గల్ఫ్ లో పేలుడు.. ఐదుగురు భారతీయుల మృతి
ఖతార్ రాజధాని దోహాలో భారీ పేలుడు జరిగి, ఐదుగురు భారతీయులు సహా పదకొండు మంది విదేశీయులు మృతి చెందారు. గురువారం నాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దోహాలోని టర్కిష్ హోటల్ ల్లో సంభవించిన భారీ పేలుడులో మొత్తం 11 మంది మరణించారని, వారిలో 5గురు భారతీయులున్నారని ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనలో మరో 35 మంది గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురి భారతీయులను గుర్తించారు. మృతులలో రియాస్ ఖిజాకె మానోలిల్, అబ్దల్ సలీం, జకారియా పదింజారే, అనాకండి, వెంకటేష్, షేక్ బాబు అనే ఐదుగురు భారతీయులని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు నేపాల్ దేశస్థులు ఉండగా, మరో ఇద్దరు ఫిలిప్పీన్స్ దేశస్థులు ఉన్నారు. భారతీయుల మృతదేహాలను స్వదేశానికి పంపేందుకు అక్కడి రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది.