కోసం ఏమైనా చేస్తామన్నారు. తన సొంత నియోజకవర్గంలో జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ విధ్వంసం సృష్టిస్తున్నారని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ జగన్, ఆయన పార్టీ ప్రచారం చేస్తున్నాయన్నారు. అసలు సంక్షేమం మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ అనీ, అటువంటిది తాను సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు నిలిపివేస్తానని చంద్రబాబు ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధి తనకు రెండు కళ్లు అని చెప్పారు.

 ముంబైలో మ‌హిళ‌పై ఎంఎన్ ఎస్ దాడి

రాజ‌కీయ‌పార్టీలు త‌మ ప్ర‌చారంలో భాగంగా రోడ్ల‌కి అడ్డంగానో, ప‌క్క‌నో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్ట‌డం మామూలే. కానీ ప్ర‌జ‌లకు ఇబ్బంది లేనంత‌వ‌ర‌కే. తాము బ‌ల‌వంతుల‌మ‌ని అతిగా వ్య‌వ‌హ‌రించ‌డం ప్ర‌జ‌లు స‌హించ‌రు. ముంబైలో  అదే జ‌రిగింది. కానీ పోలీసులు, ఆ ప్రాంతంవారూ ప‌ట్ట‌న‌ట్టే ఉండ‌డం విచిత్రం.  ముంబైలో ముంబా దేవి ప్రాంతంలోని తన మందుల దుకాణం ముందు ప్రచార స్తంభాన్ని, బోర్డులు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయవద్దని మహిళ మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలను కోరింది.  రాజ్ థాకరే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ ఎస్‌)కార్యకర్తలు ఒక మహిళను నెట్టడం చెప్పుతో కొట్టడం చూపించే వీడియో వైరల్ అయ్యింది. ప్రకాష్ దేవి అనే మహిళ ఆగస్ట్ 28న వినోద్ అర్గిలే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ కార్య‌క‌ర్త‌లు ప్రచారబోర్డుల కోసం స్తంభాన్ని ఏర్పాటుచేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వీడియోలో, కొంతమంది మిస్టర్ ఆర్గిల్‌ను దూరంగా లాగడం కనిపించింది, కానీ అతను దాడి చేయడం, కొట్టడం, నెట్టడం  కొనసాగించాడు, ఆ సమయంలో ఆమె వీధిలో పడిపోయింది. 80-సెకన్ల  క్లిప్‌ను వీడి యో చూపింది.  దారిలో వెళ్లేవారు జోక్యం చేసుకోలేదు. ఏమీ ప‌ట్ట‌న‌ట్టే సినిమా చూసిన‌ట్టు చూశారు. కానీ ఎవ్వ‌రూ అడ్డుకోలేదు.  ఆలయానికి ప్రసిద్ధి చెందిన ముంబా దేవి ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు వెదురు స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు, అయితే ప్రకాష్ దేవి తన మందుల దుకాణం ముందు వాటిని ఏర్పాటు చేయవద్దని చెప్పారు. తనపై శారీరకంగా దాడి చేయడమే కాకుండా, ఎంఎన్ఎస్ కార్య‌క‌ర్త‌లు వినోద్ ఆర్గిల్ నాయ‌ క‌త్వంలో విరు చుకుప‌డి,   తనపై కూడా దుర్భాషలాడారని ఆమె ఆ తర్వాత చెప్పారు. దాడి జరిగిన మూడు రోజుల తర్వాత ఆగస్టు 31న ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించామని, త్వరలో చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ సంఘ‌ట‌న గురించి ఎంఎన్ ఎస్ పార్టీ అధినేత రాజ్ థాక్రే ఎలాంటి ప్ర‌కట‌నా  చేయలేదు. 

కేసీఆర్ రాజకీయ వ్యవసాయం.. ఆ మూడు రాష్ట్రాలపైనే గురి!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం వెనక ఒక వ్యూహం ఉంటుంది. ఒక ఎత్తుగడ ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్  26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులను హైదరాబాద్ కు పిలిపించుకుని, మూడు రోజుల పాటు చర్చలు జరిపారు. విందు వినోదాలతో చక్కని ఆతిధ్య మిచ్చారు. శాలువాలు కప్పి సన్మానాలు చేశారు.  ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ లో నిర్వహించిన ఈ మూడు రోజుల రైతు వేడుకలకు, సర్కార్ ఖజానా నుంచి తెలంగాణ ప్రజల సొమ్ము ఎన్ని కోట్లు  ఖర్చైదో, ఏమో మనకు తెలియదు. ఎందుకంటే శ్రీ సర్కార్ వారు చెప్పలేదు. చెప్పరు. అదొకటి అలా ఉంటే, అన్ని రాష్ట్రాల రైతు నాయకులను విమానాలు ఎక్కించి తీసుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి, ఒక్క ఆహ్వానం పంపిస్తే రెక్కలు కట్టుకుని వచ్చి వాలే, తెలంగాణ రైతు రైతు సంఘాల నాయకులను మాత్రం ఎందుకనో పిలవలేదు.  ఎందుకనో ఏముంది , పిలిస్తే, అందరి ముందు అసలు బండారం బయట పడుతుందనే. అందుకే రాష్ట్ర రైతులను రైతు వేడుకలకు దూరంగా ఉంచారని అంటున్నారనుకోండి అది వేరే విషయం. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎందు కోసం దేశంలో ఉన్న రైతు నాయకులు అందరినీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, అంటే, అందుకు సమాధానం వెతుక్కోవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం జాతీయ రాజకీయాలపై కేంద్రీకృతమై వుంది. రాష్ట్రంలో వీస్తున్న ఎన్నికల ఎదురు గాలిని తట్టుకోవాలన్నా, రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎదురవుతున్న సమస్యల నుంచి బయట పడాలన్నా, మరీ ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం ఎదుర్కుంటున్న అవినీతి ఆరోపణల ఉచ్చులోంచి బయటపడాలన్నా, జాతీయ రాజకీయాల పంచన చేరడం మినహా మరో దారి కనిపించడం లేదు. అందుకే, ఏదో విధంగా జాతీయ రాజకీయాలలో గుర్తింపు కోసం ఆయన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. అందులో భాగంగానే,  వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నాయకులను రప్పించి వారిచేతే, ఆహా వోహో అనిపించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.  జాతీయ రాజకీయాలలో కూసింత గుర్తింపు కోసం జాతీయ స్థాయిలో కాంగ్రెస్,బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు మొదలు, బీజేపీ ముక్త భారత్ నినాదంతో కొత్త పార్టీ లేదా ఫ్రంట్ ఏర్పాటు వరకు ఆయన చేయని ప్రయత్నం ఏదీ లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి జాతీయ పత్రికలు మీడియాలో ప్రచారం చేసుకున్నారు,. అదొకటనే కాదు,ఒక విధంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కాసింత గుర్తింపు కోసం రాజకీయ అష్టావధానం, శతావధానం ఒకేసారి చేస్తున్నారు..అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక ఎన్నికల్లో, భారత  రైతు సమితి (బీఆర్ఎస్) పేరిట రైతు నాయకులను ప్రయోగాత్మకంగా బరిలో దించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అందుకోసమే జాతీయ స్థాయిలో రైతు వేదిక ఏర్పాటు పేరిట  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చని కేసీఆర్ ఆలోచనలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.  అలాగే, ఈ మూడు రాష్ట్రాలను ఎంచుకోవడంలోనూ కేసీఆర్ మార్క్ రాజకీయం ఉన్నది అంటున్నారు. . ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉంది. తెలంగాణలో అమలవుతున్న రైతు భీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్, వంటి పథకాలను ప్రచారం చేసుకోవడంతో పాటుగా బీజేపీ వ్యతిరేక  ప్రచారం చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో బీజేపీ నేతలు గుజరాత్ మోడల్ పేరుతో జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు. ఇప్పుడు అదే విధంగా తెలంగాణ మోడల్‌ను తెరపైకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆయా రాష్ట్రాల్లో రైతుల నేతలు అభ్యర్థుల గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ... ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆ మూడు రాష్ట్రాలలో ప్రచారం చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ పై  చర్చ జరిగేలా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అది సాధ్యమేనా? ఒక జాతీయ పార్టీతో పట్టుమని పది పార్లమెంట్ స్థానాలు లేని ఒక ప్రాంతీయ పార్టీ పోటీ పడటం అయ్యే పనేనా , అంటే, ఏమో ..  గుర్రం ఎగరావచ్చు .. అంటున్నారు.

 కొరియా పిల్లాడి నోట  జ‌న‌గ‌ణ‌మ‌న‌!  

ఉయ్యాల్లో పిల్ల‌కి జోల‌పాడుతుంది త‌ల్లి. త‌ల్లి పాట‌లు పాడుతూనే బువ్వాపెడుతుంది, బ‌డికీ పంపు తుంది. అలా వినీ వినీ పిల్లా ఏదో కూనిరాగాలాల‌పిస్తుంటుంది. అది గొప్ప పాటా కాక‌పోవ‌చ్చు, గొంతు ల‌తాదీ కాక‌పోవ‌చ్చు. కానీ అలా కూనిరాగాలతో రోజు గ‌డిపేయ‌డం అదో స‌ర‌దా. టెన్ష‌న్ త‌గ్గుతుంద‌న్న‌ది చాలా మంది మాట‌. క్ర‌మేపీ పాట సినిమా పాటే అవుతోంది. ఈరోజుల్లో అంతా ఫాస్ట్‌బీట్‌. రాగం ప‌ట్ట‌డానికి పెద్ద క‌ష్టాప‌డ‌క్క‌ర్లేదు. కానీ జాతీయ‌గీతాలు అలాకాదు. ఎన్నిత‌రాల‌యినా, ఎంత‌కాల‌మ‌యినా అది అలాగే పాడాలి. అదే శృతిలో, అదే ల‌య‌లో పాడాలి. ఎవ‌రి జాతీయ‌గీతం వారికి గొప్ప‌. భార‌తీయులం ద‌రికీ జ‌నగ‌ణ‌మ‌న వ‌చ్చి తీరుతుంది. కాకుంటే, సైన్యంలో ఉన్న‌వారు రోజూ తప్ప‌కుండా పాడుకుం టారు, వింటారు. సామాన్య జ‌నులు ఆగ‌ష్టు 15, జ‌న‌వ‌రి 26 త‌ప్ప మ‌రేరోజూ జాతీయ‌గీతం త‌ల‌వ‌నైనా త‌ల‌వ‌రు.  అస‌లు పిల్ల‌ల‌కు దేశ‌భ‌క్తి ఉండి తీరాల‌న్న రూలు ఎవ‌రూ ప‌నిగ‌ట్టుకుని బోధించే య‌త్నం చేయ‌రు. అది స్వ‌త‌హాగానే ఉంటుంది. ఎవ‌రి  త‌ల్లి వారికి గొప్ప అలాగే  దేశమూ! ఇటీవ‌ల బీజేపీ ప్ర‌భుత్వం ప‌నిగ‌ట్టు కుని ప్ర‌జ‌ల‌కు మ‌నం భార‌తీయులం గ‌నుక ప‌తాకాన్ని, జాతీయ‌గీతాన్ని రోజూ గుర్తుచేసుకోవాల‌న్న భారీ ప్రచారంతో దేశ‌భ‌క్తిని రాజ‌కీయ ల‌బ్ధికి బాగా ఉప‌యోగించుకుంటోంది. పిల్ల‌ల‌కు, యువ‌త‌కు జాతీయ గీతం కంటే సినిమాపాట‌లే తేలిగ్గా ఇష్టం, నేర్చుకుంటున్నారు. పాట‌ల పోటీలు అవే జ‌రుగుతున్నాయి. చిత్ర‌మేమంటే విదేశీయుల‌కు మ‌న భాష‌లు, మ‌న జాతీయ‌గీతం మీద మ‌క్కువ పెరిగింది. ఆమ‌ధ్య ఒక కొరియా మ‌హిళ హిందీ నేర్చుకుంది, మ‌రో మ‌హిళ ప‌కోడీ చేయ‌ డం నేర్చుకుంది. ఇపుడు ఇంకో మ‌హిళ త‌న పిల్లాడికి ఏకంగా భార‌త్ జాతీయ గీతం నేర్పించ‌డంలో త‌ల‌మున‌క‌ల‌యింది! విదేశీ ప‌ర్యాట‌కుల‌కు తాము వెళ్లిన దేశాల్లో త‌మ‌కు బాగా న‌చ్చిన‌వి, త‌మ‌ను ఎంతో ఆక‌ట్టుకున్న అంశా లను మ‌రింత తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. కొంద‌రు డైరీ రాస్తారు, కొంద‌రు ఆయా ప్రాంతాల గురించి వ్యాసాలు రాస్తారు, నేర్చుకున్న పాటో, ప‌ద్య‌మో మ‌ళ్లీ నేర్చుకుని పిల్ల‌ల‌కూ నేర్పుతారు. వారికి అదో స‌ర‌దా. దీనికి భార‌త్ అంటే అపార‌మయిన అభిమానం ఉంద‌ని కాదు. కొన్ని విన‌సొంపుగా ఉండ‌ డం వ‌ల్ల సంగీత‌జ్ఞానం స‌హ‌జంగా ఉన్న‌వారికి ఇలాంటివి మ‌న‌సును హ‌త్తుకుంటాయి. అందువ‌ల్ల ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. దీనికి దేశీయులు, విదేశీయుల‌న్న తేడా లేదు. తెలుగు ఇష్ఠ‌ప‌డే గుజ‌రాతీయులు, గుజ‌రా తీని ఇష్ట‌ప‌డే బెంగాలీలు ఉన్న‌ట్టే మ‌న జాతీయ‌గీతాన్ని ఇష్ట‌ప‌డే  విదేశీయులు కూడా చాలా మందే ఉన్నారు.  కిమ్ అనే కొరియా మ‌హిళ త‌న పిల్లాడు ఆదికి   జ‌న‌గ‌ణ‌మ‌న నేర్పించి వాడితో క‌లిసి పాడుతూ వీడ‌యో రిలీజ్ చేసింది. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కిమ్ భ‌ర్త భార‌తీయుడు. అందువ‌ల్ల భార‌త్ గురించిన స‌ర్వవిశేషాలు ఆమెకి తెలిసే ఉంటుంది. వారికి ఆ దృష్టి ఉంటుంది. మ‌న‌కి గుజ‌రాత్ గురించి తెలియ‌క‌పోవ‌చ్చుగానీ, విదేశీయుల‌కు మాత్రం భార‌త్ గురించిన ప్ర‌త్యేక విశేషాల‌న్నీ తెలుసు కునే ఆస‌క్తి ఉంటుంది. 

కుప్పం వైసీపీలో డిష్యుం..డిష్యుం.. రక్తమోడిన విభేదాలు

సినిమాలో హీరో విల‌న్ వ‌ర్గాలు కొట్టుకుంటారు, వీధిలో రెండు వ‌ర్గాల‌వారు కొట్టుకుంటారు. ఒక్క వైసీపీలోనే వాళ్ల‌లో వాళ్లు కొట్టుకుంటున్నారు.  అయితే వైసీపీలో ఇటీవ‌లి   ప‌రిణామాల దృష్ట్యా ఇదేమీ పెద్ద వింత కాదు. ఈ మ‌ధ్య‌నే అనంత‌పురంలో పోలీసుల స‌మ‌క్షంలో ఏకంగా పోలీస్ స్టేష‌న్‌లోనే వైసీపీకి చెందిన రెండు వ‌ర్గాలు వారు కొట్టుకున్నారు. పోలీసులు అలా సినిమా చూసిన‌ట్టు చూస్తూనే ఉన్నారు. ఎవ‌రినీ నిలువరించడానికి వీలు కాలేదు. అంతా అయ్యాక కేసు రాసుకుని వ‌దిలించుకున్నారు. ఇపుడు తాజాగా మ‌రో కోట్లాట సీన్ తెర మీద‌కు వ‌చ్చింది.   ఇది ఏకంగా టీడీపీ అధినేత సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో జ‌రిగింది. విప‌క్షానికి చెందిన నియోజ‌క‌వ‌ర్గంలో అధి కార పార్టీ, విప‌క్ష వ‌ర్గీయుల మ‌ధ్య గొడ‌వ‌లో, కొట్లాటో ఉంటాయ‌ని అనుకుంటారు. కానీ   అధికార వైసీపీ ప‌క్షం వారి మ‌ధ్య‌నే గొడ‌వ జ‌రిగింది.  ఈ సంఘటనకు ముందు మూడు రోజుల పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఆయన పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ శ్రేణులుశతథా ప్రయత్నించాయి. అది అలా ఉంటే.. ఇప్పుడు కుప్పంలో వైసీపీలోనే వర్గపోరు రోడ్డున పడింది. ఇందుకు మూలం ఇటీవల వైసీపీ నియోజకవర్గ సమీక్షలో కుప్పం నియోజకవర్గం నుంచి వైసీపీ  అభ్యర్థిగాఎమ్మెల్సీ భ‌ర‌త్ కుమార్ సీఎం జగన్ ప్రకటించేశారు. అక్కడితో ఆగకుండా.. ఆయన గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తానని ప్రకటించారు. ఇదంతా వచ్చే ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం. అయితే రెండేళ్ల ముందే కుప్పం అభ్యర్థిని జగన్ ప్రకటించిన వ్యూహం వికటించింది.   కుప్పంలో  భరత్ వ్యతిరేక వర్గంలో ఈ ప్రకటనతో అసమ్మతి భగ్గుమంది. ఈ నేపథ్యంలోనే  భ‌ర‌త్  పీఏ మురుగేశ‌న్‌, వైస్ ఛైర్మ‌న్ మునుస్వామి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. బాబాబాహీ కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో మురుగేశ‌న్ తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రి పాలయ్యారు. ఇప్పటి వరకూ తెలుగుదేశం అధినేత తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి  నయానో భయానో నియోజక వర్గ ప్రజలను లొంగదీసుకోవాల చూస్తున్నారని వైసీపీ నాయ‌కులు తెలుగుదేశం పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.   మరోవైపు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే దాడులకు పాల్పడుతున్నారంటూ  టీడీపీ  వైసీపీ విమర్శిస్తోంది. వాటికి భిన్నంగా    గురువారం అధికార పార్టీ ఎమ్మెల్సీ భ‌ర‌త్ పిఏ మురుగున్‌పై వైసీపీ వర్గీయులే దాడి చేయడంతో ఆ పార్టీ పరువు అమాంతం గంగలో కలిసింది.  భ‌ర‌త్‌కి  టికెట్ ప్ర‌క‌టించిన ప్ప‌టి నుంచి కుప్పంలో అనేక‌మంది పార్టీ నిర్ణ‌యం ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారనడానికి ఈ సంఘటనే సాక్ష్యమని పరిశీలకులు అంటున్నారు.

