మేడిగడ్డ కుంగడం వెనక కేసీఆర్ దే బాధ్యతంటున్న మావోయిస్టులు 

మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. తాజాగా మావోయిస్టులు కేసీఆర్ టార్గెట్ గా బహిరంగ లేఖ  విడుదల  చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనమైంది. మావోయిస్టు జేఎమ్‌‌డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. ప్రాజెక్టు కుంగిపోవడానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని అందులో పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ అంతర్రాష్ట్ర వంతెన పిల్లర్ 30 మీటర్లు కుంగిపోవడానికి కారణం నాణ్యత లోపమేనని పేర్కొన్నారు. వేలాది కోట్లు ఖర్చు చేసి బ్యారేజీని నిర్మించి కేవలం మూడేళ్లే అయిందన్నారు. 2016 మే 2న నిర్మాణం చేపట్టగా, 2019 జూన్ 21న ప్రారంభించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ బ్యారేజీ ఇలా కుంగిపోవడానికి కేసీఆర్ కుటుంబమే కారణమన్నారు. పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుని నాసిరకంగా నిర్మించారని, నిర్మాణం సమయంలోనే పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. కానీ ఈ విషయాన్ని అప్పుడు బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదన్నారు. ఈ ప్రాజెక్టు వద్దకు ప్రజలను, ప్రజాసంఘాలను, బూర్జువా పార్టీలను కూడా రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. పోలీసులతో ముందస్తు అరెస్టులు చేసి ధర్నాలు, ర్యాలీలు చేయకుండా అడ్డుకున్నారన్నారు. విషయం బయటకు రాకుండా అణచివేశారని, మీడియాను బెదిరించి కంట్రోల్ చేశారన్నారు. ప్రజాధనం వృథా కావడానికి కేసీఆర్‌దే పూర్తి బాధ్యత అని ఆ లేఖలో పేర్కొన్నారు.

బిజెపి రెండో జాబితాలో ఒకే అభ్యర్థి

తెలంగాణ ఎన్నికల వేళ కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కీలక నేతలు పార్టీ మార్పు వ్యవహారం ఇప్పుడు కీలకంగా మారుతోంది. పలువురు నేతలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ రెండో జాబితా విడుదలైంది. బీజేపీ - జనసేన పొత్తు తెలంగాణలో దాదాపు ఖాయమైంది. ఊహించని విధంగా కేవలం ఒకే అభ్యర్దితో రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇటీవల 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేడు రెండో జాబితా విడుదల చేసింది. అత్యంత ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరుంది. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏపీ మిథున్ కుమార్ రెడ్డి పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. మిథున్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడు. జితేందర్ రెడ్డి 1999లో బీజేపీ ఎంపీగా గెలిచారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు. 2019లో ఆయన బీజేపీలోకి తిరిగొచ్చారు. ఈసారి తన రాజకీయ వారసుడిగా కుమారుడికి బీజేపీ టికెట్ ఇప్పించుకోవడంలో జితేందర్ రెడ్డి కృషి ఫలించింది.

ఏపీ మద్యం తాగితే అంతే సంగతులు!

 ఆంధ్రప్రదేశ్ లో మద్యం విధానం ఓ పెద్ద కుంభకోణం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఇది మాత్రం మా చేత.. మా కొరకు..మేమే తెచ్చుకున్న మద్యం విధానాన్ని జగన్ సర్కార్ అవలంబిస్తోంది. ఏపీలో మద్యం విధానంపై మొదటి నుంచీ విమర్శలు, ఆరోపణలూ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. జగన్ సర్కార్ మందు బాబుల ప్రాణాలను హరించేలా నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తోందని, మొత్తం మద్యం విధానమంతా వైసీపీ అగ్రనేతల కనుసన్నలలో సాగుతోందన్న విమర్శలూ ఉన్నాయి. అయితే తాజాగా భువనేశ్వరి ఏపీ ప్రభుత్వ మద్యం వ్యాపారం బండారాన్ని బట్టబయలు చేశారు. దీని వెనుక ఉన్న పెద్దల పేర్లనూ మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలని కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు చేసిన ఫిర్యాదుపై కేంద్రం స్పందన ఏమిటో ఇంకా తెలియలేదు కానీ.. ఏపీలో మాత్రం మరెక్కడా వినని, కనని బ్రాండ్ల పేరుతో విషంలాంటి మద్యాన్ని యథేచ్ఛగా ప్రభుత్వమే విక్రయించేస్తోంది.  ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, యూత్ స్టార్, యంగ్ స్టార్, టాప్ స్టార్, సూపర్ స్టార్, 999 పవర్ స్టార్, ఛాంపియన్, సెలబ్రిటీ, రాయల్ సింహ, బ్లాక్ బస్టర్, భూమ్ భూమ్, బ్యాచిలర్ ఛాయిస్, కౌంట్ డౌన్, గెలాక్సీ, రాయల్ గోల్డ్, ఆంధ్ర గోల్డ్, ఆల్ సీజన్ బ్రాందీ, కల్ట్ విస్కీ.. ఈ పాటికే అర్ధం అయ్యే ఉంటుంది ఈ చిత్ర విచిత్రమైన పేర్లన్నీ ఏంటో. మన దేశంలో ఓ యాభై ఏళ్లుగా రోజూ మందుకొట్టే మహారాజులకు కూడా ఈ బ్రాండ్స్ గురించి తెలియదేమో. అసలు ఇలాంటి బ్రాండ్లు ఉన్నాయనీ కానీ వస్తాయని కానీ ఎవరూ ఊహించి ఉండరేమో. కానీ, ఏపీలో ఇదే మందు.. ఇవే బ్రాండ్లు. ఇప్పటికే ఈ పేర్లలో సోషల్ మీడియాలో కావాల్సినన్ని మీమ్స్, వీడియోలు కూడా ఉండగా.. కనీస పరీక్షలు కూడా చేయని మద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి అమ్మేస్తూ ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విపక్షాలు ఎన్ని ఆరోపించినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ కంపెనీలకు గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని దబాయిస్తారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించింది. అప్పటి నుండి నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతూ వస్తుండగా.. ఇందులో వైసీపీ కార్యకర్తలే జీతాలకు పనిచేస్తున్నారు. ప్రభుత్వమే నడపనీ, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వనీ ప్రజలకు కావాల్సింది క్వాలిటీ. కానీ, ఏపీలో ఆ ఒక్కటే అడగకూడదు అన్నట్లు ఉంది పరిస్థితి. గతంలో ఎన్నడూ చూడని.. ఎప్పుడూ వినని బ్రాండ్లు, సీసాలు ఏపీలో కనిపిస్తున్నాయి. దీనికి ప్రతిపక్షాలు జే బ్రాండ్ మద్యం అంటూ పేరు కూడా పెట్టారు.    ఈ జే బ్రాండ్ మద్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏపీలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిలో సగం మంది రుగ్మతలకు మద్యమే కారణమని తేలింది. కనీస పరీక్షలు కూడా చేయకుండా మద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి ప్రభుత్వ దుకాణాలకు అందిస్తున్నారు. తెలిసిన కంపెనీ మద్యం ఒక్కటీ లేకపోవడంతో ప్రజలు ఉన్న దాన్నే తాగేసి రోగాలను కొని తెచ్చుకుంటున్నారు.  నిజానికి 2014 ఎన్నికల సమయంలోనే వైసీపీ అభ్యర్థులు సొంత చీఫ్ లిక్కర్ బ్రాండ్ పేరుతో రాష్ట్రమంతా దొంగతనంగా పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. కానీ, ఆ తర్వాత టీడీపీ హయాంలో దీనికి అడ్డుకట్ట పడింది. అయితే, ఇప్పడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు వైసీపీ అభ్యర్థుల సొంత చీప్ లిక్కర్ అధికారిక మద్యంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ నేతలు తాజాగా ఈ మద్యాన్ని ల్యాబుల్లో పరిశీలించగా నకిలీ మద్యంగా నిర్ధారణ అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఈ నకిలీ మద్యం, మద్యం పాలసీలపై పోరాడుతున్నారు. రాష్ట్రంలో మద్యం ద్వారా 25 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపణలు చేస్తూ సీబీఐ విచారణ కోరారు. ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.  ఇక ఇటీవల పురందేశ్వరి నరసాపురంలో ఓ మద్యం దుకాణానికి వెళ్లి క్రయవిక్రయాలపై ఆరా తీసి అవినీతిని బయటపెట్టారు. నేరుగా ఆసుపత్రికి కూడా వెళ్లి రోగులను పరామర్శించారు. మద్యం తాగడం వల్లే ఆసుపత్రి పాలైనట్లు మెడికల్ రిపోర్టులు ఉన్నాయని ఆమె పరిశీలనలో వెల్లడైంది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఆరా తీస్తే మద్యం వలనే అనారోగ్యం పాలైన కేసులు వేలల్లో ఉన్నట్లు తేలింది. దీంతో ఏపీ మద్యం తాగితే ప్రాణాలు హరీ అనడం ఖాయమని నిర్ధారణయింది. ఒకవైపు లిక్కర్ షాపులతో వైసీపీ కార్యకర్తల దందా పెరిగిపోతోంది. లిక్కర్ అమ్మకాలపై వచ్చిన డబ్బు, ఆదాయానికి.. పలుచోట్ల లెక్కలు గోల్ మాల్ చేసినట్లు ఆరోపణలు ఉండగా.. అక్రమ మార్గాలలో బెల్ట్ షాపులకు లిక్కర్ సరఫరా చేసి మరికొందరు జేబులు నింపుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పుట్టగొడులుగా వెలిశాయి. ఈ నకిలీ మద్యాన్నే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలకు విక్రయిస్తూ వారి ఆరోగ్యాలను పీల్చి పిప్పి చేస్తోంది.  

