జగన్ సెల్ ఫోన్ నెంబర్ కోసం నేతల ఆరాటం

 

చంచల్ గూడ జైల్లో వైకాపా అధ్యక్షుడు జగన్ రాజభోగాలు అనుభవిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ తెలుగుదేశంపార్టీ డిజిపికి ఓ లేఖ రాసింది. జైల్లో జగన్ ని ఎవరుపడితేవాళ్లు ఎప్పుడు పడితే అప్పుడు కలుసుకుంటున్నారని, ఆయన ఓ సెల్ ఫోన్ కూడా మెయిన్ టెయిన్ చేస్తున్నారని ఆరోపించింది. టిడిపి చేసిన ఆరోపణలుకూడా పరోక్షంగా జగన్ కి కలిసొచ్చేలా కనిపిస్తున్నాయ్. ఎందుకంటే వైకాపాలోకి జంప్ చేయాలనుకునేనేతలు ఇప్పుడు జగన్ ఫోన్ నెంబర్ ని వెతికిపట్టే పనిలోపడ్డారు. ఇప్పుడా దానికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఎవరైనా జగన్ సెల్ ఫోన్ నెంబర్ ని ఇవ్వగలిగితే లక్షలు కుమ్మరించడానికి నేతలు సిద్ధంగా ఉన్నారు. నేరుగా జైలుకెళ్లి మాట్లాడి అన్ పాపులర్ అవ్వడంకంటే సెల్ ఫోన్ లో మాట్లాడేస్తేపోలా? అన్న ఆలోచనతో నేతలు తారా స్థాయిలో జగన్ ఫోన్ నెంబర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు జగన్ కి పూర్తి స్థాయిలో ఇలా కలిసొస్తున్నాయని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.