తృణ‌మూల్ ని  వీడ‌ని ఈడీ.. మ‌రో మంత్రికి స‌మ‌న్లు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవ‌లం రాజ‌కీయ క‌క్ష‌తోనే విప‌క్షాల మీద‌కు ఈడీ, సిబిఐ వ్య‌వ‌స్థ‌ల‌ను ఉసి గొల్పుతోంద‌న్న ఆరోప‌ణ‌లు దేశ‌మంత‌టా విప‌క్షాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ఇటీవ‌ల తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ , కాంగ్రెస్ పార్టీల‌ను ఈడీలు వెంటాడుతున్నార‌నే చెప్పాలి. ఈ మ‌ధ్య‌నే తృణ‌మూల్ కాంగ్రెస్ అధి నేత మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు, పార్టీ కార్య‌ద‌ర్శి అభిషేక్‌ను ఆయ‌న భార్య‌ను ఈడీ ప్ర‌శ్నించింది.  ఇపుడు తాజాగా ఆ పార్టీ మ‌రో మంత్రి మోలాయ్ ఘ‌ట‌క్ కు ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. బొగ్గు  కుంభ‌కోణం కేసులో వీరిని ఈడీ విచారిస్తున్న‌ది. మంత్రి మోలాయ్  గతంలో  విచారణలో వివరాలు  చెప్పక పోవ డంతో అతన్ని మరోసారి విచారించాలని  ఈడీ  నిర్ణయించింది. మంత్రి మోలాయ్ తో పాటు టీఎంసీ ఎమ్మెల్యే మహతోకు  కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.  బొగ్గు అక్రమ రవాణా ఆరోపణలపై  అంత‌కుముందు  మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌  బెనర్జీకి  ఈడీ మంగళవారం సమన్లు జారీ చేసింది. విచారణ నిమిత్తం శుక్ర వారం ఉదయం కోల్‌కతాలోని కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించింది. ఈడీ అధికారులు ఎంపీ అభిషేక్ బెనర్జీని ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. విచారణలో భాగంగా అభిషేక్ బెనర్జీ భార్యకు , అతని కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్న రెండుసంస్థల విదేశీబ్యాంకు ఖాతాలపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఈవ్యవహారంలో అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీ విచార ణకు హాజరు కావా లని ఈడీ అధికారులు ఆదేశించారు. విద్యా సంస్థల్లో నియామకాల కుంభకోణం కేసులో పార్థ ఛటర్జీ ఇటీవల అరెస్టయ్యారు. తాజాగా గురు వారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఆమెకు  షాక్ ఇచ్చింది. ఆమెకు అత్యంత సన్నిహిత సహచరుడు, టీఎంసీ బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్‌ను అరెస్ట్ చేసింది.ఆవులను అక్రమంగా రవాణా చేసి నట్లు 2020 లో నమోదైన కేసులో ఆయనపై ఈ చర్య తీసుకుంది. ఆయనను అరెస్ట్‌ చేస్తున్నారన్న సమా చారంతో టీఎంసీ కార్యకర్తలు, మోండల్‌ మద్దతుదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. వారందరీ చెదర గొట్టి మోండల్‌ను అరెస్ట్‌చేసి తీసుకెళ్లారు. తమ ఎదుట హాజరు కావాలని ప‌ది పర్యాయాలు సమన్లు పంపినా అనారోగ్య కారణాలతో ఆయన రాలేదని సీబీఐ వెల్లడిం చింది.  దీంతో సీబీఐ కోర్టును ఆశ్ర యించింది. అంతకుముందు ఆయనను రెండు సార్లు సీబీఐ ప్రశ్నిం చింది. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, 2015 నుంచి 2017 మధ్య కాలంలో విదేశాలకు తరలిస్తుండగా 20 వేలకుపైగా ఆవుల తలలను  బిఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. దీనిపై సీబీఐ 2020లో కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో బీర్భూమ్ జిల్లాలో పలుచోట్ల సీబీఐ సోదాలు జరిపింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. 8 మంది ఐపిఎస్ లకు ఈడీ సమన్లు    ఇలా ఉండగా, గ‌తంలో  సుకేష్ జైన్, జ్ఞానవంత్ సింగ్, రాజీబ్ మిశ్రా, శ్యామ్ సింగ్, సెల్వ మురుగన్, కోటే శ్వర్ రావు వంటి టాప్ పోలీసులు సహా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎనిమిది మంది ఐపిఎస్ అధికారుల ను ఈడీ ప్ర‌శ్నించింది. పశ్చిమ బెంగాల్‌లో అక్రమ బొగ్గు మైనిం గ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసు కు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.ఈ కేసులో ఇది మూడో అరెస్టు.  అంతకుముందు, పశ్చిమ బెంగాల్ పోలీసు విభాగానికి చెందిన ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేశారు. 2021లో వారిపై చార్జి షీట్ కూడా దాఖలయింది. నిందితుడు గురుపాద మాజీని పిఎంఎల్ఎ చట్టంలోని సెక్షన్ 19(1) ప్రకారం అరెస్టు చేసినట్లు సీనియర్ ఈడీ  అధికారి ఒకరు తెలిపారు. ఈడీ  రోస్ అవెన్యూ కోర్టులో మాజీని హాజరు పరిచింది. కోర్టు అతడిని ఏడు రోజుల కస్టడీకి పంపింది. అతను పశ్చిమ బెంగాల్‌లోని అక్రమ బొగ్గు మైనింగ్ వ్యాపార కార్యకలాపాల కింగ్‌పిన్ అనుప్ మజీ భాగ స్వాములలో ఒకడు. మజీ, అతని సహచరుల నుండి అక్రమ బొగ్గు గనుల వ్యాపారం ద్వారా వచ్చిన నేరాల ద్వారా రూ. 66 కోట్లకు పైగా మాజీ అందుకున్నాడు. ఇంకా, అతను వసతి ఎంట్రీలను తీసుకునే ఉద్దేశ్యంతో షెల్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి కోల్‌కతాకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్‌కు రూ. 26 కోట్ల నగదు అందించాడ‌ని ఈడీ  అధికారి తెలిపారు. ఇవి రాజకీయ వేధింపులేనని అభిషేక్‌ ఆరోపించారు. ఈడీ నోటీసులు పంపిస్తుందని మమతా బెనర్జీ ముందే అన్నారని, అలాగే జరిగిందని తృణమూల్‌ నేత సౌగత్‌ రాయ్‌ గుర్తుచేశారు. 

అనుకున్నదొకటి ..అయినది ఇంకొకటి.. కేసీఆర్ బీహార్ యాత్ర

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, బీహార్ వెళ్ళారు. ఈ మధ్యనే బీజీపీతో తెగతెంపులు చేసుకుని, మహా ఘటబంధన్’(ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కూటమి)తో జట్టుకట్టిన  ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి లాలూ రబ్రీ తనయుడు తేజస్వి యాదవ్’తోనూ సమావేశమయ్యారు. అవును,ముఖ్యమంత్రి బీహార్ వెళ్ళింది, గుల్వాన్ ఘర్షణలలో అమరులైన ఇద్దరు బీహారు అమరజవానుల కుటుంబాలకు, అదే విధంగా, ఇటీవల సికింద్రాబాద్’లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ వలస  కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకే, అయినా, అసలు పని మాత్రం అది కాదు. అది స్వామి కార్యం, స్వ కార్యం రాజకీయం.  అదే కోణంలో చూసినప్పుడు, కేసీఆర్ పాట్నా పర్యటన ఆశించిన లక్ష్యం సాధించక పోగా, ఇంటా బయట కొత్త సమస్యలకు శ్రీకారం చుట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  నిజానికి కేసీఆర్ ఇప్పటికే సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏ ముహూర్తాన, ఎందుకోసం ఆయన, జాతీయ రాజకీయాలపై మనసు పారేసుకున్నారో, అందుకోసంగా ఏ క్షణాన కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారో గానీ, ఆక్షణం నుంచి ఆయనకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రాజకీయాలు ఆయనకు ఏమాత్రం అచ్చిరావడం లేదు.  అంతే కాదు, ఆయన జాతీయ రాజకీయ ప్రయత్నాలు, సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చింది అన్న రీతిన, కేసీఆర్ ఏరాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రంలో రాజకీయం తలకిందులు అవుతోంది. ప్రభుత్వాలు సంక్షోభంలో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. మహా రాష్ట్ర విషయాన్నీ తీసుకుంటే, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ గత రెండున్నర సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే వుంది, అయినా ఫలితం లేక పోయింది.కానీ, కేసీఆర్ ఇలా ముంబై  వెళ్ళి అలా శివసేన ఆధినేత ముఖమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత సరద పవార్ తో చర్చలు జరిపి వచ్చారు.ఈ మొత్తం వ్యవహారంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్’ కీలక పాత్ర పోషించారు. కేసీఆర్’తో పోటీపడి మోడీ పై ఒంటి కాలు పై లేచారు. నెలరోజులు తిరక్కుండానే, ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పదవి పోయింది. సంజయ్ రౌత్ జైలు పాలయ్యారు.అలాగే, జార్ఖండ్ ముఖ్యమంత్రి, సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్’ కూడా కేసీఆర్’ను కలిసిన తర్వాతనే రాజకీయ రాజకీయ చిక్కుల్లో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  ఎప్పుడైతే కేసీఆర్ జాతీయ రాజకీయాలలో అడుగు పెట్టాలనే ఆలోచనను బయట పెట్టారో, అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ఆయన చుట్టూ ఉచ్చులు బిగిస్తోంది. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రాన్ని పాటిస్తోంది. కేసీఆర్ కుటుంబ పాలన, కుటుంబ అవినీతి టార్గెట్ గా  అస్త్రాలను సంధిస్తోంది. నిజానికి బీజేపీ, ఒక్క కేసీఆర్  తెరాస విషయంలోనే కాదు, ఎక్కడెక్కడ బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్నాయో, అక్కడక్కడల్లా, ముఖ్యంగా కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులను టార్గెట్ చేస్తోంది. అయితే ఐటీ కాదంటే సీబీఐ అదీ కాదంటే ఈడీ అస్త్రాలను సంధించి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది. మహారాష్ట్రలో శరద్ పవార్ అంతటి ఉద్దండ నేత పౌరోహిత్యంలో నడుస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీ, శివ సేన కూటమి,(మహా వికాస్ అఘాడీ) కూటమి ప్రభుతాన్ని కూల్చేసింది. అలాగే, మోడీ మీద పులిలా రంకెలు వేసిన మమతా బెనర్జీ, ఇప్పుడు మౌనవ్రతం పాటిస్తున్నారు. పార్థా చటర్జీ అవినీతి  ‘భాండాగారం’ బయట పడిన తర్వాత ఆమె సైలెంట్ అయి పోయారు.  అదే విధంగా ఓవంక ఢిల్లీలో మరో వంక ఝార్ఖండ్ లో హై డ్రామా నడుస్తోంది. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ మూడు నెలలుగా జైల్లో ఉన్నారు. మరో వంక, మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పీకలలోతున కురుకుపోయారు. రేపో మాపో ఆయన కూడా జైలుకు పోవడం ఖాయమని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘంటాపథంగా చెపుతున్నారు. ఈ  స్కాంలో సీబీఐ 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏ1 గా మనీష్ సిసోడియా ఉన్నారు.  ఈ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చిక్కులో పడినట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.దేశ వ్యాప్తంగా సంచలనమైన ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తున్న ఢిల్లీ బీజేపీ ఎంపీ.. తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. మరో వంక కొంత కాలంగా కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా గత ఎనిమిది ఏళ్లుగా సాగిన అవినీతి, అక్రమాలు బయటికి తీస్తున్నామని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా, ఇది, ఇది కాకపోతే అది, రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా, కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ,ఆయన కుటుంబ అవినీతి పై ఫోకస్ పెట్టింది. సో, ఈ గండం నుంఛి బయట  పడేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల పేరున రాష్ట్రాలు పట్టి తిరుగుతున్నారు. ఇప్పుడు బీహార్ పర్యటన కూడా అందులో భాగమే, అయినా ఫలితం మాత్రం లేదు. ఇక్కడ ప్రగతి భవన్ లో తెలుగులో చెప్పిన కథనే అక్కడ పాట్నాలో,బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పక్కన కూర్చోపెట్టుకుని చెప్పుకొచ్చారు, కానీ నితీష్ కుమార్ విన్నంతవరకు విని చెప్పింది చాలని లేచి పోవడంతో, కేసీఆర్ ఇజ్జత్ పోయిందని అంటున్నారు. ఇంతకు ముందు ఝార్ఖండ్ వెళ్ళినప్పుడు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలోనే లేచి పోయారు. సో .. కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు అచ్చిరాలేదు అని మరో మారు రుజువైంది. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు ఇంట ఓడి రచ్చ గెలవాలంటే ఇదిగో ఇలాగే ఉంటుంది.