చంద్రబాబు మధ్యంతర బెయిలు పిటిషన్.. నాట్ బిఫోర్ మీ అన్న వెకేషన్ కోర్టు న్యాయమూర్తి

చంద్రబాబు అరెస్టు వెనుక భారీ కుట్ర ఉందన్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆయనను జైలులోనే ఉంచి ప్రజలకు దూరం చేయాలన్న వ్యూహంతోనే చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిందన్న విమర్శలలో, ఆరోపణల్లో వాస్తవం ఉందన్న నమ్మకం రోజురోజుకూ బలపడుతోంది. ఆయనకు జైల్లో భద్రత కరవైందనీ, ఆయన ఆరోగ్యంపై కూడా జైలు అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదనీ మొదటి నుంచీ చంద్రబాబు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం శ్రేణులూ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. అయినా వాటిపై ఇటు జగన్ సర్కార్ కానీ అటు జైలు అధికారులు కానీ స్పందించడం లేదు. కోర్టులలో ఆయన పిటిషన్లు సాంకేతిక కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఆయన పిటిషన్లు వాదించేందుకు న్యాయమూర్తులు కూడా వెనుకాడుతున్న సంఘటనలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏ స్థాయిలో కుట్ర జరుగుతోందో తెటతెల్లం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా చంద్రబాబు మధ్యంతర బెయిలు పిటిషన్ విచారణ శుక్రవారం హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు రావాల్సి ఉండగా చివరి క్షణంలో విచారణ జరపకుండానే న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అంటూ వైదొలగారు. ఈ పిటిషన్ విచారణ ఏ బెంచ్ చేపట్టాలో హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారు. ఇక తన ఉత్తర్వుల కారణంగా చంద్రబాబు ఆరో్య కాకరణాల రిత్యా తీసుకునే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అవరోధం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టై గత 49 రోజులుగా  రాజమహేంద్రవరం జైలులో ఉన్నచంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఆయన హెల్త్ బులిటిన్ ను వైద్యులు కాకుండా జైలు అధికారులు విడుదల చేయడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు ఆరోగ్యంపై నివేదికను వైద్యులు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి కూడా అందించారు. జైలు అధికారులు భువనేశ్వరికీ, జైలు అధికారులకూ ఒకే నివేదిక ఇచ్చినా జైలు అధికారులు విడుదల చేసిన చంద్రబాబు హెల్త్ బులిటిన్ లో ఆయన ఆరోగ్యానికి సంబంధించి కీలక, ముఖ్యమైన  అంశాలు లేవు. దీంతో కుట్ర పూరితంగా చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా సరైన చికిత్స కూడా అందకుండా జైలు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఈ నెల 25న చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి రాసిన లేఖలో తన భద్రతకు, ఆరోగ్యానికి జైలులో రక్షణ లేదని విస్ఫష్టంగా పేర్కొన్నారు.  ఓ ఖైదీకి పెన్ కెమెరా ఇచ్చి ఉద్దేశపూర్వకంగా తన బ్యారక్ దృశ్యాలను చిత్రీకరింపచేస్తున్నారని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.  జైలు లోపలి దృశ్యాలు అధికార పార్టీ సోషల్ మీడియా ఖాతాల్లో కనిపిస్తున్నాయనీ,  తనను హత్య చేస్తామని బెదిరిస్తూ జైలు అధికారులకు వచ్చిన లేఖపై పోలీసులు విచారణ జరపలేదనీ పేర్కొన్నారు.  జైలుపై పలుమార్లు డ్రోన్లు ఎగిరినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తనపై భౌతిక దాడులు చేస్తోందని గతంలో జరిగిన పలు ఘటలను ఉదహరించారు. ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు ఈ లేఖ రాసి రెండు రోజులు అవుతోంది. తాను జడ్ ప్లస్ ప్రొటెక్టీనని… కానీ తన భద్రత విషయంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని చంద్రబాబు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఆ లేఖపై ఇంత వరకూ ఎటువంటి చర్యలూ లేవు.  

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గుర్తు బైనాక్యులర్ 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం హాట్ హాట్‌గా మారింది. ప్రధాన పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే.. దూసుకుపోతోంది. అయితే.. రాష్ట్రంలో పోటీ కేవలం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉండగా.. ఈసారి కొత్త పార్టీలు కూడా బరిలో దిగుతున్నాయి. అందులో.. వైఎస్ షర్మిల నేతృత్వంలోనే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రత్యేకం.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉమ్మడి గుర్తును కేటాయించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీతో విలీనంపై ఢిల్లీకి వెళ్లి షర్మిల చర్చలు జరిపారు. అయితే ఆ తర్వాత విలీనం అంశం ముందుకు కదల్లేదు. దీంతో తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని షర్మిల స్పష్టం చేశారు.

ప్రజలకే కాదు.. కార్యకర్తలకూ పట్టని వైసీపీ బస్సుయాత్ర!?

