విజయమ్మ మీదే జగన్‌ పార్టీ భారం

జగన్‌కి ఇప్పట్లో బెయిల్‌ వచ్చే సూచనలు కనిపించడంలేదు. కనీసం మూడు నెలల పాటు జగన్ కి బెయిల్ మంజూరు చేయకూడదని సిబిఐ గట్టిగా కోరుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈడీ వేసిన పిటిషన్ జగన్ తో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ కి కుడా పెద్దదెబ్బని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ భారం పూర్తిగా విజయలక్ష్మి భుజాల పైనే ఉన్నట్లు లెక్క షర్మిల, భారతి ఆమెకు చేదోడువాదోడుగా నిలబడక తప్పదు. వచ్చే ఎన్నికల నాటికి కుడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోతే మళ్ళీ ఉపఎన్నికల్ నాటి సీన్ పునరావృతం అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. మరో వైపు చంద్రబాబు ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకొనేందుకు పాదయాత్ర చెప్పట్టారు. వెళ్ళిన చోటాళ్ళ బాబుకు జనం జేజేలు కొడుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న జనం బాబు వైపుకి మళ్ళి పోకు౦డా చుసుకోనేందుకు వైకాపా నేతలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రయత్నంలో విజయలక్ష్మి పై భారం అ౦తకంతకి పెరిగిపోతోంది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.