కోహ్లీ ... కింగ్  కోహ్లీయే!

దేశంలో క్రికెట్ పిచ్చికి అంతులేదు. గ‌తంలో స‌చిన్‌, ఇపుడు విరాట్ పిచ్చి. విరాట్ కోహ్లీని ఓట్టినే విరాట్ అన్నా, కోహ్లీ అన్నా స‌హించ‌లేనంత ఆగ్ర‌హం. కింగ్ కోహ్లీ అనాల్సిందే. ఇపుడు తెర‌మీద దేవుడు అత‌నే. కోహ్లీ రావ‌డంతోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో స‌చిన్‌ని మ‌రిపించాడ‌న్న టాక్ బాగా ఉంది. వాస్త‌వ‌మే. మ‌నోడు ఫుల్ ఫామ్‌లో ఉన్న రోజుల్లో ప‌రుగుల వ‌ర‌ద‌నే సృష్టించాడు. సూప‌ర్ బ్యాటర్ అన‌గానే ఫోర్లు, సిక్స్‌లు కొట్టడం కాదు, చూడ‌ముచ్చ‌టైన క‌వ‌ర్ డ్రైవ్‌లు, హుక్ షాట్స్‌తో ఫోర్లు కొట్ట‌డంలోనే అస‌లు స‌త్తా బ‌య‌ట ప‌డుతుంది. అంతేకాదు వికెట్ల మ‌ధ్య పులిలా ప‌రిగెడుతూ ప్ర‌త్య‌ర్ధుల ఫీల్డ‌ర్ల‌కు వీడెవడ్రా బాబూ చీటికీ మాటికీ ర‌న్ తీసుకుంటాడు అని బెంబేలెత్తించే స‌త్తా ఇటీవ‌లి కాలంలో కోహ్లీయే చూపించాడు. అందుకే  కోహ్లీ కింగ్ కోహ్లీ అయ్యాడు.  ఆడుతున్న‌ది గ‌ల్లీ క్రికెట్‌, రంజీ మ్యాచ్‌లూ కాదు అంత‌ర్జాతీయ టోర్నీలు క‌నుక ఒక ప్లేయ‌ర్ జీవితంలో  ఫిట్నెస్ , ఏకాగ్ర‌త కూడా అంతే ప్రాధాన్య‌త సంత‌రించుకుంటాయి. అది కోహ్లీకీ వ‌ర్తిస్తుంది. ప‌దేళ్ల పాటు అనేక టోర్నీల్లో, అనేక ప్రాంతాల్లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన బ్యాట‌ర్ ఎవ‌ర‌యినా స‌రే ఆ త‌ర్వాత కాస్తంత వేగాన్ని త‌క్కువే  ప్ర‌ద‌ర్శిస్తారు. ప్ర‌తీ మ్యాచ్ అప్పుడే టీమ్‌లోకి వ‌చ్చిన పిల్లాడిలా మారి ఆడాలి. అంతే వేగాన్ని, అంతే ప‌రుగుల దాహాన్ని ప్ర‌ద‌ర్శించాలి. సుమారు ప‌న్నెండేళ్లు ఆడిన‌వారికి కాస్తంత దూకుడు త‌గ్గుతుంది. స‌చిన్ కావ‌చ్చ‌, అంత‌కుముందు గ‌వాస్క‌ర్‌, క‌పిల్, ర‌విశాస్త్రి, శ్రీ‌కాంత్ కావ‌చ్చు. ఎవ‌రయినా కెరీర్‌లో ఏదో ఒక ద‌శ‌లో కొంత త‌గ్గాల్సి వ‌స్తుంది. దానికి అనేక కార‌ణాలు ఉండ‌వ‌చ్చు.  2014, 2019 మధ్య ఐదేళ్లపాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన బ్యాట్స్‌మన్, కానీ అప్పటి నుండి కష్టకాలంలో పడిపోయిన బ్యాట్స్‌మన్ గురించి ఊహించిన గందరగోళానికి చాలా తక్కువ సాక్ష్యం ఉంది. అతను దాదాపు 33 నెలలుగా అంతర్జాతీయ సెంచరీ చేయలేదనేది  జరగవచ్చు.  ఏ సందర్భంలోనైనా, మూడు అంకెల నాక్, అయితే, ప్రతిష్టాత్మకంగా  చేప‌డ‌తారు, ఇది ఒక మైలురాయి. ఒక బ్యాట్స్‌మెన్  విలువను కేవలం మూడు అంకెలపైనే కొలవలేం.  కాబట్టి అలాంటి విజయాన్ని సాధించకపోవడం  గొప్ప పతన మేమీ కాదు. కోహ్లీ ఆసియాక‌ప్‌కి అస‌లు జ‌ట్టులోకి ఎంపిక అవుతాడా అని దేశ‌మంత‌టా క్రికెట్ వీరాభిమానులు అనుమానించారు. అయ్యో మావాడు లేకుండా టీమ్ ఏమిటి అని బాధ‌ప‌డిన‌వారూ ఉన్నారు. కానీ ఊహించ‌నివిధంగా మ‌ళ్లీ కింగ్ జ‌ట్టులోకి వచ్చాడు. అదే ఫిట్నెస్‌, అదే వేగంతో ఆడుతున్నాడు. త‌న వందో టీ 20 మ్యాచ్‌లో మ‌ళ్లీ బ్యాట్‌తో బౌల‌ర్ల‌కు గ‌ట్టి స‌మాధాన‌మే చెప్పాడు. తాను మ‌ళ్లీ ప‌రుగులవ‌ర‌ద సృష్టించ‌గ‌ల‌న‌న్న న‌మ్మ‌కం అభిమానుల‌కు, అధికారుల‌కూ తెలియ‌జేశాడు  పాకిస్తాన్‌పై, సున్నాపై సెకండ్ స్లిప్‌లో త‌ప్పించుకున్న‌ తర్వాత, కోహ్లీ 34 బంతుల్లో 35 పరుగులు చేశాడు, ఇది ఒంటరిగా టీ20 క్రికెట్‌లో ఫర్వాలేదనిపించినప్పటికీ, 148 ఛేజింగ్‌లో భారత్ విజయంలో కీలకమైనది. హాంకాంగ్‌పై, 2022 ఆసియా కప్‌లో కోహ్లి అర్ధశతకం సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను ఇప్పుడు టోర్నమెంట్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా కూడా ఉన్నాడు.  హాంగ్‌కాంగ్‌పై ఈ అర్ధ సెంచరీ గత నెలలో అతని భయంకరమైన ఇంగ్లండ్ పర్యటన తర్వాత కోహ్లీకి పెద్ద ఉపశమనం కలిగించింది, అక్కడ అతను తన 6 ఇన్నింగ్స్‌లలో దేనిలోనూ 20 దాటలేకపోయాడు. కోహ్లీ 44 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో, అతను ఒక బౌండరీని సాధించాడు, కానీ అతను 3 అనూహ్యంగా  కొట్టిన సిక్సర్‌లను కొట్టాడు, 134 స్ట్రైక్ రేట్‌తో ముగించాడు. మొత్తంమీద, రెండు ఇన్నిం గ్స్‌ లలో అతను 94 యొక్క భారీ సగటుతో 94 పరుగులు చేశాడు. ఒక్క‌సారి 2018లోకి వెళితే.. 30ఏళ్ల కోహ్లీ ఇంగ్లండ్‌లో విజృంభించాడు. రెండు సెంచ‌రీలు, 3 అర్ధ సెంచ‌ రీల‌తో 593 ప‌రుగులు చేసి వ‌రెవ్వా.. కోహ్లీ అనిపించాడు.  కానీ మ‌రు సంవ‌త్స‌రం 2019లో అదే కోహ్లీ అంత గా రాణించ‌లేక‌పోయాడు. ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్‌లో కేవ‌లం 134 ప‌రుగులే చేశాడు. ఇది యావ‌త్ ప్ర‌పంచ కోహ్లీ అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. కింగ్ ఇలా నీరుగారాడేమిటా అని మ‌ద‌న‌ప‌డ్డారు. అధికారులు ఏమీ మాట్లాడ‌లేక‌పోయారు. ఢిల్లీలో ప్ర‌తీ గ‌ల్లీక్రికెట‌ర్ అన్నా బ్యాట్ కి ఏమ‌యింది అన్నారు.  ఇలాంటి ప‌రిస్థితులు ప్ర‌తీ క్రికెట‌ర్‌కీ వ‌స్తాయి. అయితే కోహ్లీ ఫైట‌ర్. త‌న పొర‌పాట్లూ, త‌ప్పిదాలు తెలుసు కుని త్వ‌ర‌లోనే మ‌ళ్లీ విజృంభిస్తాడ‌ని రవిశాస్త్రి, ద్రావిడ్‌, గంగూలీ వంటివారు క్రికెట్ లోకానికి త‌మ సందే శాలు పంపారు. కోహ్లీ ఆట‌లో వేగం త‌గ్గింద‌ని, ఇక ముందు ఇంత‌గా ఆడ‌లేడ‌న్న అనుమానాలు వ‌ద్దు, అత‌ను మ‌ళ్లీ ఆడ‌తాడు, జ‌ట్టులో అత‌ని స్థానం ప‌దిలం అని భారీ ఆశ‌లు క‌ల్పించారు.  2020లో మ‌ళ్లీ ఫామ్‌లోకి తిరిగి వ‌చ్చాడు కింగ్‌. అస‌లు అంత‌ర్జాతీయ కెరీర్‌ని ప‌రిశీలిస్తే, అత‌ను ఆడినన్ని మ్యాచ్‌లు కేవ‌లం 15 మంది మాత్ర‌మే ఆడ‌గ‌లిగారు. కోహ్లీ యావ‌రేజ్ 53 కాగా వారి యావ‌రేజ్ 50 మాత్ర‌మే! గ‌తం వ‌దిలేద్దాం.. మ‌న కింగ్ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు. ఇక ఆసియాక‌ప్ లో ప్ర‌తీ మ్యాచ్‌లోనూ అత‌ని బ్యాట్ నుంచి ప‌రుగుల వ‌ర‌దే ఉంటుంద‌ని ఆశిద్దాం.