మంత్రులు,  ఎమ్మెల్యేలు సామాజిక సాధికార యాత్ర పేరుతో ప్రత్యేక బస్సులు వేసుకొని యాత్రకు బయలుదేరారు. మంత్రులకు చేసే పనేం లేదన్న విషయం తెలిసిందే. ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అన్ని నిర్ణయాలూ సీఎం జగన్ తీసుకుంటారు. జగన్ తీసుకుంటారనే కంటే ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శా సజ్జల రామకృష్ణారెడ్డే చూసుకుంటారంటే సరిగ్గా సరిపోతుంది. ఆయా శాఖలకు సంబంధించి కార్యక్రమాలపై మీడియా సమావేశాలను కూడా సజ్జలే అడ్రస్ చేస్తారు. దీంతో పని లేని మంత్రులకు ఏదో పని చెప్పాలికదా అన్నట్లుగా సీఎం జగన్ ప్రభుత్వ ఘనతలను ప్రజలకు చాటండంటూ బస్సు యాత్ర పేరిట వారిని జనంలోకి పంపించేశారు. ఇక ఎమ్మెల్యేల సంగతి చప్పనవసరం లేదు. వారికీ వారి వారి నియోజకవర్గాలలో ఎటూ పనిలేదు. అన్నీ వాలంటీర్లే చూసుకుంటారు. సో వారినీ జనం మీదకు తోలేశారు సీఎం జగన్. బస్సు యాత్ర పేరిట జనంలోకి వెళ్లి వారు చేయాల్సిందేమిటయ్యా అంటే మా ప్రభుత్వం ఇది చేసింది.. అది చేసింది. మా ప్రభుత్వ హయాంలో ఇంత అభివృద్ధి జరిగింది. అంత అభివృద్ధి జరిగింది అని చెప్పుకోవడం కాదు. ఎందుకంటే అదేం జరగలేదన్న విషయం ప్రజలకే కాదు.. బస్సు యాత్ర పేరిట జనంలోకి వస్తున్న మంత్రులూ, ఎమ్మెల్యేలకు కూడా  స్పష్టంగా తెలుసు. అందుకే వారు ఈ బస్సు యాత్ర పేరిట ఒకే మంత్రం జపిస్తున్నారు. ఆ మంత్రుం ఏమిటంటే..విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడటం. ఆ విమర్శలను జనం పట్టించుకుంటున్నారా? లేదా అన్నది వారికి అనవసరం. మీడియాలో వచ్చి అది సీఎం జగన్ కంట పడితే చాలు. వారి లక్ష్యం నెరవేరిందని సంబరపడిపోతారు. జనం ఛీత్కారాలు, తిరుగుబాట్లు వారికేం కొత్త కాదు. గతంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలోనే వారికి జనం ఛీత్కారాలు అనుభవేకవైద్యం అయ్యాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలోనూ ఎక్కడా ఈ ఐదేళ్లలో ఇది చేశాం అని చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. వైసీపీ నేతలు, మంత్రులూ ఏదైనా కార్యక్రమం పెట్టుకుని జనంలోకి వచ్చినా.. వారికి ఎదురౌతున్నది ప్రజా తిరస్కారం మాత్రమే.  సమస్యలపై నిలదీతలు, హామీలను విస్మరించారంటూ జనం ఆగ్రహం ఇవే వారికి ఎదురౌతున్నది. అయితే ఈ సారి బస్సు యాత్రలో వారికి గొప్ప ఉపశమనం కలిగింది. అదేమిటంటే వారి యాత్రను జనం అస్సలు పట్టించుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా పట్టుమని వంద మంది కూడా రాని పరిస్థితి. ముఖ్యమంత్రి సభలకు అయితే నయానో భయానో, బెదరించో, బామాలో జన సమీకరణ చేసేవి పార్టీ శ్రేణులు. విషయం తెలిసి కూడా చేతి చమురు వదుల్చుకుని బస్సు యాత్రలకు కూడా జనసమీకరణ కోసం కష్టపడటం ఎందుకనుకున్నారో ఏమో కార్యకర్తలు కూడా కాడి వదిలేవారు. దీంతో వైసీపీ బస్సు యాత్రలు ఎవరికీ పట్టని కార్యక్రమంగా మారిపోయాయి. తొలి రోజు మూడు ప్రాంతాల నంచీ ఏకకాలంలో ప్రారంభమైన బస్సు యాత్రలలో ఇదే పరిస్థితి సాక్షాత్కరించింది. ఖాళీ కుర్చీలను ఉద్దేవించి చేసిన ప్రసంగాలలో కూడా నేతలు చంద్రబాబునాయుడిని, జనసేనానిని విమర్శించడానికే పరిమితమైపోయారు తప్ప.. మరో మాట వారి నోటి వెంట రాలేదు.  ఇంతకీ ఈ యాత్రలో వైసీపీ వారికి కలిగిన ఉపశమనం ఏమిటంటారా.. జనం పట్టించుకోకపోవడంతో గడపగడపకూలోలా వారికి నిరసన సెగలు తగలలేదు. మొత్తంగా వైసీపీ ఆర్భాటంగా ప్రారంభించిన ఈ యాత్రను ప్రజలే కాదు, వైసీపీ శ్రేణులు కూడా పట్టించుకోలేదన్నదే పరిశీలకులు విశ్లేషణ. 

  తెలంగాణ ఎన్నికల్లో భారీగా పట్టుబడుతున్న నగదు, బంగారం 

తెలంగాణ ఎన్నికల సందర్భంగా పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు చేపడుతున్నారు. చెక్ పోస్టుల్లో చేపడుతున్న తనిఖీల్లో భారీగా డబ్బు, బంగారం పట్టుబడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 9 నుంచి నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.347.16 కోట్ల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 9న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో కోడ్‌ అమలులోకి వచ్చింది. ఆ రోజు నుంచి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. నాటి నుంచి గురువారం వరకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మొత్తంలో నగదు, డబ్బును సీజ్ చేశారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు రూ.122.62 కోట్ల నగదును సీజ్ చేశారు. రూ.156.22 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రూ.20.70 కోట్ల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. తనిఖీల్లో రూ.17.18 కోట్ల విలువైన డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి. ఓటర్ల కోసం పంపిణీకి సిద్ధం చేసిన రూ.30.42 కోట్ల విలువైన కానుకలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన సొత్తులో కేవలం రూ. 1.76 కోట్లు మాత్రమే లెక్కల్లో చూపని నగదు అని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు.

సూర్యపేట సభకు  అమిత్ షా 

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. శుక్రవారం సూర్యాపేట బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం  ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.  నిన్న రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో ఆయన బస చేస్తారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి గం.11 వరకు 75వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం గం.3కు సూర్యాపేటకు బయలుదేరుతారు. సాయంత్రం గం.4 నుంచి గం.5 వరకు సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం గం.5.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం అవుతారు. మధ్యలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.

తెలంగాణలో టీడీపీ పోటీ.. సస్పెన్స్ కు ఇకనైనా తెరపడేనా?

తెలంగాణలో ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంటే కేవలం ఇంకో 34 రోజుల సమయం మాత్రమే ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్, బీజేపీలు కూడా అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయగా.. ఏ క్షణమైనా ఈ రెండు పార్టీలు రెండో జాబితా విడుదల చేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే, కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా చేయదా అనే అంశంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత అక్రమ అరెస్టుతో జైల్లో ఉండడంతో ఈసారి తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటుందనే ప్రచారం జరుగుతూ వచ్చిది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దీన్ని ఖండిస్తూ వస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కూడా పోటీ చేస్తుందని ఆయన విస్పష్టంగా చెబుతున్నారు. అటు జనసేన కూడా పోటీలో ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాసాని జ్ణానేశ్వర్ ఏపీలో తెలుగుదేశం పొత్తు ఎలా ఖరారైందో.. తెలంగాణలో కూడా అలాగే ఉంటుందనీ, ఇరు పార్టీలూ కలిసి  మొత్తం 119 స్థానాల్లో  పోటీ చేస్తాయని చెబుతున్నారు. కానీ  బీజేపీ మాత్రం జనసేన ఎన్డీయేలో భాగస్వామి అని చెబుతోంది. బీజేపీ జనసేనలు కలిసి తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తాయనీ, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నాయనీ చెబుతోంది. తొలి దశలో బీజేపీ జనసేన మద్దతు ఇవ్వాలనీ, పోటీకి దూరంగా ఉండాలని చేసిన ప్రతిపాదనను జనసేనాని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చరు. ఆ నేపథ్యంలోనే అమిత్ షా ఆహ్వానం మేరకు జనసేనాని ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయి వచ్చారు. ఇది జరిగి మూడు రోజులు కావస్తున్నా అటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ ఆ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. అసలు అమిత్ షాతో భేటీ తరువాత ఇరు పార్టీలూ కూడా మీడియా ముందుకు వచ్చిందే లేదు. ఈ నేపథ్యంలోనే కాసాని మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏపీలో లాగే తెలంగాణలో కూడా రెండు పార్టీలో కలిసే ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాసాని నేడో రేపో రాజమహేంద్రవరం వెళి చంద్రబాబుతో ములాఖత్ ద్వారా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఆ భేటీ తరువాత పోటీపై స్పష్టత ఉంటుందని అంటున్నారు.  తెలంగాణలో టీడీపీ పోటీపై కొన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కాసాని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం ఓటు బ్యాంకు నేటికీ చెక్కుచెదరకుండా ఉందనీ, ఏపీలో జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తరువాత తటస్థులు కూడా చంద్రబాబుకు సంగీభావం ప్రకటించడం, స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగడం చూస్తుంటే..చంద్రబాబుపై ప్రజాభిమానం ఇనుమడించిందన్నది అవగతమౌతోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తే.. నిర్ణయాత్మక పాత్ర పోషించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో  నిందితుడికి పదేళ్ల శిక్ష ఖరారు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ కోర్టు మరో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.   ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ కు శిక్ష పడింది. ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు అతనిని దోషిగా నిర్ధారిస్తూ పదేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో ఈ కేసులో శిక్ష పడిన వారి సంఖ్య ఐదుకి పెరిగింది. ఈ కేసులో ఎన్ఐఏ 11 మందిని అరెస్ట్ చేయగా, నలుగురికి ఇదివరకే శిక్ష పడింది.  సయ్యద్ మక్బూల్ స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్. హైదరాబాదులో పేలుళ్లకు కుట్ర పన్నాడన్న ఆరోపణలపై అతడిని 2013 ఫిబ్రవరి 28న అరెస్ట్ చేశారు. పాకిస్థాన్, భారత్ లోని ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదులతో అతడు క్రియాశీలకంగా సంప్రదింపులు జరుపుతూ కుట్రలో భాగమయ్యాడని ఎన్ఐఏ తన చార్జిషీటులో పేర్కొంది. 2012లో హైదరాబాద్‌లో పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించాలని ప్రయత్నించిన ఈ 11 మందితో కూడిన గ్యాంగ్.. పాకిస్థాన్ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చింది.

రాయలసీమ నుండి పవన్ కళ్యాణ్ పోటీ.. నియోజకవర్గం ఏదో తెలుసా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలలో ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు? అటు జనసైనికులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఎంతో ఆసక్తి రేకెత్తించే ప్రశ్న ఇదే. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలోని గాజువాకతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలలోని భీమవరం నుంచి పోటీ చేశారు. అయితే రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.   ప్రత్యర్ధులు ప్రతిసారి ఇదే విషయంపై ఎద్దేవా చేస్తుంటారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని పవన్ పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈసారి ఎక్కడ నుండి పోటీ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవన్ మరోసారి భీమవరం, గాజువాకలలో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు ఉత్తరాంధ్రలోని విశాఖ ఉత్తర లేదా   ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా  కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి కూడా పవన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, అటు కోస్తా ఆంధ్రా, ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ నుండి కూడా పోటీ చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్లు చెబుతున్నారు.  రాయలసీమలోని తిరుపతి, అనంతపురంలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.   అయితే, ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నుండి బరిలో దిగనున్న నేపథ్యంలో తిరుపతి పవన్ కళ్యాణ్ కోసం కేటాయించడం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా.. పవన్ కళ్యాణ్ ఒకే అంటే అనంతపురం నుండి పోటీ చేసేందుకు తెలుగుదేశం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. పవన్ పోటీ చేస్తానంటే తాను తప్పుకుంటానని ఇప్పటికే ఇక్కడ  తెలుగుదేశం  నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్న ప్రభాకర్ చౌదరి ప్రకటించారు. అయితే రాష్ట్రంలో ఇన్ని నియోజకవర్గాలు ఉండగా ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ కోసం అనంతపురం పేరు వినిపించడం వెనక బలమైన కారణం లేకపోలేదు. ఇక్కడ ఉన్న సామజిక వర్గాల బలాబలాల నేపథ్యంలోనే పవన్ ఇక్కడ పోటీ చేస్తే గెలుపు ఖాయమవడంతో పాటు రాయలసీమలో బలం పెరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది. అనంతపురం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ కమ్మ, బలిజ సామాజిక వర్గ ప్రజలు అధికంగా ఉంటారు. దాదాపుగా ఇక్కడ 70 వేల ఓటర్ల వరకూ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటారని అంచనా. ప్రస్తుతం వీరంతా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతు దారులుగా ఉన్నారు. అయితే, గతంలో ప్రజారాజ్యం వైపు  ఈ సామాజివర్గాల ప్రజలు కొంతమేర ఆ పార్టీ వైపు వెళ్లారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తర్వాత మళ్ళీ వీరంతా తెలుగుదేశం వైపు పోలరైజ్ అయ్యారు. గత ఎన్నికల్లో కొంతమేర జనసేనకు సైతం మద్దతు తెలిపారు. అయితే, ఇప్పుడు పొత్తులో భాగంగా పవన్ అనంతపురం నుంచి బరిలో దిగితే విజయం సునాయాసం అవుతుందని భావిస్తున్నారు. పవన్ ఇక్కడ నిలబడితే రాయలసీమలో సైతం ప్రభావం చూపగలరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే, నిజానికి ఇంతవరకు పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే స్థానం ఏంటన్నదానిపై స్పష్టత లేదు. పవన్ నుండి కానీ, జనసేన వర్గాల నుండి కూడా ఎలాంటి ప్రకటనలు లేవు. కానీ  ఇప్పుడు పవన్ రాయలసీమ నుంచి పోటీ చేయనున్నారనే కథనాలు వస్తుండడంతో జనసైనికుల్లో జోష్ నెలకొంది. చంద్రబాబు రాయలసీమ నుండి కుప్పంలో పోటీ చేయనుండగా.. లోకేష్ కోస్తాంధ్ర నుండి మంగళగిరిలో పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో పవన్ ఉత్తరాంధ్ర నుండి పోటీ చేస్తే బావుంటుందన్న భావన కూడా ఉంది. అందుకే సాధ్యమైనంత త్వరగా పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై   ప్రకటన చేయాలని జనసైనికులు కోరుతున్నారు. అంతేకాదు, వైసీపీ అధినేత జగన్ కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గాల మాదిరిగా.. పవన్ సైతం శాశ్వతమైన ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే బావుంటుందని జనసేన శ్రేణులు కోరుతున్నాయి. మరి పవన్ ఈసారి ఎక్కడ నుండి పోటీకి దిగనున్నారో చూడాల్సి ఉంది.

తెలంగాణ టీడీపీ అభ్యర్థులు ఫైనల్?

తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. వచ్చే వారంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. అయితే తెలంగాణలో టీడీపీ తప్పించి.. మిగిలిన పార్టీలన్నీ అంటే.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ వగైరా వగైర పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాలను విడతల వారీగా ప్రకటిస్తు వస్తున్నాయి.  మరోవైపు ప్రచారంలో ఆయా పార్టీలు తమదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నాయి. కానీ టీడీపీ మాత్రం.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదా? అనే ఓ సందేహం అయితే ఆ పార్టీ శ్రేణులు కొట్టుమిట్టాడుతోన్నాయి. అదీకాక ఇప్పటికే తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదని.. దీంతో ఆ పార్టీ శ్రేణులన్నీ నోటాకే ఓటు వేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చినట్లు ఓ ప్రచారం అయితే సోషల్ మీడియాలో హోరెత్తి పోతుంది. ఈ ప్రచారాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్ ఖండించడమే కాకుండా దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వేళ తెలుగు తమ్ముళ్లకు తీపి కబురు అందనున్నట్లు తెలుస్తోంది.  అదేమంటే.. రానున్న తెలంగాణ ఎన్నికల్లో 89 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని డిసైడ్ అయ్యిందన్న కబురు.  ఆ క్రమంలో ఆయా నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగి పోటీ చేయాలని భావిస్తున్న ఆశావాహ అభ్యర్థుల ఎంపికపై గట్టి కసరత్తు చేసి.. అందులో 189 మంది అభ్యర్థులతో కూడిన ఓ జాబితాను తయారు చేసి..  పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి ఇప్పటికే తెలుగుదేశం తెలంగాణ అద్యక్షుడు  తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం చంద్రబాబు తీసుకోవలసి ఉంది.   రాజమండ్రి సెంట్రల్ జైల్లో  చంద్రబాబు నాయుడుతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్ ములాఖత్ కానున్నారు. ఆ ములాఖత్ లో తెలంగాణలో తెలుగుదేశం పోటీపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.  కాగా శుక్రవారం (అక్టోబర్ 27) ఈ ములాఖత్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.  ఇక రాష్ట్రంలో మిగిలిన 30 నియోజకవర్గాలను పక్కన పెట్టినట్లు ఓ ప్రచారం అయితే కొన.. సాగుతోంది. సదరు ఈ నియోజకవర్గాలు.. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని స్థానాలతోపాటు ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయనున్నా మొత్తం 89 స్థానాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరు లేదా ఇద్దరు.. అలాగే ముగ్గురు వరకు ఆశావాహులుగా ఉన్నారని.. ఆ క్రమంలో వారి సంఖ్య 189 మందికి చేరినట్లు సమాచారం.   చంద్రబాబుతో కాసాని జ్జానేశ్వర్ ములాఖత్ తర్వాత... అభ్యర్థులు జాబితాకు తుది రూపు ఇచ్చి.. రెండు మూడు రోజులలో జాబితాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంకోవైపు తెలంగాణలో ముచ్చటగా మూడో సారి అధికారాన్ని అందుకోవాలని  బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా.. ఎలాగైనా కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాలని కాంగ్రెస్, బీజేపీలు   తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అలాంటి వేళ తెలుగుదేశం పార్టీ సైతం రంగంలోకి దిగితే.. ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుందన్నదనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.  ఇక తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్.. నవంబర్ 3వ తేదీన విడుదల చేయనుంది. ఆ రోజు నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. నవంబర్ 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తోంది. దీంతో డిసెంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుంది. దాంతో తెలంగాణలో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టేది ఆ రోజే తెలిపోనున్నది. ఏది ఏమైనా పోటీలో ఉన్నా లేకున్నా తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మాత్రం అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషించడం ఖాయమని అంటున్నారు. 

