నిరాశలో జగన్‌ అభిమానులు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు ఎంత మంది దేవుళ్లకు మొక్కుకున్నా ఫలితం లేక పోయింది. సుప్రీంకోర్టు బెయిలు నిరాకరించింది. సిబిఐ వాదనలతో ఏకీభవించింది. సిబిఐ తిరుగులేని సాక్ష్యాలను చూపింది. దాల్మియా గ్రూప్‌ సీనియర్‌ ఉద్యోగుల పేరిట తీసుకున్న లాకర్లలో 14 కోట్ల రూపాయల నగదు, 5 కోట్లు విలువ చేసే బంగారం దొరికింది. అంతకంటె విలువైన హార్డు డిస్కుకూడా దొరికింది. దానిలో క్విడ్‌ ప్రోకోగా చెపుతున్న దినేష్‌ దాల్మియాకు సిమెంట్‌ కంపెనీ కోసం 140 కోట్ల కు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అందులో 55 లక్షలు జగన్‌కు దక్కినట్లు మిగతా ఇవ్వవలసి ఉన్నట్లు ఉంది. దినేష్‌ దాల్మియా విచారణ కూడా ఇదే బయటపడినట్లు సమాచారం. అంతే కాకుండా ఐటి దాడుల్లో కూడా ఇదే విషయం బయట పడినట్లు కోర్టుకు రుజువులు చూపుతూ ఎంతో మంది పేరొందిన రాజకీయనాయకులగా వున్నవారు దీని వెనుక ప్రధాన పాత్ర పోషించారు కాబట్టి వారందరిని విచారించడానికి గాను ఇంకా వ్యవధి కావాలని సిబిఐ తరుపున వాదిస్తున్న న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రస్తుతానికి 3 వేల కోట్ల ఆస్ధుల్ని గుర్తించామని సిబిఐ తెలిపింది. జగన్‌ బయటికి వస్తే సాక్షులను ప్రలోభపెడతారన్న వాదనకు సుప్రీం కోర్టు ఏకీభవించింది. అంతేకాకుండా పూర్తి విచారణ జరిపే వరకు బెయిల్‌ ఇవ్వకూడదని కూడా సీబిఐ వారనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో మరో మూడు నెలల వరకు బెయిలు మంజూరు చేయవద్దని కూడా వారు న్యాయమూర్తిని కోరారు. దీంతో వైయస్సార్‌ సిపి పార్టీలో నిరాశా, నిసృహ ఆవరించింది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.