నిత్య పెళ్లికొడుక్కి బుద్ధిచెప్పిన  త‌ల్లీ పిల్ల‌లు! 

విదేశాల్లో చ‌దువుకున్న వ్య‌క్తి  వ‌చ్చి ఒక్క‌డో అమ్మాయిని ప్రేమించి పెళ్లాడ‌తాడు. ఆన‌క ఓ కోటీశ్వ‌రుడి కూతురు ప్రేమ‌లో ప‌డి ఆమెను పెళ్లాడ‌బోతాడు.. మొద‌టి భార్య ఏడాది బిడ్డ‌తో వ‌చ్చి రామూ.. ఎందుకు ఇంత ద్రోహం చేశావ్‌.. అంటూ కొంగు, పిల్లాడి త‌ల‌ని త‌డిపేస్తూ ఏడిచి భారీ డైలాగు చెబుతుంది.. త‌ర్వాత సంగ‌తి వేరే.. ఇది దాదాపు పాత సినిమాల్లో చాలావాటిల్లో సీన్‌. ఇదే సీన్ నిజ జీవితంలోనూ జ‌రిగితే.. అమ్మో!  అవ‌కాశం లేక‌పోలేదు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఒక ప‌ట్ట‌ణంలో ఇదే సీన్ జ‌రిగింది. కాబోతే స‌ద‌రు హీరోగారు అంత‌కు ముందే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, ఏడుగురు పిల్ల‌ల తండ్రి! జ‌రిగేది ఐదో పెళ్లి. అయితే ఈ నిత్య‌పెళ్లి కొడుకు 55 ఏళ్ల‌వాడు. విదేశీయుడూ కాదు, ప‌క్కా లోక‌ల్‌! పెళ్లి పిచ్చి ఉండాలేగాని ఇలాంటి దొంగ‌పెళ్లిళ్లు చేసుకోవ‌డానికి ఏదో ఒక దొంగ మార్గాన్ని ఇలాంటివారు వెతుకుతూనే ఉంటారు. కాబోతే, ఇలాంటివారికి దొరికే అమ్మాయిలే అమాయ‌కులు. అమ్మాయి త‌ల్లిదండ్రుల‌కు ఏమాత్రం అనుమానం రాకుండా అత‌గాడు వ్య‌వ‌హ‌రించే ఉంటాడు. అయినా క‌నీస వివ‌రాలు సేక‌రించ‌కుండా పెళ్లికి సిద్ధ‌ప డ‌టం పెద్ద ముప్పు త‌ప్పిం చిందని ఆన‌క అనుకున్నారు.  నిత్య‌పెళ్లి కొడుకుకి నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి, ఇద్ద‌రు విడాకులిచ్చి వెళిపోయారు. మ‌రో ఇద్ద‌రు ర‌హ స్యం గానే పెళ్లి చేసుకున్నారు. రెండో భార్య‌కి ఏడుగురు పిల్ల‌లు. హీరోగారు ఏం చేస్తుంటాడో ఆమెకు అంత‌గా తెలియ‌ద‌నే అనుకోవాలి. ఇత‌గాడు బ‌హుశా అమ్మాయిల వేట‌నే  వృత్తిగా చేసుకున్నాడేమో. మొత్తానికి అత‌నికి మ‌రో అమ్మాయి వ‌ల‌లో ప‌డింది. పెళ్లికి సిద్ధ‌ప‌డింది.  పెళ్లిపీట‌లు ఎక్కారు. మ‌రో కొద్ధిసేప‌ట్లో  తాళి క‌ట్టాలి. అంత‌లో సినిమాటిక్‌గా మిస్ట‌ర్ నిత్య పెళ్లికొడుకు రెండో భార్య ఏడుగురు పిల్ల‌ల‌తో స‌హా వ‌చ్చింది.  వేదిక మీద తండ్రిని చూసి పిల్ల‌ల్లో ఒక‌రిద్ద‌రు నాన్నా.. అంటూ అరుస్తూ వేదిక మీద‌కి పరిగెట్టారు. ఈమె అయ్యో నా గ‌తేంగాను  అంటూ రుష్యేంద్ర‌మ‌ణి స్థాయిలో కూల‌బ‌డ ఏడ‌వ‌లేదు. అమాంతం అక్క‌డున్న‌వారికి కొత్త పెళ్లికొడుకు నా భ‌ర్తే  అంటూ వాడి అస‌లు సంగ‌తి చెప్పింది. త‌ర్వాత ఏమి జ‌రిగి ఉంటుంద‌న్న‌ది మీకూ అర్ధ‌మ‌యి ఉంటుంది. 

స‌స్రీకాల్  జీ ..   అంటున్న  కెన‌డా సారా!

కాస్తంత న‌లుపు, రాగి క‌ల‌యిక రంగులో జుత్తు, మెరిసే క‌ళ్లు.. దాదాపు ఆర‌డుగుల అమ్మాయి అమాంతం ఊళ్లోకి దిగింది. ఆటోవాళ్లంతా వెంట‌బ‌డ్డారు.. ఫ‌లానా ప్రాంతానికి వెళ్లాల‌న్న‌ది. ప్రాంతం పేరు చెప్పింది గ‌నుక, ఈమెకు భాష రాదు గ‌నుక మ‌న‌వాళ్లు రెచ్చిపోయి వంద‌ల్లో మీట‌రు రేటు చెప్పారు. మొత్తానికి ఎంతో కొంత త‌గ్గి బ‌య‌ల్దేరారు. డ్రైవ‌ర్‌తో పాటు అత‌ని స్నేహితుడు గైడ్ అవ‌తార‌మెత్తాడు. ఆమెను కేవ లం కెనడా నుంచి వ‌చ్చిన అమ్మాయిగానే అనుకున్నారు. బావా, దీన్ని నాలుగు ఏరియాలు తిప్పితే బాగా డ‌బ్బు గుంజుకోవ‌చ్చు గ‌దా అని స‌ద‌రు గైడ్ ఐడియా ఇచ్చాడు. డ్రైవ‌ర్ అలా కాదు ఆమె ఫోన్ నెంబ‌ర్ ప‌ట్టి ఉన్న‌న్ని రోజులూ ఆమెకు సేవ చేసుకుందాం.. అప్పుడు వేల‌ల్లో లాగించేయ‌చ్చ‌ని పెద్ద ఐడియా ఇచ్చా డు.  అలా ఎన్నో ఐడియాల‌తో ఆ అమ్మాయిని నిజంగానే రెండు మూడు ఏరియాలు తిప్పి మొత్తానికి కెన‌డా పిల్ల వెళ్లాల్సిన చోటికి తెచ్చారు. ఆమె రూ.300 ఇచ్చింది.  వీళ్లు ఆమె మొబైల్ నెంబ‌ర్ అడిగారు. ఇక్క‌డున్న‌న్నాళ్లూ స‌దా సేవ‌లో ఉంటామ‌ని. ఆమె అంతే స‌ర‌దాగా హిందీలో ..హ‌మారా అసిస్టెంట్ య‌హా ర‌హ‌తా..ఆప్ జాయియే!.. అన్న‌ది. అంతే  మ‌న హీరోలు నోరెళ్ల‌బెట్టి రివ్వున వెళిపోయారు. మ‌న భాష ఏద‌యినా ఇత‌రుల‌కు పెద్ద‌గా రాద‌న్న‌దే పొర‌పాటు. ఈరోజుల్లో విదేశాల్లో చాలామంది  మ‌న భాష‌ల మీద మ‌న‌కంటే ఆస‌క్తి చూపుతున్నారు. ఒక‌వేళ ఎక్క‌డ‌న్నా హోట‌ల్లోనో, రోడ్ల‌మీదో  విదేశీయులు క‌న‌ప‌డ‌గానే వాళ్ల‌కేమీ తెల్వ‌ద‌ని రెచ్చిపోతే అవ‌మానం ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌స్తుంది. త‌ల  దించుకోవాల్సి వ‌స్తుంది. అంద‌రికీ అన్నీ తెలుస్తాయి. విదేశీయులు త‌మ అవ‌స‌రాల‌కు కొన్ని త‌ప్ప‌కుండా నేర్చుకుం టారు. అందులోనూ ప్ర‌యాణాల‌కు సంబంధించిన ప‌ద‌జాలం త‌ప్ప‌కుండా నేరుస్తారు. ముఖ్యంగా మ‌న దేశానికి, మ‌న న‌గ‌రాల‌కు వ‌చ్చేవారు మ‌రీ జాగ్ర‌త్త‌గానూ ఉంటారు. అస‌లే మ‌న‌వాళ్ల‌కి ఎర్ర‌టి వాళ్లంటే మ‌రీ చుల‌క‌న‌. చిన్న‌ప‌ర్సుల్లో కోట్లు ఉంటాయ‌న్న భ్ర‌మ‌. వాళ్లు ప‌నిగ‌ట్టుకుని నేర్చుకుంటున్నారు. వాళ్ల పిల్ల‌ల‌కీ నేర్పుతున్నారు.  చాలారోజుల క్రితం టొరాంటోకి చెందిన పాప్ ర‌చ‌యిత‌, గాయ‌ని సారా విక్కెట్ ఢిల్లీ వ‌చ్చింది. ఢిల్లీలో ఆమెకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అత‌నూ నిజానికి టొరాంటో వాడే. వాళ్లిద్ద‌రూ నెట్ ద్వారా ద‌గ్గ‌ర‌య్యారు. ఆమెకు అత‌ను ఏకంగా పంజాబీ నేర్పించాడు. ముందు ముందు ఎంతో అవ‌స‌రం ఉంటుంద‌న్న ఆలోచ న‌తో.  సారా  అత‌నితో ఎక్కువ‌గా ఇంగ్లీషులో మ‌ధ్య మ‌ధ్య‌లో పంజాబీలోనూ మాట్లాడుతూంటుంది.  కొత్త భాష నేర్చుకోవాల‌నుకునే విదేశీల‌యుల్లో చాలామంది భార‌తీయ భాష‌ల‌ప‌ట్ల ఎంతో మ‌క్కువ ప్ర‌ద‌ర్శిస్తా ర‌ని ఆమే అన్న‌ది. ఆమె విదేశీ స్నేహితులు, తోటి విద్యార్ధులు, ఉద్యోగులు చాలామంది భార‌తీయ భాష‌ల్లో చాలా భాష‌లు.. త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన భాష నేర్చేసుకున్నార‌ట‌. వీల‌యితే ఎక్కువ ఆ భాష‌లోనే మాట్లాడు తున్నార‌ట‌! అన్న‌ట్టు సారా ఈ మ‌ధ్య‌నే ఓ ప‌ది నిమిషాలు పంజాబీలో మాట్లాడిన వీడియో ఢిల్లీలో ఇత‌ర స్నేహితు ల‌కూ పంపింది. త‌డ‌బ‌డినా.. బాగానే నేర్చుకుంటున్నావ్ సారా.. అంటూ వీరూ ఆమెను అభినం దించారు. మ‌రంచేత‌.. విదేశీయులు మ‌న న‌గ‌రానికి వస్తే వారికేమీ రాద‌ని అనుకోవ‌ద్దు!