చంద్రబాబు ఆరోగ్యంతో జైలు అధికారుల చెలగాటం!

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం అధినేత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతున్నది.  జైలు అధికారులు వాస్తవాలను దాచిపెట్టి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇచ్చిన నివేదికలు మార్చి ప్రకటిస్తుండటంతో అసలు వాస్తవంగా చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉందన్న విషయంలో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.  చంద్రబాబు ఆరోగ్యంపై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. అంతా బాగానే ఉందంటూ విడుదల చేసిన హెల్త్ బులిటిన్, అదే ప్రభుత్వ వైద్యులు వారు జైలు అధికారులకు అందించిన నివేదికనే   నారా భువనేశ్వరికి సైతంఆయన భార్య నారా భువనేశ్వరికి అందించారు. అయితే ప్రభుత్వ వైద్యులు వైద్యులు ఇచ్చిన నివేదిక కాకుండా దానిని మార్చి చంద్రబాబు ఆరోగ్యం బాగుందంటూ బెలిటెన్ ను విడుదల చేయడం దిగ్భ్రాంతి కొలుపుతోంది. ఇలా తప్పుడు వివరాలతో  చంద్రబాబు హెల్త్ బులిటిన్ ను జైలు అధికారులు విడుదల చేసినట్లు వెల్లడి కావడంతో సర్వత్రా బాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.   చంద్రబాబు చాలా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని.. బుధవారం అంటే అక్టోబర్ 25వ తేదీ ఉదయం ఆయన్ని పరీక్షించిన ఐదుగురు వైద్యుల బృందం జైలు అధికారులకు ఇచ్చిన నివేదికలో విస్పష్టంగా పేర్కొన్నారు.  గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు చంద్రబాబు వైద్య పరీక్షల నివేదికను నారా భువనేశ్వరికి జైలు అధికారులు పంపడంతో జైలు అధికారులు ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఉద్దేశపూర్వకంగా గోప్యత పాటిస్తున్నారని తేటతెల్లమైంది.   స్కిన్ అలర్జీతో కొన్ని రోజుల క్రితం చంద్రబాబుకు శరీరంపై దద్దుర్లు వ్యాపించి ఇబ్బంది పడడంతో.. మందులు వాడకంతోపాటు చల్లని వాతావరణం కల్పించాలని వైద్యులు సిఫార్స్ చేయడంతో.. కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఉండే గదికి ఏసీని అమర్చారిన విషయం తెలిసిందే. కానీ ఆయన ఒంటిపై దద్దుర్లు తగ్గలేదని తాజా నివేదికలో వెల్లడైంది. ఇక చంద్రబాబు చెప్పిన.. వైద్యులు గుర్తించిన అంశాలపై బయట వైద్యులను సంప్రదిస్తే.. చంద్రబాబుకు.. విరోచనం సాఫీగా కాకపోవడం, ఇబ్బంది పడడం, నడుం కింద భాగంలో నొప్పి కి కారణాలు తెలుసుకోవాలంటే ప్రాక్టోస్కోపీ వంటి ప్రత్యేక వైద్య పరీక్షలు ఆయనకు నిర్వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు జైల్లో ఆయన్ని పరీక్షించిన వైద్యులు కొన్ని వైద్య పరీక్షలను సిఫార్సు చేశారు. అలాగే పూర్తి రక్త పరీక్ష, కిడ్నీ, లివర్ పరీక్షలు, మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్ రే, 2డి ఎకో పరీక్షలు ఆ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా జైల్లో చంద్రబాబుకు వైద్యుడు కంటిపరీక్ష నిర్వహించగా.. ఆయన కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని సూచించారు. ఇప్పటికే అంటే.. గతంలో ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే. మరో కంటికి కూడా కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యుడు తెలిపారనీ, అయితే ఆ విషయాన్ని నివేదికలో పేర్కొనవద్దంటూ   సదరు వైద్యుడిపై జైలు అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చినట్లు ఓ ప్రచారం జరుగుతోంది.  అయితే చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందంటూ జైలు అధికారులు  హెల్త్ బులెటిన్ రూపంలో విడుదల చేసిన నివేదికకు.. తాజాగా నారా భువనేశ్వరికి చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ వైద్యాధికారులు ఇచ్చిన నివేదికకు  వ్యత్యాసం ఉందని.. ఇటువంటి పరిస్థితుల్లో రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. చంద్రబాబు ఆరోగ్యం అంతా బాగానే ఉందంటూ ఇస్తున్న నివేదికపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయని.. అలాగే ఆయన కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని వైద్యుడు సూచిస్తే.. ఆ విషయాన్ని బహిర్గతం చేయవద్దంటూ ఆయనపై ఒత్తిడి ఎందుకు తీసుకు వచ్చినట్లు అనే పార్టీ శ్రేణులే కాదు, జనం సైతం ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని రహస్యంగా ఉంచి.. తప్పుడు హెల్త్ బులిటిన్ విడుదల చేసి.. ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స అందకుండా అడ్డుకోవడం వెనుక ఉన్న కుట్రకోణంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు కనుక.. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులు ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయకుండా ఆయన ఆరోగ్యం బాగుందంటూ తప్పు సమాచారంతో హెల్త్ బులిటిన్ విడుదల చేసిన జైలు అధికారులపై హై కోర్టు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