బీహార్ సీఎం నితీష్ కు బిగ్ షాక్.. మంత్రిపదవికి కార్తీక్ కుమార్ రిజైన్

ప్రభుత్వం ఏర్పాటు చేసి మంత్రివర్గ కూర్పు పూర్తి చేసి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కు అంతలోనే బిగ్ షాక్ తగిలింది. ఆయన కేబినెట్ నుంచి ఆర్జేడీకి చెందిన కార్తీక్ కుమార్ రిజైన్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ ఆర్జేడీకి చెందిన కార్తిక్ కుమార్ కు న్యాయశాఖ మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆయనపై కిడ్నాప్ కేసు నమోదై ఉండటంతో నితీష్ పై విమర్శలు వెల్లువెత్తాయి. న్యాయశాఖ మంత్రిగా కార్తిక్ కుమార్ తనపై కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ  నేపథ్యంలోనే నితీష్ కుమార్ కార్తిక్ కుమార్ మంత్రిత్వ శాఖ మార్చారు. పెద్దగా ప్రాధాన్యత లేని చెరకు మంత్రిత్వ శాఖ ఇచ్చారు. దీంతో ఆయన అలకపాన్పు ఎక్కారు. శాఖ మార్చిన వెంటనే ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారు. చెరకు మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను నేరుగా గవర్నర్ కే పంపారు. ఆయన దానిని వెంటనే ఆమోదించారు. 2014లో జరిగిన ఒక కిడ్నాప్ కేసులో  నిందితుడిగా ఉన్న కార్తీక్ కుమార్ పై ప్రస్తుతం కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే న్యాయశాఖ మంత్రిగా ఆయనను కొనసాగించడం భావ్యం కాదని తలచిన నితీష్ కుమార్ ఆయన శాఖను మార్చారు. మామూలుగా చూస్తే ఇది సాధారణమే అనిపిస్తుంది కానీ బీహార్ లో సామాజిక సమీకరణాలను పరిగణనలోనికి తీసుకుంటే కార్తీక్ కుమార్ రాజీనామా సీఎం నితీష్ కుమార్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే బీహార్ లో రాజకీయంగా శక్తిమంతమైన భూమిహార్లకు చెందిన కార్తీక్ కుమార్ నితీష్ పై అలకపూనడం ఆర్జేడీ, జేడీయూ బంధంపై అంటే పొత్తుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని బీజేపీ కార్తి కుమార్ పై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించే అవకాశం లేకపోలేదంటున్నారు. ఆయనతో పాటుగా మహాఘట్ బంధన్ కూటమిలో మంత్రి పదవులు దక్కక అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారిపైనా బీజేపీ దృష్టి సారిస్తే నితీష్ కుమార్ కు చిక్కువు తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.

దావూద్  ప‌ట్టుకోండి  రూ.25 ల‌క్ష‌లు అందుకోండి .. ఎన్ ఐఏ

భార‌త్‌లో మ‌ళ్లీ క‌ల్లోలం సృష్టించ‌డానికి, ఉగ్ర‌దాడుల‌కుపాల్ప‌డేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్ర‌సంస్థ‌ల‌తో చేతులు క‌లిపి రెచ్చిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్న అంత‌ర్జాతీయ తీవ్ర‌వాది దావూద్‌ను ప‌ట్టించిన‌వారికి రూ.25 ల‌క్ష‌లు, అత‌ని అనుచ‌రుడు ఛోటా ష‌కీల్‌ను ప‌ట్టించిన‌వారికి రూ.20 ల‌క్ష‌లు ఇస్తామ‌ని  జాతీయ ఇన్ వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ ఐ ఏ) న‌జ‌రానా   ప్ర‌క‌టించింది. దేశంలోకి డి కంపెనీ ఇప్ప‌టికే మార‌ణా యుధాలు, డ్ర‌గ్స్‌, దొంగ‌నోట్లు వారికి సంబంధించిన సంస్థ‌ల ద్వారా తెచ్చార‌ని ఎన్ ఐఏ గ్ర‌హించింది.  వారిద్ద‌రే కాకుండా, దావూద్ సోద‌రుడు అనీస్ ఇబ్ర‌హీం అలియాస్ హాజీ అనీస్‌, స‌న్నిహితుడు జావెద్ ప‌టేల్ అలియాస్ జావెద్ చిక్నా,ష‌కీల్ షేక్ అలియాస్ ఛోటా ష‌కీల్‌, ఇబ్ర‌హీం ముష్తాక్ మెమ‌న్ అలి యాస్ టైగ‌ర్ మెమ‌న్ ల విష‌యంలోనూ ఎన్ ఐఏ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  వీరంతా  పాకిస్థాన్ క‌రాచీలోనే  తిష్ట‌వేసి భార‌త్‌లో దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. 1993 ముంబై పేలుడు సంఘ‌ట‌న సంబంధించి ఇబ్ర‌హీంపై  ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్యూరిటీ కౌన్సిల్  2003లోనే రూ.25 లక్ష‌లు ప్ర‌క టించింది. అనేక దారుణ సంఘ‌ట‌న‌ల్లో కీల‌క‌పాత్ర ఉన్న ల‌ష్క‌రే తోయిబ ఛీప్ హ‌ఫీజ్ స‌యీద్‌, జైషె మొహ‌మ్మ‌ద్ ఛీఫ్ మౌలానా మ‌సూద్ అజ‌ర్‌, హిజ‌బుల్ ముజ‌హిద్దీన్ స్థాపించిన స‌యీద్ స‌లా ఉద్దీన్‌, అత ని స‌న్నిహితుడు అబ్దుల్ ర‌వూప్ అస్ఝ‌గ‌ర్ల‌ను కూడా భార‌త్‌తో పాటు అనేక దేశాలు ప్ర‌పంచ ప్ర‌మాద క‌ర వ్య‌క్తులు, సంస్థ‌లుగా ప్ర‌క‌టించాయి. దీనికి ఐక్య‌రాజ్య‌స‌మితి మ‌ద్ద‌తు కూడా ల‌భించింది.  పాకిస్థాన్ ర‌హ‌స్య‌సంస్థ‌ల‌తో, ఐఎస్ ఐతో క‌లిసి డి కంపెనీ మ‌ళ్లీ దాడుల‌కు పాల్ప‌డేందుకు సిద్ధ‌ప‌డిం ద‌న్న స‌మాచారా న్ని ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే ఎన్ ఐఏ అందుకుని దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక న‌గ‌రాల్లో అధికారుల‌ను, పోలీస్ యంత్రాంగాన్ని హెచ్చ‌రించింది. అంతేగాక‌, ఈ ఏడాది మే నెల‌లో ఎన్ ఐఏ 29 కీల‌క ప్రాంతాల్లో ప్ర‌త్యేక బృందాల‌తో త‌నిఖీలు నిర్వ‌హిం చింది. ఈ సంద‌ర్భంగానే  1993 ముంబై పేలుళ్ల తో సంబంధం ఉన్న హాజీఅలీ ద‌ర్గా, మ‌హీ మ్ ద‌ర్గా ట్ర‌స్టీ సుశీల్ ఖాంద్వానీని, మ‌రికొంత‌మంది కీల‌క వ్య‌క్తుల‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ఎన్ ఐఏ అప్ర‌మ‌త్తం కావ‌డం, డి గ్యాంగ్ లీడ‌ర్ ని, అత‌ని స‌హ‌చ‌రుడు ఛోటా ష‌కీల్ పైనా న‌జ‌ రానా ప్ర‌క‌టించ‌డంతో దేశంలో అనేక ప్రాంతాల్లో, ముఖ్య న‌గ‌రాల్లో ప్ర‌జ‌ల‌తో పాటు పోలీస్ యంత్రాంగం మ‌రింత అప్ర‌మ‌త్త‌మ‌యింద‌ని చెప్ప‌వ‌చ్చు.  

కేసీఆర్‌తో క‌లిసిన వేళావిశేషం.. నీతిష్‌కు బీజేపీ స‌వాల్‌!

కొంద‌రితో క‌లిస్తే దుర‌దృష్టం వెన్నాడుతుందంటారు. అందులో నిజం ఉందా లేదా అన్న‌ది  అవ‌త‌ల పెడితే, ప్ర‌స్తుతం తెలంగాణా సీఎం కేసీఆర్‌తో క‌లిసిన ప్ర‌తీవారికి ఏదో ఒక స‌మ‌స్య త‌లెత్తుతోంది. తాజాగా బీహార్ సీఎం నీతిష్ కుమార్ ప‌రిస్థితి అదే. మొన్న‌నే తాజాగా నీతిష్‌తో కేసీఆర్ క‌లిశారు. అప్పుడే బీజేపీ హెచ్చ‌రిక‌లు జారీచేసింది.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవ‌లే బీహార్ ప‌ర్య‌టించారు. అది కచ్చితంగా తన జాతీయ రాజకీయ ఆకాంక్ష నెరవేర్చుకునే దిశగా మరో అడుగేనని చెప్పడానికి ఇసుమంతైనా సం దేహం అవసరం లేదు. తన  ప్రసంగంలో బీజేపీ ముక్త భారత్ అంశాన్ని ప్రస్తావించారు. అందుకోసం నితీష్ కుమార్తో కలిసి పని చేస్తామన్నారు. కమలం పార్టీ పాలనలో దేశం అన్ని విధాలుగా నష్టపోయిం దన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తు ల ఐక్యత నేడు దేశానికి అత్యవసరమన్నారు. నితీష్ తో కలిసి ఆ దిశగా  పని చేస్తామన్నారు.   రాబో యేది  థర్డ్ ఫ్రంట్  కాదనీ, అది మెయిన్ ఫ్రంట్ అనీ చెప్పారు. ఈ ఫ్రంట్ కు నాయక త్వం ఎవరు వహిస్తారన్న ది ఎన్నికల సమయంలో అందరం చర్చించుకుని నిర్ణయిస్తామని  కేసీఆర్ చెప్పారు.  కేసీ ఆర్ తో  ఎవ‌రు క‌లిసినా భ‌విష్య‌త్తులో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌న్న‌ది  బీహార్ ముఖ్య‌మంత్రి నీతిష్ కూడా గ్ర‌హిం చక‌పోలేదు. క‌నుక‌నే ఆ స‌భ‌లో నీతిష్ కాస్తంత ఇబ్బందిప‌డి మ‌ధ్య‌లోనే లేచి వెళ్లే ప్ర‌య‌త్నాలు చేశారు. అయినా, కేసీఆర్ కోరిక‌మీద కూర్చుండిపోయారు.  కానీ, చిత్రంగా బీజేపీ నుంచి అప్పుడే స‌వాలు ఎదుర‌యింది బీహార్ సీఎంకి. గ‌తంలో నీతిష్ కు డిప్యూటీగా చేసిన బీజేపీ ఎంపి సుశీల్ కుమార్ 2024 ఎన్నిక‌ల్లో మీరు ఎవ‌రి మ‌ద్ద‌తు తీసుకున్నా,  ప్ర‌ధాని స్థానం స‌రే,   మీ రాష్ట్ర సీఎంగానూ ఉండ‌గ‌ల‌రా అని స‌వాలు విసిరారు. బీజేపీ కేవ‌లం ప్ర‌చార ఆర్భాట‌మే కానీ వాస్త‌వానికి దేశానికి ప్ర‌త్యేకించి చేస్తున్న‌దేమ‌ని నీతిష్ చేసిన విమ‌ర్శ‌ల‌కు స‌మాధానంగా సుశీల్ ఈ స‌వాలు విసిరారు.  నీతిష్గారూ మీరు స‌ర‌యిన స్నేహ‌సంబంధాలు నిర్వ‌హించ‌డం లేదు, బీహార్‌కు మోదీ ఎంతో చేశార‌న్న ది మీరు గ్ర‌హించాల‌ని సుశీల్ అన్నారు. కేసీఆర్‌, నీతిష్ కి ఎన్నిక‌లు గెలిచే ధైర్యం ఉంటే, బీజేపీని ధీటు గా ఎదుర్కోగ‌ల‌మ‌న్న స‌త్తా ఉంటే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ నుంచి పోటీ చేయ‌మ‌ని సుశీల్ కుమా ర్ స‌వాలు విసిరారు. మోదీ ప్ర‌భుత్వం కేవ‌లం ప్ర‌చారం మీద‌నే ఆధార‌ప‌డి ఇంత‌కాలం ఉన్న‌ద‌ని అనుకుంటే, మ‌రి 18 రాష్ట్రాల్లో అధికారంలోకి ఎలా వ‌స్తుంద‌న్న‌ది మీరే ఆలోచించుకోండ‌ని సుశీల్ అన్నారు. 

కేసీఆర్ సారూ.. తెలంగాణలో బాధితులు లేరా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో బాధితులే లేరన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో అంతా భేషుగ్గా ఉంది. ప్రజలకు సమస్యలే లేవు.. కానీ పాపం ఇతర రాష్ట్రాలలో జనం నానా ఇబ్బందులూ పడుతున్నారు. మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రాంగా, సమస్యలే లేని రాష్ట్రంగా వారిని ఆదుకోవలసిన బాధ్యత తెలంగాణదే, అంటే తనదే అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన బీహార్ వెళ్లారు. అక్కడ గాల్వాన్ అమరుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే సికిందరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన బీహార్ వలస కూలీల కుటుంబాలనూ పరామర్శించి వారికీ నష్టపరిహారం ఇచ్చారు. అదే సమయంలో ఇక్కడ తెలంగాణలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు కన్నుమూస్తే వారి కుటుంబాలను పరామర్శించడానికి మాత్రం కేసీఆర్ కు మనసు రాలేదో లేక తీరిక దొరకలేదో అర్ధంకాదు కానీ ఆయన మాత్రం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. ఐదు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. గతంలోనూ ఇలాగే జరిగింది. ఆయన పంజాబ్ వెళ్లారు. అక్కడా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అంద జేశారు. ఆ సొమ్ములేవీ కేసీఆర్ జేబులోంచో, కుటుంబ ఆస్తులు అమ్మో ఇచ్చిన సొమ్ములు కాదు. తెలంగాణ ప్రజల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేసిన పన్నుల నుంచి ఇచ్చినవి. ఆ సొమ్ములపై తొలుత అధికారం తెలంగాణలోని బాధిత ప్రజలదే. రాష్ట్రంలో ప్రజలను వారి కష్టాలకు, వారి నష్టాలకూ వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లి సొమ్ములు పంపిణీ చేసి తన ప్రతిష్టను పెంచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారన్న విమక్షాల విమర్శలను జనం కూడా సమర్థిస్తున్నది అందుకే. రాష్ట్రాన్ని గాలికొదిలేసి జాతీయంగా ఓ పెద్ద నాయకుడిగా ఎదగాలన్న కేసీఆర్ ప్రయత్నాన్ని ప్రజలు కూడా హర్షించడం లేదు. ముందు రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని వారు కోరుతున్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని సాక్షాత్తూ రాష్ట్ర పోలీసుల నివేదికలే స్పష్టం చేస్తున్నాయి.  అటువంటిది రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాల్సింది పోయి.. ఇతర రాష్ట్రాలలో ప్రజలను ఉద్ధరించడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట సామెతగా అభివర్ణిస్తూ పరిశీలకులు సైతం తప్పుపడుతున్నారు. గతంలో  కొండగట్టు వద్ద బస్సు బోల్తా పడి పలువురు మరణించిన సందర్భంలో బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి సాయంఅందించలేదు. కేసీఆర్ బాధి కుటుంబాలను పరామర్శించలేదు. ఇప్పుడు కేసీఆర్ బీహార్ పర్యటన సమయంలో ప్రజలు నాటి సంఘటనను గుర్తు చేసుకుని తెలంగాణ ప్రజలు ప్రజలు కారా?  వారి బాధలు బాధలు కావా.. లేక రాష్ట్రంలో బాధితులకు చేసిన సాయం గురించి దేశంలో పెద్దగా మాట్లాడుకోరన్న భావమా అంటూ కేసీఆర్ వైఖరిని తప్పుపడుతున్నారు. జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు కోసం ప్రజాధనాన్ని వాదించుకుంటున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే సందర్భంలో  దేశవ్యాప్తంగా అన్ని పత్రికలలో భాషతో, వాటి సర్క్యలేషన్ తో సంబంధం లేకుండా పేజీలకు పేజీలు ప్రకటనలు ఇవ్వడాన్ని వారీ సందర్భంగా ప్రస్తావించి కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.  

ఆసియాక‌ప్‌.. సూర్య ప్ర‌తాపంతో భార‌త్ ఘ‌న‌విజ‌యం

పాకిస్థాన్‌పై చివ‌రంటా ఉత్కంఠ‌భ‌రితంగా జ‌రిగిన మ్యాచ్‌లో గెలిచిన భార‌త్ త‌న రెండో మ్యాచ్‌లో హాం కాంగ్‌పై సునాయాసంగా విజ‌యం  సాధించింది.  హాంకాంగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. టాస్ గెలిచినా హాంకాంగ్ బౌలింగ్ చేయ‌డానికి నిర్ణ‌యించుకుంది. మొద‌టి ఐదారు ఓవ‌ర్ల‌లో హాంకాంగ్ బౌల‌ర్లు  కొంత భార‌త్ స్టార్ ఓపెన‌ర్లు కెప్టెన్ శ‌ర్మ‌, రాహుల్‌ను క‌ట్ట‌డి చేసిన‌ట్టు క‌నిపించారు. క్ర‌మేపీ భార‌త్ బ్యాట‌ర్లు విజృంభించారు. ఫోర్లు సిక్స్‌ల‌తో బ్యాటింగ్ రుచి చూపించారు. దుర‌దృష్ట‌ వ‌శాత్తూ రోహిత్ శ‌ర్మ ఓ మంచి సిక్స్ కొట్ట‌బోయే ఫీల్డ‌ర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత కింగ్ కోహ్లీ వ‌స్తూనే కాస్తంత ధాటిగా ఆడు తూ సింగిల్స్‌, డ‌బుల్స్ మీద దృష్టిపెట్ట‌డంతో స్కోర్ వేగం పుంజుకుంది. రాహుల్ సిక్స్‌లు, ఫోర్ల‌తో త‌న పాత ఫామ్ మ‌ళ్లీ రుచి చూపించాడు.  అత‌ని త‌ర్వాత వ‌చ్చిన సూర్య‌కుమార్ యాద‌వ్ మాత్రం కోహ్లీకి ధీటుగా వ‌స్తూనే ఫోర్లు, సిక్స్‌లూ బాది హాంకాంగ్ బౌల‌ర్లకు లైన్ మ‌ర్చిపోయేలా చేశాడు. భారీ సిక్స్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకు న్నాడు. ముఖ్యంగా 20వ ఓవర్‌లో నాలుగు సిక్స్‌లతో సూర్య కుమార్ యాదవ్ హాంకాంగ్ బౌలర్ అర్షద్‌పై విరుచుకు పడ్డాడు. ఆ జోరులోనే భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి 20 ఓవ‌ర్ల‌లో 192 ప‌రుగులు చేసింది. సూర్య  26 బంతుల్లో ఆరు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో బ్యాట్‌ను గట్టిగా ఝుళిపించి 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలి చాడు. కింగ్‌ కోహ్లీ కూడా 44 బంతుల్లో 59 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలి చాడు.  193 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమి పాలైంది. బాబర్ హయత్ 41 పరుగులు, కించింత్ షా 30 పరు గులు, మెకెనీ 16 పరుగులు, జీషన్‌ అలీ 26 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, అవీష్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది. హాంకాంగ్ జట్టు కెప్టెన్ నిజాకత్‌ ఖాన్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్‌ సూపర్‌-4కు చేరింది. దాదాపుగా భారత్‌, పాక్‌ జాతీయులతో నిండి ఉన్న హాంకాంగ్‌ జట్టు రోహిత్‌ సేనకు ఏవిధంగానూ పోటీ ఇవ్వలేకపోయింది. టీమిండియా బ్యాట్స్‌మెన్స్ సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ 98 పరుగుల భాగస్వామ్యం టీమిండియా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఒకే ఒక్కడు కేజ్రీవాల్! బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు ఆప్ వికర్ష్ ఆపరేషన్