నిన్ను వ‌ద‌ల కేసీఆర్‌ వదల.. వెంటాడుతున్న కాళేశ్వ‌రం అవినీతి

కాళేశ్వరం ప్రాజెక్టు మీద, దాని డిజైన్ మీదా తొలి నంచీ అనుమానాలు  వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆ అనుమానాలు బలపరిచిన తొలి ఘటన 2022 వరదలు. గోదావరి నదికి భారీగా వచ్చిన నాటి  వరదలకు ఆ ప్రాజెక్టు పంపు హౌజులు మునిగిపోయాయి.   మేడిగడ్డ దగ్గర కూడా పంపు హౌస్ కూడా మునిగింది. పంపు హౌస్ గోడ కూలింది. వీటిని తిరిగి పని చేసేలా చేయడానికి మూడు నెలలకు పైగా సమయం పట్టింది. అంతేకాదు, కోట్ల రూపాయలు వ్యయం అయ్యింది.  ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ ఫిల్లర్లు కుంగిన సంఘటనతో  అనుమానాలన్నీ వాస్తవమేనా అన్న సందేహాలు వెల్లువెత్తుతుున్నాయి. కేసీఆర్ కూడా ఇలా ఎందుకు జరిగింది?  బరాజ్ ఎందుకు కుంగిందంటూ  బాగా టెన్షన్ ప‌డుతున్నార‌ని చెబుతున్నారు. ఎందుకంటే  పిల్లర్ కుంగిపోవటం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఎప్పుడైతే బ్యారేజి పిల్లర్ కుంగిందో, వెంటనే బ్యారెజీ కూడా కుంగిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. .  కారణమేదైనా మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ కుంగటం ఈ ఎన్నికల్లో బిగ్ ఇష్యూగా మారిందనడంలో సందేహం లేదు.   బ్యారేజి నిర్మాణంలో కేసీయార్ భారీ అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.  ప్రతిపక్షాల ఆరోపణలను ఏ విధంగా తిప్పికొట్టాలో కేసీఆర్ కు, బీఆర్ఎస్  కు అర్ధంకావటంలేదు. కాంక్రీట్ స్ట్రక్చర్ లో లోపం కారణంగానే బ్యారేజి పిల్లర్ కుంగిందని రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అధ్యక్షుడు దొంతుల లక్ష్మీనారాయాణ ప్రకటించారు. అసలు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలోనే అతి పెద్ద లోపం ఉందని.. అక్కడ డిజైన్ తేడా ఉంద‌ని,  నిపుణులు చెబుతూనే ఉన్నారు.  అతి వేగంగా నిర్మించి.. క్వాలిటీని పట్టించుకోలేదన్న ఆరోపణలూ ఉన్నాయి.  ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన ముఖ్య‌మైన పాయింట్ ఏమిటంటే....  ఇరిగేషన్ శాఖ కూడా కేసీఆరే నిర్వహిస్తున్నారు. ఎప్పుడో, దశాబ్దాల కిందట కట్టిన బ్యారేజులు, ప్రాజెక్టులు ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ పట్టుమని ఐదేళ్లు కాకుండానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. దీన్ని ఎలా సమర్థించుకోవాలో కేసీఆర్‌కు అర్థం కావడం లేదంటున్నారు. విష‌యం ఏమిటంటే...  ఉత్తర తెలంగాణకు ప్రాణహిత నీరు అందాలంటే మేడిగడ్డే ఆధారం. అలా మేడిగడ్డ నుంచి నీటిని గోదావరిలో వెనక్కు తోడాలి.   కానీ ఇప్పుడు జరిగిన ఘటనతో అసలు మేడిగడ్డలో నీళ్లు నిలువ ఉంచే పరిస్థితే లేదంటున్నారు సాగునీటి నిపుణులు. ప్రస్తుతానికి ఉన్న నీరంతా ఖాళీ చేసేశారు. దీంతో ఇప్పుడు ప్రాణహిత నుంచి వచ్చే నీటిని నిల్వ చేయడానికి కానీ, ఆ నీటిని వెనక్కు తోడి సుందిళ్ల, అన్నారం దగ్గరకు మళ్లించి అక్కడ నుంచి తోడి నీరు ఇవ్వడానికి సాధ్యం కాకపోవచ్చు. అంటే మొత్తం ప్రాజెక్టు ప్రయోజనానికే గండి పడే అవకాశం ఉంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ బాగానే ఇరుక్కున్నారు. ఎందుకంటే.... 1) మేడిగడ్డ బరాజ్,  కట్టిన నాలుగేళ్లకే ఎందుకు కుంగిపోయింది?   20వ నంబర్ దిమ్మ  20వ తేదీ, అదే శనివారం రాత్రి నుంచే కుంగడం ప్రారంభమైంది.  ప్రస్తుతం అక్కడంతా రహస్యంగా ఉంది. మీడియాను అటు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. గతంలో కాళేశ్వరం పంప్ హౌసులు మునిగినప్పుడు కూడా మీడియాను అనుమతించలేదు. రహస్యంగానే ఉంచారు. ఈ దారుణానికి కార‌ణం నిర్మాణంలో.... నాణ్యతా లోపమే అంటున్నారు తెలంగాణ ఇంజినీర్ల ఫోరం కన్వీనర్ దొంతి లక్ష్మీ నారాయణ.  కచ్చితంగా పునాదుల నిర్మాణంలో లోపం వల్లే ఇలా జరిగింది. ఫౌండేషన్ సరిగా చేయలేదు. అందులో లోపం ఉంది. దానివల్ల కొంత కాలంగా కొంచెం కొంచెం ఫౌండేషన్ కింద ఉన్న ఇసుక కొట్టుకుంటూపోయి ఇప్పుడు కుంగింది. రాతి పునాది వేరు. ఇది ఇసుక పునాది. ఇసుక పునాదిలో నిర్మాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఉదాహరణకు రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఇసుక పునాది అయినప్పటికీ బలంగా ఉంది. కానీ ఇక్కడ నిర్మాణ దశలో జాగ్రత్తలు పాటించలేదని స్పష్టంగా తెలుస్తోంది’’   ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణానికి ముందు నదీ మట్టంలోని ఇసుకను వదులు లేకుండా చేయాలనీ కానీ మేడిగడ్డ విషయంలో ఆ ప్రక్రియ సక్రమంగా జరగలేదనీ నిపుణులు చెప్తున్నారు.  ‘‘సాధారణంగా ఒక పిల్లర్ దెబ్బతింటే ఆ ప్రభావం పక్కవాటి మీద కూడా పడుతుంది. ఇక్కడ ఎంత మేర దెబ్బతిన్నది అన్నది తెలియాల్సి ఉంది. అప్పుడే మరమ్మతు సాధ్యపడుతుందా, సాధ్యమపేటట్లైతే ఏలా మరమ్మతు చేయాలి వంటివి తెలుస్తాయి. అని  దొంతి లక్ష్మీ నారాయణ తెలిపారు. ప్రస్తుతం ఆ బరాజ్‌ నిర్మాణం చేసిన తెలంగాణ ప్రభుత్వ ఇంజినీర్లు, ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీలోని ఇంజినీర్లు, ఆ బరాజ్‌ కట్టిన కాంట్రాక్టు కంపెనీ ఇంజినీర్లు అంతా ఏం జరిగిందో సమగ్రంగా తెలుసుకునే పనిలో ఉన్నారు. కానీ వారికి నీరు అడ్డంకిగా మారింది. ఎందుకంటే, ఘటన జరిగే సమయానికి ప్రాజెక్టు నిండుగా ఉంది. ఆ నీటిని కిందకి వదిలేసినప్పటికీ, పై నుంచి ఇంకా నీరు వస్తోంది. దాన్ని కూడా కిందకు వదిలేస్తున్నారు. సరిగ్గా గోదావరి నదిలో ప్రాణహిత కలిసిన తరువాత మేడిగడ్డ బారేజీ ఉంటుంది. అందుకని నీటి ప్రవాహం ఎక్కువ ఉంది. అయితే, నిర్మాణ లోపాలు లేవని ప్రాజెక్టు నిర్మించిన సంస్థ చెబుతోంది. ‘‘వరద నీటిని తట్టుకునేలా ప్రాజెక్టు నిర్మించాం. భారీ శబ్దం తరువాత ఇది జరిగింది. దీనిపై డిజైన్ టీమ్, ఇంజినీరింగ్ టీమ్ పరిశీలించింది. నీటి మట్టం తగ్గాకే ఏం జరిగిందో తెలుస్తుంది. బరాజ్‌కి ఏం జరిగినా ఎల్ అండ్ టీ బాధ్యత వహిస్తుంది. ప్రజలకూ, వాతావరణానికీ ఎటువంటి హానీ కలగనివ్వబోం. డిజైన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. నిర్మాణం మేం చేశాం. అంటూ  ఎల్ అండ్ టీ ఇంజినీర్ సురేశ్ కుమార్ చెప్పారు. బరాజ్‌ కుంగిన ప్రాంతాన్ని ఎల్ అండ్ టీ  పరిశీలించింది.  పూర్తి బాధ్యత వారిదే. అని బరాజ్‌ చీఫ్ ఇంజినీర్  వెంకటేశ్వర్లు చెప్పారు.  1. కొత్త బరాజ్‌ ప్రారంభమై నాలుగేళ్లే అయింది. అప్పుడే ఎందుకు దెబ్బతింది? నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయా? మరమ్మత్తులు చేయగలరా? చేయడానికి ఎంత అవుతుంది, ఎంత కాలం పడుతుంది? 2. ఈ బరాజ్‌కి మరమ్మత్తులు పూర్తయి మళ్లీ నీటిని నిల్వ చేసే వరకూ రైతుల పరిస్థితి ఏంటి? వారు పంటల విషయంలో ఈ నీటిని నమ్ముకుని వెళ్లవచ్చా? 3. డిజైన్లో కానీ, నిర్మాణంలో కానీ తప్పు ఎవరిదో తేల్చి ఆ బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? 4. జరిగిన ఆర్థిక నష్టానికి బాధ్యత ఎవరిది? 5. మిగిలిన బరాజ్‌ల పటిష్టత మాటేంటి. ఎందుకంటే వరదల సమయంలో ఇటువంటి ఘటన జరిగితే కింద అనేక గ్రామాలకు ముంపు ప్రమాదం ఉంటుంది ఈ ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వమే స‌మాధానం చెప్పాలి.  సాగునీటి శాఖ సమాధానం చెప్పాల్సి ఉంది.

కాంగ్రెస్ ఏడో గ్యారంటీ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్రం

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి  కాంగ్రెస్‌  మాత్రమే ప్రత్యామ్నాయంగా నిలిచింది. వరుసగా ఏడు సర్వేల్లో ఆరు సర్వేలు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే విజయావకాశాలున్నట్లు ప్రకటించాయి. సిక్స్ గ్యారెంటీస్ తో ప్రజల్లో ఇప్పటికే చర్చనీయాంశమై ఆ పార్టీకి మరో కొత్త గ్యారెంటీ తోడయ్యింది. ఇప్పుడు ఈ హామీలకు మరోటి చేర్చినట్టు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.  ఒక దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కేసీఆర్ హయాంలో ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం లేకుండా పోయాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఈ మూడింటినీ తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తాము ప్రకటించిన ఆరు హామీలకు తోడుగా దీనిని ఏడో హామీగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని చాటిచెప్పేందుకే కొడంగల్ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌కు సవాల్ విసిరినట్టు తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ తరచూ ముఖ్యమంత్రులను మార్చుతుందన్న విమర్శలపైనా రేవంత్ స్పందించారు. పార్టీలో ప్రస్తుతం అలాంటి వైఖరి లేదని, అది గతించిన విషయమని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వాలను వదులుకుంటుంది తప్ప పార్టీలోని అసమ్మతి గొంతులకు అధిష్ఠానం తలొగ్గబోదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌, కర్ణాటకను ఉదాహరణగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని మార్చాలన్న జ్యోతిరాదిత్య సింధియా ఒత్తిడి చేస్తే ఆయననే వదులుకొందని, అంతకుముందు కర్ణాటకలోనూ సంకీర్ణ ప్రభుత్వాన్ని వదులుకున్నామని రేవంత్ గుర్తు చేశారు. పార్టీలోని వివిధ వర్గాలు సీఎం పదవిని ఆశించడం తప్పేముందని రేవంత్ ప్రశ్నించారు.

తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కాంగి‘రేసు’

కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనపై ప్రజా వ్యతిరేకత, అంతర్గత కుమ్ములాటలతో డీలా పడ్డ బీజేపీ.. రెండు పార్టీలనూ మరింతగా ఇబ్బందులకు గురి చేసేలా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ వ్యూహకర్త  సునీల్ కనుగోలు కాంగ్రెస్ కు సహజకవచకుండలాలుగా అంతా  చెప్పే అంతర్గత కలహాలు, గ్రూపు రాజకీయాల నుంచి బయటపడేశారని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ సమష్టిగా ఐక్యంగా  కదులుతున్న తరుణంలోనే  ప్రత్యర్థి  పార్టీలకు కాంగ్రెస్ జాడ్యం అంటుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా  చెప్పుకునే బీజేపీపరిస్థితి తెలంగాణలో అత్యంత దయనీయంగా మారిపోయింది. బీజేపీలో నేతల సంఖ్యతో సమానంగా అసంతృప్తుల సంఖ్య కూడా ఉందని అంటున్నారు. ఇతర పార్టీలనుంచి వచ్చి బీజేపీ గూటికి చేరిన వారు సహజంగానే ఆ పార్టీలో ఉక్కపోతకు గురౌతుంటారు. సంప్రదాయ పార్టీలకు భిన్నంగా  బీజేపీని వెనుక నుంచి ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంటుంది. దీంతో వేరే భావజాలంతో ఉన్నవారు రాజకీయ అవసరాల కోసం కమలం గూటికి చేరినా అక్కడ ఇమడ లేని పరిస్థితులు ఉంటాయి. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం తొలి నుంచీ పార్టీలో ఉన్నవారే ఉక్కపోతకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. అలాగే  ఈ తొమ్మదేళ్ల కాలంలో బీజేపీలో తొలి నుంచీ ఉన్నవారి కంటే బయట నుంచి వచ్చి పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్న వారి సంఖే ఎక్కువ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించడం వెనుక కూడా ఈ బయట నుంచి వచ్చి చేరిన వారి ప్రమేయమే ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నాటికి బలమైన నేతలతో బీజేపీ నిండిపోతుందన్న పరిశీలకుల అంచనాలు తల్లకిందులయ్యాయి. ఇప్పుడు పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్ వైపు చూస్తుంటే వారిని నిలువరించడం ఎలా అని కమలం నేతలు తలలు బద్దలు కొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.  ఇక మరో వైపు బీఆర్ఎస్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. గతంలో ఆపరేషన్ ఆకర్ష్ పేరిటి ఇతర పార్టీలను ఖాళీ చేయడమే లక్ష్యంగా కేసీఆర్ అనుసరించిన విధానమే ఇప్పుడు ఆ పార్టీని కకావికలం చేస్తోందని అంటున్నారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలలో అధినేత మాటే శాసనం అనే పరిస్థితి ఉంటుంది. కానీ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ లో విధేయత కంటే ధిక్కారమే ఎక్కువగా కనిపిస్తోందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ లో అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా  ఐక్యత కనిపిస్తున్నది. సీనియర్ల మంటూ తమ భుజాలను తామే చరుచుకునే కాంగ్రెస్ వృద్ధ నేతల అసమ్మతి గళాలనూ, అసమ్మతి రాగాలనూ పార్టీ శ్రేణులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వారూ మిన్నకుండక తప్పని పరిస్థితి కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమాయత్తం కోసం బీజేపీ, బీఆర్ఎస్ ను కసరత్తులు చేస్తుంన్నాయి. ఆ పార్టీ నేతలకు వలసల బెడద కంటిమీద  కునుకు లేకుండా చేస్తుంటే.. అటువంటి ఇబ్బందులన్నిటినీ అధిగమించిన కాంగ్రెస్ మాత్రం వజయం కోసం వ్యూహాలను రచించుకుంటూ.. వాటిని పకడ్బందీగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. 

అక్కడ ఈటల.. ఇక్కడ రేవంత్.. కేసీఆర్ కు ఇక చుక్కలేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ సారి తాను పోటీ చేయనున్న రెండు నియోజకవర్గాలలోనూ గట్టి పోటీనే ఎదుర్కోనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గజ్వేల్ లో ఏ ప్రతిబంధకాలు కనిపించాయో.. నియోజకవర్గ ప్రజల కోరిక అంటూ ఆయన గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా పోటీలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. వరుసగా రెండు పర్యాయాలు సీఎంగా ఉన్న కేసీఆర్.. తెలంగాణ ఆవిర్భావానికి కర్త, కర్మ, క్రియా తానేనని చెప్పుకునే ఆయన ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఆ  దిశగా ఆయన వచ్చే ఎన్నికల కోసం రచిస్తున్న వ్యూహాలు, వేస్తున్న ఎత్తుగడలు మాత్రం అంతగా  ఫలిస్తున్నట్లుగా కనిపించదు. స్వయంగా తానే సొంత నియోజకవర్గం గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా పోటీకి సిద్ధపడటం ఆయనలోని అభద్రతా భావాన్ని సూచిస్తున్నదని పరిశీలకులుఅంటున్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ ప్రత్యర్థిగా తాను నిలబడతానని చాలా చాలా ముందుగానే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. అలా ఈటల ప్రకటించిన క్షణం నుంచీ గజ్వేల్ లో  కేసీఆర్ విజయంపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈటల తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ తో అడుగులు వేసిన వ్యక్తే. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఆయనకు తన  సొంత నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ సర్కార్ రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తొలి విడతలో ఆయన మంత్రిపదవి దక్కలేదు. మలివిడతలో ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు.  ఆ శాఖ మంత్రిగా కరోనా సమయంలో ఆయన పని తీరును ప్రజలు మెచ్చారు. కానీ.. ఆయన ముక్కుసూటి తనం, మంత్రి కేటీఆర్ కు  సీఎం పగ్గాలు అప్పగిస్తారన్న వార్తలు జోరుగా వచ్చిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కు ఆగ్రహం కలిగించాయి. ఫలితం భూ కబ్జా ఆరోపణలతో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. పార్టీనుంచీ బయటకు పంపారు. ఆ సమయంలో ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్న చర్చ విస్తృతంగా జరిగింది. ఈటల  కాంగ్రెస్ గూటికి చేరుతారని పరిశీలకులు భావించినా.. అప్పటికి రాష్ట్రంలో  కాంగ్రెస్ బీఆర్ఎస్ (అప్పడు టీఆర్ఎస్) కు పోటీ ఇచ్చే  స్థాయిలో లేదన్న కారణంతో ఆయన తన బీజేపీ గూటికి చేరారు. తన శాసన  సభ్యత్వానికి రాజీనామా  చేసి మరీ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ   అభ్యర్థిగా నిలిచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈటలను ఓడించేందుకు కేసీఆర్ చేయగలిగినన్ని ప్రయత్నాలు చేశారు. మంత్రులను, సీనియర్లనూ అందరినీ హుజూరాబాద్ లో మోహరించి దాదాపు ఓ యుద్ధమే  చేశారు. అయితే అవన్నీ నిష్ఫలమై ఈటల  భారీ  మెజారిటీతో విజయం సాధించారు. దీంతో సహజంగానే  ఈటల  కేసీఆర్  ప్రత్యర్థిగా గజ్వేల్ నుంచి పోటీకి సిద్ధపడటం, బీజేపీ  హైకమాండ్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో  కేసీఆర్ ముందు జాగ్రత్త పడ్డారనీ, గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా పోటీకి రెడీ అయ్యారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అక్కడా ఆయనకు స్థిమితం లేకుండా చేయడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేసీఆర్ కు బలమైన ప్రత్యర్థిగా గుర్తింపు పొందిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కామారెడ్డి నుంచి బరిలోకి దింపేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే రేవంత్ కు కాంగ్రెస్ హై కమాండ్ సమాచారం ఇచ్చిందని చెబుతున్నారు. ముందుగా రేవంత్ కూడా గజ్వేల్ నుంచే పోటీ చేయాలని భావించినప్పటికీ  కాంగ్రెస్ హై కమాండ్ సూచన మేరకు కామారెడ్డి నుంచి  రంగంలోకి దిగుతున్నారు.  దీంతో కేసీఆర్ పోటీ  చేయనున్న రెండు నియోజకవర్గాలలోనూ  ఆయన గట్టి  పోటీని  ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. కామారెడ్డి నుంచి ఇప్పటికే షబ్బీర్ అలీ అభ్యర్థిగా ప్రచారం  చేసుకుంటున్నప్పటికీ అధిష్ఠానం  ఆయనను మరో స్థానం  నుంచి  పోటీ చేయించడం కానీ, పార్టీ బాధ్యతలు అప్పగించడం  కానీ  చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు  కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.   కామారెడ్డిలో కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంక్ ఉంది.  గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన బీఆర్ఎస్ నేత గంప గోవర్ధన్  మెజారిటీ 5వేల ఓట్లు  మాత్రమే.  గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్  వర్కౌట్ అయినప్పటికీ కామారెడ్డి నుంచి  గంపగోవర్ధన్ స్వల్ప మెజారిటీలతోనే గట్టెక్కారు. ఈ  సారి  తెలంగాణ  సెంటిమెంట్  పెద్దగా  కనిపించకపోవడం, అలాగే  ప్రభుత్వ  వ్యతిరేకత అధికంగా ఉండటంతో  రేవంత్ రెడ్డి బరిలోకి దిగితే.. కేసీఆర్ కు ఇబ్బందులు  తప్పవనీ పరిశీలకులు అంచనా  వేస్తున్నారు. అందుకే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీని కూడా కాదని  రేవంత్ ను అక్కడ  నుంచి పోటీకి  దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిందని అంటున్నారు. రేవంత్ తన సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు కామారెడ్డి నుంచీ కూడా పోటీ చేయనున్నారు. పరిశీలకుల విశ్లేషణ మేరకు కొడంగల్ లో ఈ సారి రేవంత్ విజయం నల్లేరు మీద బండి నడకే. కామారెడ్డిలో ఆయన పోటీ చేయడం ద్వారా కేసీఆర్ వంటి నేత.. ఆ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషిస్తున్నారు.  ఒక వేళ కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ విజయం సాధిస్తే.. ఇక రాష్ట్ర పార్టీలో ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించేందుకు అసమ్మతి వాదులు ధైర్యం చేయలేరనీ పరిశీలకులు అంటున్నారు. ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ కు కొడంగల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.  మొత్తం మీద గజ్వల్ లో ఈటల నుంచీ, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నుంచీ కేసీఆర్ గట్టి పోటీ ఎదుర్కోవడం ఖాయమని అంటున్నారు.  ఈ పరిస్థితి కచ్చితంగా కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చేసే ప్రచారంపై పడుతుందనీ, ఇతర నియోజకవర్గాలపై కేసీఆర్ పెద్దగా కాన్సన్ ట్రేట్ చేయలేని పరిస్థితి ఉంటుందనీ, ఆయన పూర్తిగా ఈ రెండు నియోజకవర్గాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పింఛన్ కు ఓటర్ ఐడీ కార్డుకూ లింకేంటి?