దేశంలో మోడీ,షా ద్వయం ఎత్తులను చిత్తు చేస్తూ, కేంద్రంలోని మోడీ సర్కార్ ను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ఒకే ఒక్క బీజేపీయేతర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేల్చేందుకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేజ్రీవాల్ తానే స్వయంగా ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అంటూ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై కేసు నమోదు చేసిన తరువాత కూడా ఆప్ ధీమాగా ఉంది. అక్రమ కేసు అంటు నిలబడింది. సోదాలు, తనిఖీలను పట్టించుకోలేదు. దీంతో ఢిల్లీలో ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ తెరతీసింది. ఆప్ ఎమ్మెల్యేలు 40 మందికి ఒక్కొక్కరికీ పాతిక కోట్ల రూపాయలు ఇవ్వజూపిందని కేజ్రీవాల్ అసెంబ్లీ సాక్షిగా ఆరోపించి.. కమలనాథుల ప్రలోభాలకు తమ ఎమ్మెల్యేలు ఎవరూ లొంగలేదని సగర్వంగా ప్రకటించి.. ప్రభుత్వం పట్ల ఆప్ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని మరోసారి నిర్ద్వంద్వంగా నిరూపించడానికే నంటూ తన ప్రభుత్వంపై తానే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టుకుని మోడీకి సవాల్ విసిరారు. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా కేజ్రీవాల్ తన ప్రసంగంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. ఫెడరల్ స్ఫూర్తిని కాలరాసి.. ప్రజాస్వామ్య బద్ధంగా రాష్ట్రాలలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వాలను పడగొట్టేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను ఎండగట్టారు. వాస్తవానికి అసెంబ్లీలో బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైందనీ, కానీ కేజ్రీవాలే స్వియంగా విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టి బీజేపీకి కేజ్రీవాల్ షాక్ ఇచ్చారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఏ సీఎం కూడా స్వయంగా తన ప్రభుత్వంపై తానే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టరు. కానీ కేజ్రీవాల్ రూటే సెపరేటు. తన ప్రభుత్వంపై, తన ఎమ్మెల్యేలపై అచంచల విశ్వాసం, తనకున్న ప్రజాదరణపై నమ్మకం ఉన్నందునే కేజ్రీవాల్ సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. సాధారణంగా విశ్వాస తీర్మానంపై సభ్యులందరూ మాట్లాడిన తరువాత ముఖ్యమంత్రి సమాధానం చెబుతారు. ఈ విషయంలో కూడా కేజ్రీవాల్ బీజేపీకి, కేంద్రానికి ఝలక్ ఇచ్చారు.  ముందుగా తానే ప్రసంగించడం ద్వారా బీజేపీకి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి కల్పించారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాలలోని బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రంలోని మోడీ సర్కార్ కూలదోసిన తీరును కళ్లకు కట్టినట్లు వివంరించారు.  ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగం తరువాత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ముంబైలో స్పందించిన తీరే కేజ్రీవాల్ ప్రసంగం ఎంత సూటిగా, సుత్తిలేకుండా ఉందో అవగతమౌతుంది. కేజ్రీవాల్ మాదిరిగా తాను కమల నాథుల కుట్రలను ముందుగా పసిగట్ట లేకపోయానని అంగీకరించారు.  దేశమంతటా కాషాయి జెండా ఎగరాలన్న ఆకాంక్షతో కమలనాథులు సాగిస్తున్న ఆపరేషన్‌ ఆకర్ష్‌ పూర్వపు కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిం చిన పార్టీ ఫిరాయింపుల విధానం కన్నా దుర్మార్గమైనదని  కేజ్రీవాల్ విమర్శించారు.    

ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం.. లోకేష్ ఫైర్

రెండు రెళ్లు నాలుగు అన్నందుకు గూండాలు గుండ్రాలు విసిరే సంస్కృతి ప్రస్తుతం ఏపీలో ఉంది. ఒక ఫ్యాక్షనిస్టు, పిరికి వాడు ప్రభుత్వాధినేతగా ఉంటే ఆ రాష్ట్రం ఎంత అధ్వానంగా ఉంటుందో చెప్పడానికి ఏపీ నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. విమర్శ అంటే భయం, ప్రజలంటే భయం..దాన్ని కప్పి పుచ్చుకోవడానికి పోలీసుల అండతో అక్రమ కేసులు, అరెస్టులు, వైసీపీ గూండాలతో దాడులు.. ఇదీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కుప్పంలో అన్న క్యాంటిన్ ను రెండో సారి కూల్చేసిన తరువాత ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు పర్యటనలో ఆయన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ లో అంబేడ్కర్ రాజ్యాంగం కాదు ఫ్యాక్షనిస్టు రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజాస్వామ్యంపై ఇసుమంతైనా గౌవరం లేని ఒక ఫ్యాక్షనిస్టు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారని దుయ్యబట్టారు. ఒక ఫ్యాక్షనిస్టు సీఎం అయితే రాష్ట్రం ఎంత అధోగతి పాలౌతుందో అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని లోకేష్ అన్నారు. అయిన దానికీ కాని దానికీ అక్రమ కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 60 మందికి పైగా తెలుగుదేశం కీలక నేతలపై కేసులు పెట్టారనీ, ఐదు వేల మందికి పైగా తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించారనీ లోకేష్ అన్నారు.  ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి తెలుగుదేశం డీఎన్ఎలో భయం అన్న పదానికి తావేలేదని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఐపీసీ(ఇండియన్ పీలన్ కోడ్)ని ఫాలో కావడం లేదనీ, జేపీసీ(జగన్ పీనల్ కోడ్)ని ఫాలో అవుతున్నారనీ లోకేష్ అన్నారు. రాష్ట్రంలో కొందరు పోలీసులకు తెలుగుదేశం నేతల ముందు మీసం మెలేసి, తొడ కొట్టడం, తెలుగుదేశం నాయకులపై దాడులు చేయడం ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారెవరైనా సరే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సొంత చెల్లి, తల్లికివ అన్నంపెట్టకుండా బయటకు గెంటేసిన దుర్మార్గుడు జగన్ పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిన్ లను కూడా కూల్చేస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హయాంలో నడుస్తున్న అన్న క్యాంటిన్లను రద్దు చేశారు, ఇప్పుడు తెలుగుదేశం నిర్వహిస్తున్న క్యాంటిన్లను కూల్చివేస్తున్నారు అని విమర్శించారు. మంగళగిరి లో తాను అన్న క్యాంటీన్ పెడితే ధ్వంసం చేసారు. కుప్పం లో అన్న క్యాంటీన్ పై దాడి చేసారని లోకేష్ విమర్శించారు. ప్రశాంతంగా ఉండే కుప్పం పులివెందుల పరిస్థితులు తీసుకువచ్చారన్నారు. జడ్ ప్లస్ క్యాటగిరి భద్రత ఉన్న చంద్రబాబు కుప్పం పర్యటనకు వస్తే కనీస భద్రతా ఏర్పాట్లు చేయలేదన్నారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలకు బాధ్యులు వైసీపీ గూండాలైతే.. అమ్ముడుపోయిన పోలీసులు  టీడీపీ నాయకులపై కేసులు పెట్టారని, అరెస్టులు చేశారని విమర్శించారు.  వైసిపి గూండాల దాడి ని అడ్డుకుంటే హత్యాయత్నం కేసులా? అన్నారు.  పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని వాడు…ఇక్కడికి వచ్చి కుప్పంను అభివృద్ది చేస్తాడా? అని లోకేష్ ఎద్దేవా చేశారు.   గడప గడప కి వెళ్లలేని వైసిపి నాయకులు కుప్పంలో గొప్పలు చెప్పడం హస్యాస్పదంగా ఉందని లోకేష్ అన్నారు.

అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత

తన డ్రైవర్ ను మర్డర్ చేసి మృతదేహాన్ని సొంత కారులో డోర్ డెలివరీ చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్న అనంతబాబు గడువులోపల తనపై చార్జిషీటు దాఖలు చేయనందున బెయిలు ఇవ్వాలంటూ దాఖలు చేసుకున్న పిటిషన్ ను రాజమహేంద్రవరం ఎస్సీఎస్టీ న్యాయస్థానం కొట్టివేసింది. ఆయన బెయిలు పిటిషన్ ను  కోర్టు తిరస్కరించడం ఇది రెండో సారి. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనంతబాబుకు కోర్టు మూడు రోజులు కండీషన్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన బెయిలు పొడిగించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఈ నెల 5 వరకూ బెయిలు పొడిగించింది. అయితే కింది కోర్టు బెయిలు షరతులపై ఇచ్చిన ఉత్తర్వులు యథాతథంగా అమలులో ఉంటాయని స్పష్టం  చేసింది.  మరో నాలుగు రోజులలో హైకోర్టు పొడిగించిన బెయిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో అనంతబాబు మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టులో చుక్కెదురైంది.

సీఎం కేసీఆర్ పరమ దుర్మార్గుడు.. బండి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరమ దుర్మార్గుడిగా అభివర్ణించారు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణిస్తే వారిని కనీసం పరామర్శించకుండా రాజకీయ పర్యటన కోసం బీహార్ వెళతారా అని విమర్శించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మహిళలకు మరణించడానికి కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం, మూర్ఖత్వమే కారణమని నిందించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ బుధవారం పరామర్శించారు. ఆ సందర్బంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ బాధితులను పరామర్శించకుండా బీహార్ వెళ్ళటం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలోని పేదలను వదిలేసి పంజాబ్, బీహార్‌లో డబ్బులు పంచటం దారుణమన్నారు. ఆపరేషన్లు వికటించి మరణించిన   మహిళల పిల్లల చదువు, భవిష్యత్తు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని   డిమాండ్ చేశారు.   రికార్డు కోసం గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. సీఎం సర్కార్‌కు పేదల ప్రాణాల కంటే పేరు ప్రఖ్యాతలే ముఖ్యమా అని నిలదీశారు.  రాష్ట్ర సీఎంకు పేదల ఉసురు కచ్చితంగా తగులుతుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుంటామంటే అంగీకరించేది లేదన్నారు.  బెదిరించి ఆపరేషన్లు చేశారని చికిత్స పొందుతోన్న మహిళలే స్వయంగా చెప్తున్నారని బండి సంజయ్ అన్నారు.