జగన్ సర్కార్ మరో సారి అధికారంలోకి రావడానికి లబ్ధిదారులను బెదరించడానికి రెడీ అయ్యిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలోని అత్యధిక నియోజకవర్గాలలో  వేల సంఖ్యలో దొంగ ఓట్లను నమోదు చేయించడమే కాకుండా, తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే పుంఖాను పుంఖాలుగా ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ విషయంపై ఈసీ దృష్టి పెట్టింది. ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు విషయంలో అక్రమార్కులకు సహకరించిన అధికారులపై వేటు కూడా వేసింది. జనం తన ప్రభుత్వాన్ని వదిలించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారని నిర్ధారణకు వచ్చేసిన వైసీపీ దొంగదారిలోనైనా అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అందుకోసం చేతిలో ఉన్న అధికారాన్ని ఏ స్థాయికైనా దుర్వినియోగం చేయడానికి వెనుకాడటం లేదు. ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు పై ఈసీ దృష్టి పెట్టడంతో ఇప్పుడు వైసీపీ మరో ఎత్తుగడకు తెరలేపింది. ఈ సారి సంక్షేప పథకాల లబ్ధిదారులను బెదరించడమే లక్ష్యంగా కొత్త నాటకాన్ని మొదలు పెట్టారు. అందులోనూ ముఖ్యంగా సామాజిక భద్రత పించన్ లబ్ధిదారులను టార్గెట్ చేశారు. సరిగ్గా ఎన్నికలకు ఐదారు నెలల సమయం ఉన్న ఈ తరుణంలో సామాజిక పించన్ లబ్ధిదారుల అర్హతకు ఓటరు ఐడీ కార్డుకూ లింకు పెట్టారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఏదైనా సంక్షేమ పథకం లబ్ధిదారుల అర్హతకు ఆధార్ కార్డును ప్రమాణికంగా తీసుకోవాలి. దానితో పాటు నివాస ధృవీకరణ కోసం ఇప్పటి వరకూ ఆధార్ సరిపోయేది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఓటర్ కార్డు, లేదా పాస్ పోర్టును తప్పని సరి చేసింది. అయితే ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. కేవలం సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నది. అసలు ఓటరు కార్డు, పాస్ పోర్టులకూ సామాజిక భద్రత పించన్ల అర్హతకు లింకేమిటన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఒక వేళ ప్రభుత్వం అధికారికంగా ఈ నిర్ణయం తీసుకుని ఉంటే దానిని జీవో రూపంలో విడుదల చేయాలి. కానీ అలా చేయడం లేదు. కేవలం సామాజిక మాధ్యమం ద్వారా సమాచారాన్ని అందిస్తున్నది. ఇక్కడే పించన్ల లబ్ధికి వైసీపీకే ఓటు వేయాలన్న నిబంధనను అనధికారికంగా తీసుకువచ్చినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు దరఖాస్తుదారుల వయసు, చిరునామా ధ్రువీకరించేందుకు ఆధార్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఈ విధానాన్ని కొనసాగిస్తూనే..  ఓటర్‌ ఐడీ లేదా పాస్‌పోర్టును తప్పనిసరి చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారాన్నిపంపింది. ఎన్నికలకు మరో ఐదారు నెలల గడువు మాత్రమే ఉన్న తరుణంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.  పింఛను లబ్ధి పేరుతో ప్రభుత్వం దరఖాస్తుదారుల ఓటరు ఐడీ నంబర్లను సేకరించే ప్రయత్నం చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఉరుము లేని పిడుగులా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా తెరచాటుగా పోర్టల్‌లో మార్పులు చేయడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఓటరు ఐడీ సేకరణ ద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటేయాలని లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురావడం, లేదా పింఛను అందదని బెదరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇలా చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  నాలుగున్నరేళ్లుగా లేని  ఓటరు ఐడీ  నిబంధనను జగన్ సర్కార్ ఇప్పుడే, ఎన్నికల ముందే ఎందుకు  తీసుకువచ్చిందని విపక్షాలు నిలదీస్తున్నాయి.    

అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి

అమెరికాలో  మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మైనేలోని లెవిస్టన్ ప్రాంతంలో దుండగుడు విచక్షణా రహితంగా  జరిపిన కాల్పుల్లో కనీసం 22 మంది మరణించారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.  భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి  ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయంలో ఈ ఘటన జరిగిందని  లెవిస్టన్‌లోని సెంట్రల్ మైనే మెడికల్ సెంటర్ ఒక ప్రకటనను విడుదల చేసింది. అలాగే ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడు పరారయ్యాడని ఆ ప్రకటనలో పేర్కొంది. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుండగుడి చేతిలో ఆయుధాలు ఉండటంతో అతడు మరోసారి కాల్పులకు పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళేన వ్యక్తం అవుతున్నది. ఈ  నేపథ్యంలో ఎమర్జెన్సీ  అలర్ట్ జారీ చేశారు.